News August 22, 2025
ఆగస్టు 22: చరిత్రలో ఈరోజు

1922: చింతపల్లి పోలీస్స్టేషన్పై అల్లూరి సీతారామరాజు దాడి
1932: నృత్యకారుడు, నటుడు గోపీకృష్ణ జననం
1955: మెగాస్టార్ చిరంజీవి జననం
1984: తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు మరణం
1989: గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ జననం
2014: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అనంతమూర్తి మరణం
* ప్రపంచ జానపద దినోత్సవం
Similar News
News August 22, 2025
నాగవంశీపై ట్రోల్స్.. ఆర్జీవీ రియాక్షన్ ఇదే

ప్రముఖ నిర్మాత నాగవంశీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్పై దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. ‘నాగవంశీ ఓ దయగల ప్రొడ్యూసర్. ట్రోల్స్ ఆయనను ఎప్పటికీ కిందకు లాగలేవు. పది రెట్ల వేగంతో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు’ అంటూ పేర్కొన్నారు. కాగా ‘కింగ్డమ్’, ‘వార్2’ సినిమాల వల్ల నాగవంశీకి భారీ నష్టాలు వచ్చినట్లు ప్రచారం జరగడంతో నెటిజన్లు అతడిపై ట్రోల్స్కు దిగుతున్న విషయం తెలిసిందే.
News August 22, 2025
EP-43: ధనవంతులయ్యే మార్గాలు ఇవే: చాణక్య నీతి

కొంతమంది ఎంత కష్టపడినా ధనవంతులు కాలేరు. ధనవంతులు అయ్యేందుకు కొన్ని పద్ధతులు పాటించాలని చాణక్య నీతి చెబుతోంది. ‘ఎల్లప్పుడూ నిజాయితీగా డబ్బు సంపాదించాలి. ఇలాంటి డబ్బు మాత్రమే ఎప్పటికీ నిలుస్తుంది. ఎంత డబ్బు సంపాదించినా అది మీ నియంత్రణలోనే ఉండాలి. అనవసర వస్తువులపై ఖర్చు చేయకూడదు. డబ్బును తెలివిగా ఖర్చు పెట్టాలి. ఇలా చేస్తే మీ చెంతకే సక్సెస్ వస్తుంది’ అని తెలుపుతోంది. #<<-se>>#chanakyaneeti<<>>
News August 22, 2025
పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: సదరం సర్టిఫికెట్ల పున:పరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికి అన్యాయం జరగకూడదని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ పొందేవారికి ఎప్పటిలా పింఛన్ అందించాలని ఆదేశించారు. పెన్షన్లపై ఉన్నతాధికారులతో CM సమీక్ష నిర్వహించారు. ‘అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు పొందినవారిపై ఖచ్చితమైన పరిశీలన చేయాలి. అవసరమైతే దివ్యాంగులకు పంపిన నోటీసులను వెనక్కి తీసుకోవాలి’ అని ఆదేశించారు.