India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరి కోత యంత్రంతో పైరును కోశాక దుక్కి చేయకుండా ఇతర పంట విత్తనాలను విత్తే పద్ధతిని జీరో టిల్లేజి సాగు పద్ధతి అంటారు. ఇది మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు, శనగకు అనుకూలం. ఈ పద్ధతిలో విత్తేటప్పుడు చాలినంత తేమ నేలలో లేకపోతే ఒక తడి ఇచ్చి విత్తుకొవడం మంచిది. విత్తనాలను చేతితో విత్తే పరికరాలతో నాటితే సమయం ఆదా అవుతుంది. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ ఉండేట్లు విత్తుకోవాలి.

ఉదయం నిద్ర లేవగానే కర దర్శనం చేసుకుంటే లక్ష్మీ, సరస్వతీ, విష్ణుమూర్తులను దర్శించుకున్నట్లే అని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఆచారం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. రాత్రంతా కదలిక లేకుండా ఉన్న కంటి నరాలకు ఈ ప్రక్రియ చిన్న వ్యాయామంలా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల కళ్లకు నెమ్మదిగా కదలిక లభిస్తుంది, కంటి దోషాలు రాకుండా నివారిస్తుంది.
☞మన ఆచారాలు, వాటి వెనకున్న సైన్స్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

వయసు తక్కువగా ఉన్నా కూడా అతిగా మూత్రవిసర్జనకు వెళ్తుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కారణమంటున్నారు నిపుణులు. పెల్విక్ నొప్పి, పీరియడ్స్లో బ్లీడింగ్ ఎక్కువగా అవడం, మెనోపాజ్ వల్ల ఇలా జరుగుతుందంటున్నారు. అలాగే మూత్రం ఆపుకోలేకపోవడానికి పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణం, కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్ల మార్పుల వంటివి కారణం. దీన్ని నివారించడానికి కెగెల్ వ్యాయామాలు ఉపయోగపడతాయంటున్నారు.

కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ |
కరమూలే తు గోవింద ప్రభాతే కరదర్శనం ||
అర్థం: మన అరచేతి ముందు భాగంలో (వేళ్ల చివర) లక్ష్మీ దేవి (సంపద), మధ్య భాగంలో సరస్వతీ దేవి (జ్ఞానం), మూలంలో గోవిందుడు (శక్తి) నివసిస్తారు. అందుకే ఉదయం వేళ చేతులను చూసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ మంత్రాన్ని నిద్ర లేవగానే పఠిస్తే ఆ రోజు సానుకూలంగా మొదలవుతుందని, రోజంతా దైవశక్తి తోడుగా ఉంటుందని నమ్మకం. <<-se>>#shlokam<<>>

TG: కేంద్రం ప్రవేశ పెట్టిన పథకంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి రూ.లక్షన్నర వరకు ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య అధికంగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యా సంస్థల్లో రోడ్ సేఫ్టీ, రూల్స్పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.

<

ధాన్యాన్ని నిల్వచేసేటప్పుడు తేమ 14% కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. గింజలలో తేమ శాతం తక్కువగా ఉంటే ధాన్యం రంగు మారదు, బూజు పట్టదు, కీటకాలు ఆశించవు. ధాన్యంలో తేమ 14%కు మించినప్పుడు, నిల్వ చేసే పద్ధతి సరిగా లేనప్పుడు ధాన్యానికి కీటకాలు, తెగుళ్లు ఆశించి నష్టం జరుగుతుంది. అందుకే ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసేప్పుడు మధ్యలో అప్పుడప్పుడు చీడపీడలను పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

భూమాత మనకు ఆశ్రయమిస్తుంది. మన అవసరాల కోసం ఎన్నో వనరులనిస్తుంది. అందుకే మనం ఆమెను తల్లిలా కొలుస్తాం. అన్నం పెట్టే అన్నపూర్ణలా కీర్తిస్తాం. అలాంటి త్యాగమూర్తికి కృతజ్ఞత తెలపడం, ఆ తల్లిపై పాదాలు మోపుతున్నందుకు క్షమాపణ కోరడం మన బాధ్యత. అందుకే భూదేవిని నమస్కరించాలి. ఉదయం లేవగానే పాదాలను నెమ్మదిగా నేలను తాకించడం వలన భూమిలోని సానుకూల శక్తి మెళ్లిగా మనలోకి ప్రవేశించి, ఆరోజంతా హ్యాపీగా ఉండేలా చేస్తుంది.

AP: జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘2400 మెట్రిక్ టన్నులు సిద్ధం చేస్తున్నాం. కిలో రూ.18 చొప్పున రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తాం. నవంబర్లో వర్ష సూచన నేపథ్యంలో కౌలు రైతులకు ఉచితంగా 50 వేల టార్పాలిన్లు ఇస్తాం. ధాన్యం అమ్మిన రైతులకు అదే రోజు ఖాతాల్లో డబ్బు జమయ్యేలా ఏర్పాట్లు చేశాం. సెలవుంటే తర్వాత రోజు పడతాయి’ అని తెలిపారు.

AP: 17% వరకు తేమ ఉన్న ధాన్యాన్నీ కొంటామని సివిల్ సప్లై కార్పొరేషన్ MD ఢిల్లీరావు రైతులకు హామీ ఇచ్చారు. వివిధ రైతు సంఘాల నేతలు ఆయన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మద్దతు ధరకు అదనంగా గోనె సంచులు, రవాణా ఖర్చులివ్వాలని రైతులు కోరారు. మిల్లర్ల యాజమాన్యాల నుంచి వేధింపులను అడ్డుకోవాలన్నారు. పంటనష్ట పరిహారం, ధాన్యం కొనుగోలు, తేమశాతం అంచనాపై సమస్యలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఢిల్లీరావు రైతులకు తెలిపారు.
Sorry, no posts matched your criteria.