News September 6, 2025

రూ.లక్షకు చేరువైన 22 క్యారెట్ల బంగారం ధర

image

బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,08,490కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.99,450 పలుకుతోంది. మరో రెండ్రోజుల్లో చరిత్రలో తొలిసారి రూ.లక్ష క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. అటు KG వెండిపై రూ.2,000 పెరిగి ఫస్ట్ టైమ్ రూ.1,38,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 6, 2025

ఉపవాసం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?

image

విష్ణువు భక్తుల్లో చాలామంది శనివారం నాడు ఉపవాసం ఉంటారు. దీనివల్ల దైవానుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘ఉపవాసం వల్ల శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. క్యాలరీలు బర్న్ అవుతాయి. కొవ్వు తగ్గుతుంది. డయాబెటిస్, BP అదుపులో ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది’ అని చెబుతున్నారు.

News September 6, 2025

బొజ్జ గణపయ్య! మళ్లీ రావయ్యా!

image

మా పూజలందుకోవడానికి కైలాసం నుంచి భూమి మీదకి వచ్చిన బొజ్జ గణపయ్య! ఇప్పుడు నిన్ను సాగనంపే సమయం ఆసన్నమైంది. భక్తితో నిమజ్జనం చేసి, నిన్ను మళ్లీ వచ్చే సంవత్సరం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు మీ తల్లి గంగమ్మ ఒడికి చేరి, మళ్లీ వచ్చే ఏడాది మా ఇళ్లలో, గల్లీల్లో అడుగు పెట్టాలని మనసారా కోరుకుంటున్నాం. సర్వ విఘ్నాలను తొలగించి, ఆనందంతో మమ్మల్ని ఆశీర్వదించు. గణపతి బప్పా మోరియా! మళ్లీ రావయ్యా!

News September 6, 2025

బాలాపూర్ లడ్డూ చరిత్ర తెలుసా?

image

HYD బాలాపూర్‌లో 1980లో తొలిసారిగా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. రూ.450కి స్థానికుడు కొలను మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు. లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. దీంతో ఆ ఏడాది అన్ని పనుల్లోనూ వారికి మంచి జరిగింది. లడ్డూ పొందడం వల్లే కలిసొచ్చిందని భావించిన ఆ ఫ్యామిలీ.. చాలా సార్లు వేలంలో ఆ లడ్డూను దక్కించుకుంది.

News September 6, 2025

కాసేపట్లో KCRతో హరీశ్‌రావు భేటీ!

image

TG: BRS నేత, మాజీమంత్రి హరీశ్ రావు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం KCRతో హరీశ్ రావు భేటీ కానున్నారు. కవిత ఆరోపణలపై ఆయన కేసీఆర్‌తో చర్చించే అవకాశముంది. కవితను సస్పెండ్ చేయడంతో పార్టీ హరీశ్‌రావు వైపే ఉందని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కవిత, విపక్షాల విమర్శలు, కాళేశ్వరం నివేదిక అంశంపైనా వీరి మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

News September 6, 2025

ఇక IT ఎగుమతులపైనా US టారిఫ్స్?

image

భారత వస్తువులపై 50% టారిఫ్స్ వేస్తున్న US త్వరలో IT సేవలపైనా ట్యాక్స్ విధించొచ్చని తెలుస్తోంది. INDలోని చాలా IT కంపెనీలు USకు ఔట్‌సోర్సింగ్‌ సేవలందిస్తున్నాయి. వస్తువుల్లాగే లాగే సేవలపైనా TAX చెల్లించాలని US మాజీ నేవీ ఆఫీసర్ ట్వీట్ చేశారు. దీన్ని ట్రంప్ అడ్వైజర్ నవరో రీపోస్ట్ చేయడంతో భారత IT కంపెనీల్లో ఆందోళన మొదలైంది. దీనిని అమెరికన్ టెక్ వర్కర్స్ స్వాగతిస్తుండగా ఇండియన్ టెకీస్ ఖండిస్తున్నారు.

News September 6, 2025

ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్నా: మోదీ

image

మోదీ తనకు మిత్రుడని, భారత్‌తో అమెరికాకు <<17626556>>ప్రత్యేక అనుబంధం<<>> ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ఇరు దేశాల బంధాలు, సెంటిమెంట్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అభినందిస్తున్నా. ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, అమెరికా చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాయి’ అని మోదీ ట్వీట్ చేశారు.

News September 6, 2025

తురకపాలెం ప్రజలు వంట చేసుకోవద్దు: సీఎం

image

AP: గుంటూరు <<17604174>>తురకపాలెం<<>>లో వరుస మరణాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గ్రామస్థులెవరూ వంట చేసుకోవద్దని, అక్కడి తాగు నీటిని వినియోగించొద్దని సూచించారు. అక్కడి ప్రజలకు అధికారులే ఆహారం సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో ఇవాళ్టి నుంచే తురకపాలెం గ్రామస్థులకు మూడు పూటలా ఆహారం, మంచినీళ్లు సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైద్యులు మరణాలకు గల కారణాలు కనుగొనే పనిలో పడ్డారు.

News September 6, 2025

BREAKING: మోదీ అమెరికా పర్యటన రద్దు

image

న్యూయార్క్‌(US)లో ఈనెల 23 నుంచి 29 వరకు జరగనున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హైలెవెల్ డిబేట్‌కు PM మోదీ హాజరుకావడం లేదు. ఇటీవల విడుదల చేసిన వివిధ దేశాధినేతల స్పీచ్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 26న మోదీ UN జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాల్సి ఉంది. కానీ తాజాగా షెడ్యూల్ రివైజ్ అయింది. PM స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈనెల 27న స్పీచ్ ఇవ్వనున్నారు. పర్యటన రద్దుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2025

వెనిజులపై యుద్ధానికి సిద్ధమైన అమెరికా!

image

US-వెనిజుల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వెనిజుల అధ్యక్షుడు మదురోను పదవి నుంచి దించేయాలని ప్లాన్ చేస్తున్న ట్రంప్.. 10 F-35 ఫైటర్ల జెట్లను సరిహద్దుల్లో మోహరించారు. ఆ దేశంలోని డ్రగ్స్ కార్టెల్స్‌పై మిలిటరీ స్ట్రైక్స్ చేయాలని భావిస్తున్నారు. తమ దేశంలోకి <<17597311>>డ్రగ్స్<<>> వచ్చేందుకు మదురోనే కారణమని US ఆరోపిస్తోంది. అయితే వెనిజుల చమురు సంపదను దోచుకునేందుకే యూఎస్ ఈ కుట్రలకు పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి.