News August 17, 2025
ఆగస్టు 17: చరిత్రలో ఈరోజు

1817: అమరావతి సంస్థాన పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మరణం
1866: హైదరాబాద్ ఆరో నవాబు మహబూబ్ అలీ ఖాన్ జననం
1949: తెలుగు గేయ రచయిత భువన చంద్ర జననం
1964: డైరెక్టర్ ఎస్.శంకర్ జననం
1980: రచయిత కొడవటిగంటి కుటుంబరావు మరణం
1993: హీరోయిన్ నిధి అగర్వాల్(ఫొటోలో)జననం
ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం
Similar News
News August 17, 2025
మెదడు చురుగ్గా పని చేసేందుకు సింపుల్ ట్రిక్

కొన్ని రకాల పనులకు మీరు రెగ్యులర్గా వాడే చేయికి బదులు అప్పుడప్పుడు మరో చేతిని వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తినడం, వంట చేయడం, పళ్లు తోమడం, ఫోన్ వాడటం, తల దువ్వడం, షార్ట్ నోట్ రాయడం లాంటివి చేయాలని చెబుతున్నారు. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ వల్ల మెదడు యాక్టివ్, స్ట్రాంగ్ అవుతుందని తెలిపారు. అలాగే కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ మెరుగై మెదడు చురుగ్గా పని చేస్తుందని వివరించారు. మీరూ ట్రై చేయండి.
SHARE IT
News August 17, 2025
జ్యోతి మల్హోత్రాపై 2,500 పేజీల ఛార్జిషీట్

పాక్ స్పై, హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై సిట్ 2,500 పేజీల ఛార్జ్షీట్ను హిస్సార్ కోర్టుకు సమర్పించింది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. ఆమెకు ఐఎస్ఐ ఏజెంట్లు షాకిర్, హసన్ అలీ, నాసిర్ థిల్లన్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్ను కూడా జ్యోతి కలిసినట్లు తెలిపారు.
News August 17, 2025
US టీమ్ భారత పర్యటన రద్దు?

భారత్-అమెరికా మధ్య ఆరో విడత వాణిజ్య చర్చలను కొనసాగించేందుకు ఈ నెల 25న యూఎస్ బృందం ఢిల్లీ రావాల్సి ఉంది. కానీ యూఎస్ ప్రతినిధుల టూర్ రద్దైనట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతల్లో చర్చలు కొనసాగాయి. చివరి రౌండ్ చర్చలు వాషింగ్టన్లో భారత చీఫ్ నెగోషియేటర్ రాజేశ్ అగర్వాల్, యూఎస్ ప్రతినిధి బ్రెండన్ లించ్ మధ్య జరిగాయి.