News October 22, 2024

సత్యకుమార్ యాదవ్‌పై హత్యాయత్నం.. పోలీసులకు ఫిర్యాదు

image

AP: మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై గత వైసీపీ ప్రభుత్వంలో హత్యాయత్నం జరిగిందని బీజేవైఎం నేత సురేశ్ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2023లో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తుండగా ఆయనతో పాటు కార్యకర్తలపై అప్పటి ఎంపీ నందిగం సురేశ్, మరికొందరు దాడికి యత్నించారని ఆరోపించారు. ఆ సమయంలో ఫిర్యాదును తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఫిర్యాదును స్వీకరించిన SP చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Similar News

News October 22, 2024

షా, ఫడ్నవీస్‌తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో సంచలనం!

image

మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముంబైలో అమిత్ షా సమక్షంలో DY CM దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన UBT నేతలు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ కలిశారన్న వార్తలు సంచలనంగా మారాయి. వీరు మహాయుతిలో చేరతారేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఈ భేటీ వార్తలను రౌత్ కొట్టిపారేసినా ఎక్కువ సీట్లను రాబట్టేలా MVAను బెదిరించేందుకు SS UBT ఇలాంటి ఫీలర్లు వదులుతోందన్న విమర్శలూ వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్.

News October 22, 2024

హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్షసాయి

image

యూట్యూబర్ హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లైంగిక ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు హర్షసాయి తనను లైంగికంగా వేధించారని నటి మిత్రా శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.

News October 22, 2024

UPSC-ESE-2025 నోటిఫికేషన్ విడుదల

image

ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2025కు UPSC నోటిఫికేషన్ ఇచ్చింది. దేశంలోని రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్ పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. నవంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణ చేసుకోవచ్చు. వచ్చే ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.