News February 25, 2025
నేడు ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ రెండు బలమైన జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో మరో బిగ్ స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ను అలరించే అవకాశం ఉంది. కాగా గ్రూప్-బిలోని ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో మ్యాచ్ గెలిచాయి. నేటి గేమ్లో గెలిచే టీమ్ సెమీస్ స్థానాన్ని పదిలం చేసుకోనుంది.
Similar News
News February 25, 2025
MLC ఎన్నికల్లో CBN, లోకేశ్కు ఓటు హక్కు.. పవన్ దూరం

AP: CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలో గ్రాడ్యుయేట్ MLC ఓటు హక్కు పొందారు. ఈ నెల 27న తాడేపల్లి (M) గాదె రామయ్య, సీతారావమ్మ మండల పరిషత్ స్కూల్లో వీరు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదే నియోజకవర్గంలోనే ఉంటున్న Dy.CM పవన్ పట్టభద్రుడు కాకపోవడంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మరోవైపు, మాజీ CM జగన్ తాడేపల్లిలోనే ఉంటున్నా ఆయన ఓటు హక్కు పులివెందులలో ఉంది.
News February 25, 2025
నలుగురు అన్నదాతల ఆత్మహత్య

TG: అప్పుల బాధతో గత 2 రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి(D) వీరారెడ్డిపల్లికి చెందిన రాంచంద్రయ్య పత్తి సాగు చేయగా వర్షాభావంతో దిగుబడి రాలేదు. దీంతో అప్పు తీర్చలేక ఆదివారం పురుగుమందు తాగి చనిపోయారు. సిరిసిల్ల(D) పోతుగల్లో దేవయ్య, భూపాలపల్లి(D) మొగుళ్లపల్లిలో రాజు, మహబూబాబాద్(D) వేములపల్లిలో వెంకన్న పంట దిగుబడి రాకపోవడంతో అప్పు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు.
News February 25, 2025
నేటితో ముగియనున్న MLC ఎన్నికల ప్రచారం

TG: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం ముగియనుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ను తలపించేలా నెల రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న పోలింగ్ జరగనుంది.