India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆసియా కప్-2025లో భాగంగా భారత్ రేపు తన తొలి మ్యాచ్ ఆడనుంది. యూఏఈతో జరిగే ఆ మ్యాచ్ బుధవారం రాత్రి 8 గం.కు ప్రారంభం కానుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం జట్టు అంచనా..
టీమ్: గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (C), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, జితేశ్ శర్మ (WK), బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.
TG: రీజినల్ రింగ్ రోడ్డు పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ కోరారు. దీనికి సంబంధించి 90% భూసేకరణ పూర్తయిందని ఆయనకు వివరించారు. రావిర్యాల-అమన్గల్-మన్ననూర్ రోడ్డును 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని కోరారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుమతివ్వాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన CP రాధాకృష్ణన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రజాజీవితంలో మీ దశాబ్దాల అనుభవం దేశ ప్రగతికి ఎంతో దోహదపడనుంది. మీ బాధ్యతల్లో విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నా’ అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘పేదల ఉన్నతికి, సమాజ సేవకు జీవితం అంకితం చేశారు. ఉత్తమ VPగా నిలుస్తారన్న నమ్మకం నాకు ఉంది’ అని PM మోదీ పేర్కొన్నారు. అమిత్షా, CBN, పవన్, లోకేశ్, జగన్ ఆయనకు విషెస్ తెలిపారు.
అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. SM, ఆన్లైన్లో ఎగ్జామ్ పేపర్స్పై చర్చించడం, షేర్ చేయడం నేరమని తెలిపింది. ఇలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయంది. దేశవ్యాప్తంగా పబ్లిక్ ఎగ్జామ్స్లో అవకతవకలు నివారించడానికి కేంద్రం ఇటీవల పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జైలు శిక్ష, భారీ ఫైన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని SSC హెచ్చరించింది.
AP: అటవీ శాఖలో 10 ఠాణేదార్ (అసిస్టెంట్ బీట్ ఆఫీసర్తో సమానం)పోస్టులకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 1 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ ఉంటుందని, త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని APPSC పేర్కొంది. పూర్తి వివరాలు, ఎగ్జామ్ సిలబస్ కోసం ఇక్కడ <
దేశానికి అత్యధిక మంది ఉపరాష్ట్రపతులను అందించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తాజాగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి వైస్ ప్రెసిడెంట్ అయిన మూడో వ్యక్తి కావడం విశేషం. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్(1952-62, రెండు సార్లు), రామస్వామి వెంకటరామన్(1984-87) ఎన్నికయ్యారు. కాగా ఉమ్మడి AP నుంచి గతంలో జాకీర్ హుస్సేన్, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా సేవలందించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి స్పందించారు. ‘ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు.. ఓటమినీ స్వీకరించాలి. మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా’ అని తెలిపారు. కాగా ఫలితాల్లో NDA అభ్యర్థి రాధాకృష్ణన్కు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో 15 మంది MPల <<17659975>>ఓట్లు<<>> చెల్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులకే ఓటు వేయరాకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేతలను ఎన్నుకొని ఏం లాభమని అంటున్నారు. ఈ 15 ఓట్లతో ఫలితం మారకున్నా మెజార్టీపై ప్రభావం పడేది. గతంలో TGలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో భారీగా గ్రాడ్యుయేట్ల ఓట్లు చెల్లకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మీ కామెంట్?
AP: ఏడాది క్రితమే ఈవీఎంల వినియోగంపై ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసిందని SEC నీలం సాహ్ని తెలిపారు. ‘S-3 మోడల్ ఈవీఎంలో మెమరీ డ్రైవ్ తీసి వెంటనే మరొక చోట వాడుకునే అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల కోసం 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయి. 10,670 M-2 మోడల్ ఈవీఎంలు ఇప్పటికే మనవద్ద ఉన్నాయి. ఒకవేళ ఈవీఎంలు అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి తీసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
C.P.రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. ఈయన 1957లో తమిళనాడులో జన్మించారు. 16ఏళ్ల వయసు నుంచే RSS, జన్ సంఘ్లో పని చేశారు. 1998, 99లో కోయంబత్తూరు BJP నుంచి MPగా గెలిచారు. 2004, 14, 19లో ఓడిపోయారు. 2004-07 వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పని చేశారు. 2023లో ఝార్ఖండ్ గవర్నర్ అయ్యారు. 2024లో TG గవర్నర్గానూ అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులైలో MH గవర్నర్గా పని చేశారు.
Sorry, no posts matched your criteria.