News March 18, 2025

ఉగ్రవాదులపై దాడులు.. నెక్స్ట్ టార్గెట్ అతడేనా?

image

PAKలో లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్ హతమవడంతో ఆ సంస్థకు పెద్ద దెబ్బే తగిలింది. అయితే తర్వాతి దాడి LET వ్యవస్థాపకుడు, 26/11 దాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌పైనే జరిగే ఛాన్సుందని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 2023 రాజౌరి, 2024 రియాసి దాడుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఖతల్‌ను శనివారం గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడులు LET ఆపరేషన్స్‌ను దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు.

Similar News

News December 4, 2025

వీధికుక్కలు వెంబడిస్తే ఇలా చేయకండి!

image

బైకర్లను వీధికుక్కలు వెంబడించి భయపెట్టడం తెలిసిందే. ఈ సమయంలో కొందరు వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదానికి గురవుతుంటారు. నిన్న వరంగల్(D) మచ్చాపూర్‌లో కుక్కల భయానికి ఓ వ్యక్తి బైక్‌ను వేగంగా నడుపుతూ అదుపుతప్పి డ్రైనేజీలో పడి చనిపోయాడు. కుక్కలు వెంబడిస్తే బైక్‌ను వేగంగా నడపొద్దు. గట్టిగా అరిస్తే అవి మరింత రెచ్చిపోతాయి. రియాక్ట్ అవ్వకుండా ఉంటే అవి సైలెంట్ అవుతాయి. వాటి కళ్లలోకి నేరుగా చూడకండి.

News December 4, 2025

సిరి ధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో లాభం

image

చిరు ధాన్యాల సాగు, వినియోగం క్రమంగా పెరుగుతోంది. వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలే దీనికి కారణం. చిరుధాన్యాలను తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ని, BP, షుగర్, గుండె వ్యాధుల ముప్పును తగ్గించి రక్తహీనతను దూరం చేస్తాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు తొందరగా అలసిపోకుండా ఉండేందుకు మిల్లెట్స్ దోహదపడతాయి.

News December 4, 2025

SGB బొనాంజా.. గ్రాముకు రూ.9,859 లాభం

image

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. 2017 డిసెంబర్ 4న విడుదల చేసిన సిరీస్‌-X బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,961గా RBI నిర్ణయించింది. తాజాగా ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,820గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,859 లాభం(333%) వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. ఇటీవల సిరీస్‌-VI బాండ్లకు ₹9,121 లాభం వచ్చిన విషయం తెలిసిందే.