News April 3, 2025

మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మార్చే ప్రయత్నం: కాంగ్రెస్ MP

image

దేశంలో ముస్లింలను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నాజిర్ హుస్సేన్ ఆరోపించారు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీ వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన 123 ఆస్తులపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. అసత్య ప్రచారాలతో దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Similar News

News October 25, 2025

ఇతిహాసాలు క్విజ్ – 46 సమాధానాలు

image

1. రామాయణంలో జటాయువు సోదరుడి పేరు ‘సంపాతి’.
2. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికిన పర్వతం ‘మందరం’.
3. నాగుల చవితి కార్తీక మాసంలో వస్తుంది.
4. ఇంద్రుడి గురువు ‘బృహస్పతి’.
5. అష్టదిక్పాలకులలో ఉత్తర దిక్కును పాలించేది ‘కుబేరుడు’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 25, 2025

ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి: CBN

image

AP: మొంథా తుఫాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని CM CBN ఆదేశించారు. తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ‘జిల్లాలకు ఇన్ఛార్జిల్ని వేయాలి. అవసరమైతే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి. కాకినాడలో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ సేవల్ని అందించాలి. 100 KM వేగంతో గాలులు, 100MM మేర వర్షాలు పడతాయి. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

News October 25, 2025

వరల్డ్ కప్.. RO-KO ఆడతారహో!

image

క్రికెట్ ప్రపంచం మొత్తం ‘RO-KO’ అంటూ నినదిస్తోంది. AUSపై మూడో వన్డేలో రోహిత్(121*)-కోహ్లీ(74*) అదరగొట్టేశారు. ఈ ప్రదర్శనతో ఫ్యాన్స్‌లో WC-2027పై ఆశలు చిగురించాయి. మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో వరల్డ్ కప్ గురించి అడగ్గా.. ఎగ్జైటెడ్‌గా ఉన్నామని రోహిత్, కోహ్లీ సమాధానం చెప్పారు. దీంతో ‘వీళ్లకు ఏజ్ జస్ట్ ఏ నంబర్, వరల్డ్ కప్‌కు రో-కో వస్తున్నారు, ఈ జోడీ ఉంటే కప్పు మనదే’ అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.