India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈ ఘటనలో మొత్తం 28 మంది చనిపోగా, అందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు.
TG: BRS పేరు మార్చాల్సిన అవసరం లేదని, తీరు మార్చుకోవాలని KTR ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. KCR లెజెండ్, కారణజన్ముడు అని పేర్కొన్నారు. KCR కాకుండా తనకు నచ్చిన CM పినరయి విజయన్(కేరళ) అని తెలిపారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, పవన్ కళ్యాణ్ తాను ఊహించిన దానికంటే ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. మోదీ మతపరమైన అజెండాను ప్రచారం చేస్తున్నారని, ఇప్పటివరకు PMగా చేసిందేం లేదని అభిప్రాయపడ్డారు.
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని యల్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించింది. పదో తరగతిలో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. దీంతో నేహాంజనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
*Congratulations Nehanjani Yalla
మే నెల నుంచి టెస్లా వ్యవహారాలకే అధిక సమయం కేటాయిస్తానని మస్క్ ప్రకటించారు. DOGE కోసం ఎక్కువ సమయం పనిచేయనని తెలిపారు. టెస్లా త్రైమాసిక లాభాలు 71శాతం మేర క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. DOGEకు అధినేతగా వ్యహరిస్తున్న మస్క్ నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించారు. దీంతో మస్క్పై వ్యతిరేకత అధికమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
AP: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓపెన్ SSC పరీక్షలకు 26,679 మంది హాజరవగా 10,119 మంది పాసయ్యారు. ఇంటర్లో 63,668 విద్యార్థులకు గాను 33,819 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ కోసం ఈనెల 26 నుంచి మే 5 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు ₹200, రీవెరిఫికేషన్కు ₹1000 చెల్లించాలి. https://apopenschool.ap.gov.in/ సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు
ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. వారం రోజుల తర్వాత గోల్డ్ రేటు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 తగ్గి రూ.90,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.3,000 తగ్గి రూ.98,350కి చేరింది. కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది.
US వైస్ ప్రెసిడెంట్ వాన్స్ భారత పర్యటనలో ఉండగా జరిగిన ఉగ్రదాడి తరహాలోనే.. పాతికేళ్ల క్రితం అప్పటి US ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పర్యటన సమయంలోనూ ఓ అటాక్ జరిగింది. లష్కరే తోయిబా ఉగ్రమూక భారత ఆర్మీ దుస్తులు ధరించి అనంతనాగ్లోని చిట్టిసింగ్పురాకు వెళ్లారు. పురుషులను గురుద్వారా ముందు లైన్లో నిల్చోబెట్టి కిరాతకంగా కాల్పులు జరిపారు. ఆ ఊచకోతలో 35 మంది సిక్కులు తమ ప్రాణాలు కోల్పోయారు.
పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్థాన్కు ఎటువంటి సంబంధం లేదని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. టెర్రరిజాన్ని పాకిస్థాన్ ప్రోత్సహించదని, తమ దేశాన్ని అనవసరంగా నిందించకూడదని అన్నారు. భారత్ మాత్రం బలూచిస్థాన్ వ్యవహారాల్లో తల దూరుస్తోందని ఆరోపించారు. ఇండియాలో ప్రస్తుతం జరిగిన అశాంతికి ఆ దేశంలో జరుగుతున్న తిరుగుబాట్లే కారణమన్నారు. ఇస్లామిక్తో పాటు ఇతర అంశాలలో నిరసనలు పెరుగుతున్నాయన్నారు.
AP: టెన్త్ ఫలితాల్లో 1,680 స్కూళ్లలో 100% పాస్ రేట్ ఉండగా, 19 స్కూళ్ల(ఇందులో 9 ప్రైవేట్)లోని విద్యార్థులంతా ఫెయిలయ్యారు. ఓవరాల్గా 65.36% మంది ఫస్ట్, 10.69% మంది సెకండ్, 5.09% మంది థర్డ్ డివిజిన్లో పాసయ్యారు. ఫలితాల్లో బాలికలు హవా కొనసాగించారు. 3,01,202 మంది గర్ల్స్ పరీక్షలు రాయగా 2,53,278 మంది(84.09%) పాసయ్యారు. 3,13,257 మంది బాలురు ఎగ్జామ్స్ రాయగా 2,45,307 మంది(78.31%) ఉత్తీర్ణత సాధించారు.
AP: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. https://www.bse.ap.gov.in/ సైట్లో HM లాగిన్ ద్వారా ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చు. లేటు ఫీజు రూ.50తో మే 19 వరకు అప్లై చేయవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి రేపటి నుంచి మే 1 వరకు అవకాశమిచ్చారు. రీకౌంటింగ్కు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1000 చెల్లించాలి.
Sorry, no posts matched your criteria.