News September 9, 2025

నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

image

ఏపీలో నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ మొదలుకానుంది. విద్యార్థులు ఈనెల 12వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 10నుంచి 13వరకు జరుగుతుంది. వెబ్‌ఆప్షన్ల నమోదు 13 నుంచి 15వరకు ఉండనుంది. వెబ్ ఆప్షన్స్ 16న ఎడిట్ చేసుకోవచ్చు. 18న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 19, 20న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.

News September 9, 2025

కార్తీక్ ఆర్యన్ ఇంట్లో శ్రీలీల పూజలు.. పిక్స్ వైరల్

image

డేటింగ్ రూమర్స్ వేళ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ఆర్యన్ ఇంట్లో హీరోయిన్ శ్రీలీల వినాయక చవితి పూజలు చేశారు. ఈ వేడుకలకు శ్రీలీల తల్లి కూడా హాజరుకావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య రిలేషన్ కన్ఫామ్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా కార్తీక్-శ్రీలీల కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీలో నటిస్తున్నారు.

News September 9, 2025

రివర్స్ వాకింగ్ చేస్తే ప్రయోజనాలు ఇవే!

image

రివర్స్ వాకింగ్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ‘వెనక్కి నడవడం వల్ల ముందుగా కాలి వేళ్ల భాగం, ఆ తర్వాత పాదం మొత్తం నేలకు ఆనుకుంటుంది. దీంతో ఎక్కువ కేలరీలు బర్న్ అయ్యి బరువు తగ్గొచ్చు. మోకాళ్లు, నడుము నొప్పి ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వెన్ను నొప్పి, మెడనొప్పి, గాయాల నుంచి త్వరగా కోలుకుంటారు. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది’ అని చెబుతున్నారు.

News September 9, 2025

జూబ్లీహిల్స్ బరిలో గోపీనాథ్ సతీమణి?

image

TG: మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. BRS సెంటిమెంట్‌గా గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. మాగంటి సునీత గోపీనాథ్ పేరిట నిత్యం పోస్టులు చేస్తున్నారు. మరోవైపు తన ఇద్దరు కూతుళ్లు అక్షర, దిశిరను జనాల్లోకి పంపుతున్నారు. వారు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ మమేకమవుతున్నారు.

News September 9, 2025

దేశంలో అత్యధిక మరణాలు ఈ వ్యాధితోనే!

image

మన దేశంలో (2021-2023) అత్యధిక మంది గుండె జబ్బుల (31%) వల్లే మరణిస్తున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే తెలిపింది. ఆ తర్వాత 9.3% మంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, 6.4% మంది కణజాల సమస్యలు, 5.7% మంది శ్వాసకోశ వ్యాధులు, 4.9% మంది జ్వరాలు, 3.7% మంది గాయాలు, 3.5% మంది షుగర్ వ్యాధితో చనిపోతున్నట్లు వివరించింది. 15-29 ఏళ్ల మధ్యవారు ఎక్కువగా ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నట్లు తెలిపింది.

News September 9, 2025

ఈ అల్పాహారం ఆరోగ్యానికి మేలు!

image

ఇడ్లీ, దోశ, ఉప్మా: పులియబెట్టిన పిండితో చేస్తారు కాబట్టి వీటిలో పోషకాలు, విటమిన్స్ ఎక్కువ.
పెసరట్టు, ఆమ్లెట్, మొలకలు: వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల ఆరోగ్యానికి, ఆకలి నియంత్రణకు సహాయపడుతుంది.
రాగి జావ, ఓట్స్: వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
పండ్లు, నట్స్, పెరుగు: వీటిలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
* పోషకాలు సమృద్ధిగా ఉండే అల్పాహారాన్ని తినడం మంచిది.

News September 9, 2025

HDFC లోన్లపై వడ్డీ రేటు తగ్గింపు

image

HDFC బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది రుణ కాలపరిమితిని బట్టి 8.55%-8.75% మధ్య ఉండనుంది. ఓవర్ నైట్/ఒక నెల MCLR 8.55%, 3 నెలలకు 8.60%, 6 నెలలు, ఏడాదికి 8.65%, రెండేళ్ల వ్యవధికి 8.70%, మూడేళ్లపై 8.75 శాతంగా ఉంటుంది. ఫలితంగా బ్యాంకులో తీసుకున్న లోన్లపై వడ్డీ తగ్గుతుంది. HDFCలో హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 7.90% నుంచి 13.20శాతంగా ఉంది.

News September 9, 2025

హిమాచల్, పంజాబ్‌లో నేడు ప్రధాని పర్యటన

image

ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లో పీఎం మోదీ ఇవాళ పర్యటించనున్నారు. తొలుత మ.1.30 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం ధర్మశాలలో అధికారులతో రివ్యూ నిర్వహించి, సూచనలు చేయనున్నారు. ఇక సాయంత్రం 4.15 గంటలకు పంజాబ్‌లోని గర్దాస్‌పూర్ చేసుకుంటారు. అక్కడ కూడా ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు.

News September 9, 2025

కవిత్వంతో తెలంగాణ ప్రజల కష్టాలను చాటిన కాళోజీ

image

ప్రజాకవి, తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని కాళోజీ నారాయణరావు జయంతి నేడు. తన రచనల ద్వారా తెలంగాణ సంస్కృతి, భాష, ప్రజల కష్టాలను ప్రపంచానికి చాటిన ఆయన జయంతిని ప్రభుత్వం ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా నిర్వహిస్తోంది. ఆయన నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై ధైర్యంగా గళమెత్తారు. ఆయన రచనల్లో ‘నా గొడవ’ అనే కవితా సంపుటి తెలంగాణ ప్రజల పోరాటాలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. *జోహార్ కాళోజీ

News September 9, 2025

యూరియా కొరతపై నేడు వైసీపీ నిరసనలు

image

AP: రాష్ట్రంలో యూరియా కొరతపై YCP ‘అన్నదాత పోరు’ పేరిట ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. రైతులు, రైతు సంఘాలతో కలిసి అన్ని RDO కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాలని పార్టీ అధ్యక్షుడు జగన్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పంటలకు ఉచిత బీమాను పునరుద్ధరించాలని, వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని అధికారులకు YCP నేతలు వినతి పత్రాలు అందించనున్నారు.