India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీలో 5,346 <

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై 3 నెలలు పూర్తవుతున్నా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంపై అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. వెంటనే శిక్షణ ప్రారంభించాలని కోరుతున్నారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు 2022 NOVలో నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ పూర్తయినా లీగల్ చిక్కులతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. గతేడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి ఆగస్టులో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాలేదు.

ప్రస్తుతం కాలంలో మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డయాబెటీస్. దీన్నే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. దీంతో బాధపడే వారు ఫైబర్ రిచ్ ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తృణధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. అవకాడో, డ్రైఫ్రూట్స్, నట్స్, బ్రోకలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, టోఫు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖతార్లో సూపర్వైజర్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, టెక్నికల్ సర్టిఫికెట్తో పాటు పని అనుభవం గలవారు ఇవాళ్టి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెలకు రూ.1,94,000 నుంచి రూ.2,38,000 వరకు చెల్లిస్తారు. వయసు 45ఏళ్ల లోపు ఉండాలి. వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/

మీర్జాగూడ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని <<18186628>>టిప్పర్<<>> యజమాని లక్ష్మణ్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బస్సు డ్రైవర్ వేగంగా వస్తూ గుంతను తప్పించబోయి మాపైకి దూసుకొచ్చాడు. వెంటనే డ్రైవర్ ఆకాశ్ నన్ను నిద్రలో నుంచి లేపాడు. క్షణాల్లోనే బస్సు మా టిప్పర్ను ఢీకొట్టింది. మా డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపాడని, గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు’ అని తెలిపారు.

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులంటున్నారు. * కరివేపాకు, పాలతో చేసిన పేస్ట్ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. * కరివేపాకు మరిగించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది.

TG: రెండేళ్ల క్రితం డెయిరీఫామ్ ప్రారంభించి రూ.15లక్షలుపైగా నష్టపోయారు కామారెడ్డి(D) పెద్దమల్లారెడ్డికి చెందిన ఐదుగురు మిత్రులు. రూ.27 లక్షల పెట్టుబడి, 17 గేదెలతో ఫామ్ ప్రారంభించారు. గేదెల ఎంపికలో తప్పులు, అనుభవలేమి, ఊహించని ఖర్చులతో 6 నెలల క్రితం ఫామ్ మూసేశారు. అందుకే డెయిరీఫామ్ పెట్టేముందు పూర్తిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ✍️ పాడి, వ్యవసాయ సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

<

1. ధృతరాష్ట్రుడి రథసారథి ఎవరు?
2. కంసుడి తండ్రి ఎవరు?
3. శశాంకుడు అంటే ఎవరు?
4. విశ్వకర్మ పుత్రిక ఎవరు?
5. తెలుగు సంవత్సరాలు ఎన్ని?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

TG: ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెంను తిరిగి విలీనం చేయాలని కోరారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.