India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) కార్యక్రమం దుబాయ్లో ఘనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీల నుంచి ప్రముఖ హీరోలు, హీరోయిన్స్, నటులు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, మీనాక్షి చౌదరి, శ్రియ, నిహారిక, అల్లు శిరీష్, సందీప్ కిషన్, పాయల్ రాజ్పుత్ తదితరులు సందడి చేశారు. వీరి ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రపంచంలో తొలి ట్రిలియనీర్గా అవతరించే అవకాశముంది. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా భవిష్యత్ నిర్దేశిత లక్ష్యాలు నెరవేరితే CEOగా ఉన్న మస్క్ భారీ ప్యాకేజ్ పొందనున్నారు. ప్రస్తుతం ఆయన $400 బిలియన్లతో ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. రానున్న పదేళ్లలో టెస్లా విలువ $1.1 ట్రిలియన్ల నుంచి $8.5Tకు చేర్చితే మస్క్ $900B ప్యాకేజీ అందుకుంటారు. అదే జరిగితే ఆయన ఆస్తి $1.3T దాటొచ్చు.
✒ ఫజర్: తెల్లవారుజామున 4.50 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
✒ ఇష: రాత్రి 7.39 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
TG: హైదరాబాద్లో గణపతి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. రాజేంద్రనగర్ సన్ సిటీలోని రిచ్మండ్ విల్లాలో ఏకంగా రూ.2.32కోట్లు పలికింది. ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంపాటకు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా హాజరవుతుంటారు. ఈసారి రూ.కోటి నుంచి వేలం మొదలుపెట్టినట్లు సమాచారం.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ తిథి: శుక్ల చతుర్దశి రా.12.57 వరకు
✒ నక్షత్రం: ధనిష్ట రా.11.20 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: మ.12.54-2.30 వరకు
* హైదరాబాద్ వల్లే తెలంగాణ నంబర్వన్: చంద్రబాబు
* నాకూ రెండోసారి, మూడోసారి సీఎం అవ్వాలని ఉంది: CM రేవంత్
* కాళేశ్వరంపై ప్రధానిని కలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
* 6 నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం: KTR
* స్కాంల కోసం మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం: జగన్
* ఈ నెలలోనే టీచర్ నియామకాలు: లోకేశ్
* నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు: CP
* అమెరికాకు భారత్ దూరం కావడం బాధాకరం: ట్రంప్
* భారీగా పెరిగిన బంగారం ధరలు
AP: విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం, పెండింగ్ పనుల పూర్తికి కేంద్రం మంజూరు చేసిన ₹217కోట్ల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చిన నిధులను విడుదల చేసింది. ఉపాధిహామీ కింద నిర్మిస్తున్న 2,309 భవనాల పూర్తికి, PM-ABHIM కింద 696 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. ఒక్కో భవనానికి ₹55లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఈ వర్షాకాలంలో హిమాచల్ప్రదేశ్, J&K, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, ఢిల్లీలో వరదలు బీభత్సం సృష్టించాయి. సుమారు 500మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఆయా ప్రాంతాలను ప్రధాని పరిశీలించి, నష్టంపై సమీక్షిస్తారని సమాచారం.
Sorry, no posts matched your criteria.