News February 23, 2025

ఆస్ట్రేలియా రికార్డ్.. ICC టోర్నీల్లో హయ్యెస్ట్ ఛేజ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఆస్ట్రేలియా రికార్డ్ సృష్టించింది. ఐసీసీ వన్డే టోర్నీల్లో హయ్యెస్ట్ రన్ ఛేజ్ చేసిన టీమ్‌గా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో AUS 352 టార్గెట్‌ను ఛేదించింది. గతంలో ఈ రికార్డ్ పాకిస్థాన్ పేరిట ఉండేది. 2023 WCలో శ్రీలంక నిర్దేశించిన 345 లక్ష్యాన్ని పాక్ ఛేజ్ చేసింది. ఇక CTలో హయ్యెస్ట్ రన్ ఛేజ్ జట్టుగా శ్రీలంక(322) ఉండగా తాజాగా ఆసీస్ దాన్ని అధిగమించింది.

Similar News

News January 9, 2026

ట్రంప్ దెబ్బకు మార్కెట్ బేజారు.. భారీ నష్టాలు

image

భారత్‌పై 500% సుంకాలు విధించే ప్రపోజల్ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 193 పాయింట్లు పడిపోయి 25,683 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 604 పాయింట్లు పతనమై 83,576 వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాలుగోరోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. 2025 సెప్టెంబర్ తర్వాత ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి.

News January 9, 2026

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

image

ఉదయ్‌పూర్‌(RJ)లోని లీలా ప్యాలెస్‌ హోటల్‌కు కన్జూమర్ కోర్టు ₹10 లక్షల జరిమానా విధించింది. చెన్నైకి చెందిన దంపతులు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో హోటల్ సిబ్బంది ‘మాస్టర్ కీ’తో గదిలోకి ప్రవేశించడమే దీనికి కారణం. వద్దని అరిచినా వినకుండా లోపలికి తొంగిచూసి ప్రైవసీకి భంగం కలిగించారని బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ‘Do Not Disturb’ బోర్డు లేనందునే లోపలికి వెళ్లామని యాజమాన్యం వాదించినా కోర్టు ఏకీభవించలేదు.

News January 9, 2026

భూరికార్డులను ఎవరూ మార్చలేరు: చంద్రబాబు

image

AP: పాస్‌బుక్స్ పంపిణీ పవిత్రమైన కార్యక్రమమని CM చంద్రబాబు తెలిపారు. తూ.గో.జిల్లా రాయవరంలో ఆయన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ప్రాణం పోయినా రైతు భూమి కోల్పోయేందుకు అంగీకరించడు. సున్నితమైన అంశంతో పెట్టుకోవద్దని మాజీ CMకు చెప్పినా వినలేదు. కూటమి రాకపోయుంటే రైతుల భూములు గోవిందా గోవిందా. రాజముద్ర వేసి మళ్లీ పాస్‌బుక్స్ ఇస్తున్నాం. మీ భూరికార్డులను ఎవరూ మార్చలేరు. మోసం చేయలేరు’ అని స్పష్టం చేశారు.