India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పహల్గామ్ దాడిపై భారతావని కంటతడి ఆగకముందే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది. ఏప్రిల్ 23న డ్యూటీ చేస్తూ పొరపాటున సరిహద్దు దాటిన BSF జవానును పాకిస్థాన్ రేంజర్లు బంధించారు. ఫిరోజ్పూర్ (పంజాబ్) వద్ద సైనికుడు తమ భూభాగంలోకి ప్రవేశించడంతోనే అరెస్టు చేశామని పాక్ సైన్యం చెబుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడి వెనక పాక్ హస్తం ఉందని ప్రకటించిన కేంద్రం ఆ దేశంపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ పలు నిర్ణయాలు తీసుకుంది.
* అట్టారీ- వాఘా బార్డర్ మూసివేత
* భారతీయులకు సార్క్ వీసాలు రద్దు
* భారత్తో అన్ని వ్యాపార సంబంధాలు తెగదెంపులు
* సింధూ జలాలను ఆపడం యుద్ధం ప్రకటించడమే అని ప్రకటన
* పాక్లోని భారతీయులు వెనక్కి వెళ్లాలని ఆదేశం
ఏపీ కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. జూన్ 1న ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు SLPRB ప్రకటనలో పేర్కొంది. వైజాగ్, కాకినాడ, గుంటూరు, కర్నూల్, తిరుపతిలో ఎగ్జామ్ ఉంటుందని తెలిపింది. 6,100 పోస్టులకు మొత్తం 4,59,182 మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయగా 95,208 మంది ఫిజికల్ టెస్టుకు అర్హత సాధించారు. దేహధారుడ్య పరీక్షల్లో 38,910 మంది ఫైనల్ టెస్టుకు క్వాలిఫై అయ్యారు.
పహల్గాం దాడిపై భారత్ తీవ్రంగా స్పందిస్తుండటంతో పాక్ అప్రమత్తమైంది. సైనికులకు సెలవులు రద్దు చేసిన పాక్ ప్రభుత్వం, ఇప్పటికే లీవ్లో ఉన్నవారు వెంటనే వెనక్కి రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఇక భారత్ దాడి చేస్తే తిప్పికొట్టేందుకు, దేనికైనా సిద్ధంగా ఉండాలని సైనికులకు స్పష్టం చేసిందట. అటు ఎయిర్ అటాక్స్ భయంతో భారత విమానాలకు తమ గగనతలం నుంచి ప్రయాణించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై భారత్ పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఈ క్రమంలో స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్ను ఆ దేశం క్లోజ్ చేసింది. ఇవాళ ఉదయం నుంచే నష్టాల్లో ట్రేడ్ ప్రారంభించిన ఆ దేశ స్టాక్ మార్కెట్లు 2 శాతానికి పైగా షేర్లు కోల్పోయాయి. మున్ముందు మరింత పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అర్జున్ టెండూల్కర్ను తన కుమారుడు యువరాజ్ సింగ్కు అప్పగిస్తే క్రిస్ గేల్లా తయారు చేస్తాడని ఆయన తండ్రి యోగ్రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘3 నెలలపాటు యువీ దగ్గర అర్జున్ శిక్షణ తీసుకోవాలి. బౌలింగ్ కంటే బ్యాటింగ్పైనే ఆయన ఎక్కువగా దృష్టి సారించాలి. గిల్, అభిషేక్ శర్మలాగే అతడూ స్టార్గా ఎదుగుతాడు’ అని పేర్కొన్నారు. కాగా అర్జున్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రజలకు ఇచ్చిన వీసాలన్నింటినీ భారత విదేశాంగ శాఖ రద్దు చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పాకిస్థానీల వీసాలు ఈ APR 27 వరకు మాత్రమే చెల్లుతాయని స్పష్టం చేసింది. ఇక మెడికల్ వీసాలతో భారత్లో ఉన్నవారు ఏప్రిల్ 29 లోపు వెళ్లిపోవాలని పేర్కొంది. మరోవైపు భారతీయులెవరూ పాక్కు వెళ్లొద్దని చెప్పడంతో పాటు ఇప్పటికే ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వీలైనంత త్వరగా తిరిగి రావాలని సూచించింది.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గుడ్లతో తయారు చేసే మయోనీస్ను తమిళనాడు ప్రభుత్వం ఏడాది పాటు బ్యాన్ చేసింది. అలాగే దాన్ని హైరిస్క్ ఆహార పదార్థంగా ప్రకటించింది. అక్కడి ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. పచ్చి గుడ్డు, వెజిటెబుల్ ఆయిల్, వెనిగర్ తదితరాలతో మయోనీస్ తయారు చేస్తున్నట్లు పేర్కొంది. తయారీ, నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడంతో దాన్ని తిన్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు వివరించింది.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంపై దాయాది దేశం స్పందించింది. సింధు నీటిలో ప్రతి నీటి చుక్కా తమ హక్కు అని తెలిపింది. ఒప్పందం నుంచి వైదొలగడం చట్ట వ్యతిరేకమని చెప్పింది. ఈ నిర్ణయాన్ని న్యాయ, రాజకీయపరంగా బలంగా ఎదుర్కొంటామని వివరించింది. ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు.
AP: మే నెలలో జరిగే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల <
✒ 19- ఫస్ట్ లాంగ్వేజ్& పేపర్-1(కాంపోజిట్ కోర్సు)
✒ 20- సెకండ్ లాంగ్వేజ్ ✒ 21- ఇంగ్లిష్ ✒ 22- గణితం
✒ 23- ఫిజిక్స్ ✒ 24- బయోలజీ ✒ 26- సాంఘిక శాస్త్రం
✒ 27- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(కాంపోజిట్ కోర్సు)&OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
✒ 28-OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
* పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం
Sorry, no posts matched your criteria.