News April 23, 2025

విజయవాడ జైలుకు PSR.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

image

AP: ఐపీఎస్ ఆఫీసర్ PSR ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముంబై నటి జెత్వానీపై కేసు నమోదు చేయాలని ఆయన IPSలు కాంతిరాణా, విశాల్ గున్నీలకు చెప్పినట్లు తేలింది. మహిళపై అక్రమ కేసు నమోదుకు అధికారులను ప్రభావితం చేశారని పోలీసులు వెల్లడించారు. PSR ఆదేశాలతో పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో నకిలీ ఆధారాలు సృష్టించినట్లు రిపోర్టు వెల్లడించింది. అటు PSRను విజయవాడ జైలుకు తరలించారు.

News April 23, 2025

నా హృదయం ముక్కలైంది: రోహిత్ శర్మ

image

పహల్‌గామ్ ఉగ్రదాడిని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించారు. తన హృదయం ముక్కలైందనే భావన వ్యక్తపరుస్తూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని ఆయన తన ఇన్‌స్టాలో క్యాప్షన్‌గా పెట్టారు. అలాగే ఈ దాడిని పలువురు సెలబ్రిటీలు కూడా ఖండించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అలియా భట్, కరీనా కపూర్ తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

News April 23, 2025

IND, PAK మధ్య ఇక క్రికెట్ వద్దు: మాజీ క్రికెటర్

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో PAKపై IND మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఫైరయ్యారు. అమాయకులను చంపడమే ఆ దేశ జాతీయ క్రీడగా మారిపోయిందని మండిపడ్డారు. IND, PAK మధ్య ఇక ఎప్పటికీ క్రికెట్ మ్యాచులు నిర్వహించవద్దని BCCIని కోరారు. కొన్ని నెలల క్రితం తాను పహల్‌గామ్ వెళ్లానని, అప్పుడు అక్కడ శాంతి నెలకొన్నట్లు కనిపించిందని గుర్తు చేసుకున్నారు. CT కోసం పాక్‌కు IND జట్టును BCCI పంపకపోవడాన్ని సమర్థించారు.

News April 23, 2025

త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ కీలక భేటీ

image

కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రదాడికి బదులు తీర్చుకోవాలని యావత్ భారత్ కోరుకుంటోంది. ఈ క్రమంలోనే త్రివిధ దళాధిపతులతో డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ కీలక భేటీ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. J&Kలో ప్రస్తుత పరిస్థితి, ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్‌పై NSA అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ AP సింగ్, నేవీ చీఫ్ దినేశ్ త్రిపాఠితో రాజ్‌నాథ్ చర్చించారు.

News April 23, 2025

తల్లిదండ్రులూ.. పిల్లల కంటే మార్కులు ఎక్కువ కాదు!

image

టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనో, తక్కువ మార్కులొచ్చాయనో విద్యార్థులు సూసైడ్ చేసుకొని జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. ఈ సమయంలో ఫెయిలైన పిల్లల తల్లిదండ్రులు వారిని దగ్గరికి తీసుకొని, ఫెయిల్ అయినంత మాత్రాన అంతా అయిపోదనే భరోసా కల్పించండి. తక్కువ మార్కులొస్తే మరొకరితో పోల్చి సూటిపోటి మాటలు అని చిన్ని హృదయాలకు భారం అవ్వొద్దు. ఈ వయసులో వారు తట్టుకోలేక కఠిన నిర్ణయాలు తీసుకొనే ప్రమాదం ఉంది.

News April 23, 2025

పాకిస్థాన్‌కు భారత్ దెబ్బ?

image

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మిలిటరీ, దౌత్యపరంగా పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
*పాక్ ఆర్మీ, లష్కరే తోయిబా స్థావరాలపై దాడి
*ఆ దేశంతో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవడం
*సింధు నదీజలాల ఒప్పందం రద్దు
*ఈ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర గురించి భారత్ UN సెక్యూరిటీ ప్రతినిధులకు, 95 దేశాలకు వివరించి దోషిగా నిలబెట్టే యోచన.

News April 23, 2025

కొత్త పెన్షన్లు.. అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం

image

TG: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రెడీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. వీటిపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 43 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 ఇస్తున్నారు.

News April 23, 2025

ఫెయిలై ఒకరు.. తక్కువ మార్కులొచ్చాయని మరొకరు సూసైడ్

image

AP: ఇద్దరు టెన్త్ విద్యార్థులు సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. కృష్ణా(D) అర్జువానిగూడెంకు చెందిన G.అనిల్ గతేడాది, ప్రస్తుతం సైన్స్ పరీక్షలో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని చనిపోయాడు. శ్రీకాకుళంలోని బలగ ప్రాంతానికి చెందిన G.వేణుగోపాలరావుకు ఇవాళ టెన్త్ ఫలితాల్లో 393 మార్కులొచ్చాయి. తక్కువ మార్కులొచ్చాయని ఉరేసుకొని మృతిచెందగా, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 23, 2025

గవర్నమెంట్ స్కూల్.. 600కు 598 మార్కులు

image

AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో మెరిశారు. పల్నాడు(D) ఒప్పిచర్ల జడ్పీ స్కూల్ విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు తెచ్చుకుంది. హిందీ, ఇంగ్లిష్‌లో 99 మార్కుల చొప్పున వచ్చాయి. అన్నమయ్య(D) పెద్దవీడు, ప్రకాశం (D) అలకూరపాడు ZP స్కూల్స్ విద్యార్థినులు మేఘ, వెంకట భార్గవికి 595 మార్కులు వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివి అత్యధిక మార్కులు తెచ్చుకున్న వీరిపై ప్రశంసలు వస్తున్నాయి.

News April 23, 2025

ప్రభాస్ సినిమాలో ‘మార్కో’ స్టార్?

image

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ సినిమాలో ఉన్ని ముకుందన్ నటించే అవకాశాలున్నాయి. ఓ కీలక పాత్ర కోసం డైరెక్టర్ ఆయనను సంప్రదించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ పోలీసుగా కనిపించనున్నారు. మలయాళ నటుడైన ముకుందన్ ఇటీవల ‘మార్కో’ సినిమాతో హిట్ అందుకున్నారు.