News September 10, 2024

16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వాడొద్దన్న AUS ప్రభుత్వం!

image

సోషల్‌మీడియా వినియోగం పిల్లలను తప్పుదారి పట్టిస్తోందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం 16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వినియోగించకుండా నిషేధం విధించనుంది. మొబైల్‌కే పరిమితం కాకుండా పిల్లలు మైదానంలోకి వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పీఎం వెల్లడించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టిక్‌టాక్‌ తదితర యాప్స్‌ను పిల్లలు వాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News January 2, 2026

75 లక్షల ఆర్డర్లు డెలివరీ: జొమాటో CEO

image

డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో 75L డెలివరీలు చేసినట్లు జొమాటో, బ్లింకిట్‌ సంస్థల CEO దీపిందర్ గోయల్ తెలిపారు. 4.5లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లు 63 లక్షల మందికి వస్తువులు అందజేశారని పేర్కొన్నారు. బెదిరింపులను ఎదుర్కొని, వెనక్కి తగ్గకుండా, ప్రోగ్రెస్‌ను వారు ఎంచుకున్నారని చెప్పారు. ‘ఈ <<18690914>>పని విధానం<<>> అన్యాయమైతే అంతమంది పని చేసేందుకు ఎందుకొస్తారు? వచ్చినా ఎక్కువ కాలం ఎలా కొనసాగుతారు?’ అని ట్వీట్ చేశారు.

News January 2, 2026

త్వరలో 30వేల పోస్టులకు నోటిఫికేషన్

image

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. త్వరలో తపాలా శాఖలో 30వేల జీడీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. టెన్త్‌లో మెరిట్ ఆధారంగా గ్రామ స్థాయిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వయసు 18 నుంచి 40ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. నెలకు BPMకు రూ.18వేలు, ABPMకు రూ.16వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది. వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in

News January 2, 2026

‘SIR’ను త్వరగా మొదలుపెట్టండి.. జనసేన సూచన

image

AP: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను త్వరగా రాష్ట్రంలో ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని జనసేన పార్టీ కోరింది. ఢిల్లీలోని ఈసీ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో జనసేన ప్రతినిధులు భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, బలోపేతంగా మార్చేందుకు ఈసీ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇప్పటికే టీడీపీ SIR, AI వినియోగంపై ప్రతిపాదనలు చేసింది.