India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రంలో మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటల నమోదుకు గడువును మరో 2 రోజులు పొడిగించినట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫానుతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈ-క్రాప్ నమోదు వంద శాతం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై జగన్ అబద్ధాలు చెబుతున్నారని, ఆయన వస్తే ఈ-క్రాప్ నమోదు అయిందో లేదో చూపిస్తానని సవాల్ చేశారు.

<<18185953>>సమీకృత వ్యవసాయం<<>>లో ఏ భూములు వేటి పెంపకానికి అనుకూలమో చూద్దాం ☛ బీడుభూములు – పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకం, వ్యవసాయ అడవుల పెంపకం, వ్యవసాయ చెరువులకు అనుకూలం. ☛ తోట భూములు – పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, పందుల పెంపకం, పుట్టగొడుగులు, తేనె తయారీ, పట్టు పురుగుల పెంపకానికి అనుకూలం. ☛ తడి భూములు – పంటలు, చేపలు, బాతులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పశువుల పెంపకానికి అనుకూలం.

AIని అడాప్ట్ చేసుకుంటున్న కంపెనీలు సిబ్బంది సంఖ్యను తగ్గించుకొనే పనిలో పడ్డాయి. మొన్న అమెజాన్ 14వేల మంది ఉద్వాసనకు నిర్ణయం తీసుకోగా తాజాగా IBM ఈ ఏడాది చివరి నాటికి వేలాది మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఆ సంస్థలో ప్రస్తుతం 2.7 లక్షల మంది పనిచేస్తుండగా సింగిల్ డిజిట్లో 1% అనుకున్నా 2700 మందికి లేఆఫ్ తప్పదని అంచనా వేస్తున్నారు. కాగా ఈ సంస్థలు భారత్లోనే పెద్ద కార్యాలయాలు నిర్వహిస్తున్నాయి.

బంగ్లాదేశ్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ జట్టులోని జూనియర్లను కొట్టిందని మాజీ సహచరురాలు జహనారా ఆలం ఆరోపించారు. కొట్టడం ఆమెకు అలవాటని, దుబాయ్ టూర్లోనూ రూముకు పిలిచి మరీ జూనియర్ని కొట్టిందని చెప్పారు. ICC వరల్డ్ కప్లో బంగ్లా టీమ్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో జట్టులోని అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. కాగా ఇవి నిరాధార ఆరోపణలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు ఖండించింది.

TG: PVT కాలేజీల యాజమాన్యాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన బెదిరిస్తున్నారని సమాఖ్య ఛైర్మన్ రమేష్బాబు ఆరోపించారు. ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం 3 రోజులుగా బంద్ కొనసాగుతుండగా చర్చలకు పిలిచి ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని మండిపడ్డారు. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుకు వేసిన కమిటీలో సంబంధం లేని ఇద్దరిని తొలగించాలన్నారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు బంద్ విరమించేది లేదని తేల్చి చెప్పారు.

హరియాణాలో 25 లక్షల <<18204949>>ఓట్ల చోరీ <<>>జరిగిందన్న రాహుల్ ఆరోపణలపై BJP తీవ్రంగా స్పందించింది. అవి నిరాధార, అసత్య ఆరోపణలని, దేశాన్ని కించపరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడింది. భారత వ్యతిరేక శక్తులతో కలిసి రాహుల్ గేమ్స్ ఆడుతున్నారని కేంద్ర మంత్రి రిజిజు ఫైరయ్యారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే ఈసీని లేదా కోర్టును ఆశ్రయించాలని, కానీ ఆయన అలాంటివి చేయరని ఎద్దేవా చేశారు.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(B<

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Sorry, no posts matched your criteria.