News September 5, 2025

అవి ప్రజాపోరాటంలో ప్రత్యర్థులు పెట్టిన కేసులు: TDP

image

AP: మంత్రులందరిపై క్రిమినల్ కేసులున్నాయని YCP చేసిన <<17621813>>ట్వీట్‌పై<<>> TDP స్పందించింది. ప్రజాపోరాటాలు చేసే సమయంలో అధికారంలో ఉన్న ప్రత్యర్థులు ఈ కేసులు పెట్టారని పేర్కొంది. తన మీడియాలో జగన్ అసంబద్ధమైన వార్తలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడింది. వీటి విషయం పక్కన పెడితే అసలు నేరాలు ఏంటో చూద్దామని.. సొంత బాబాయిని గొడ్డలితో నరికారని, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేయడం వంటివి ప్రస్తావించింది.

News September 5, 2025

బయట టీ తాగుతున్నారా?

image

TG: హైదరాబాద్‌లోని 42 టీ పౌడర్ యూనిట్లు & టీ షాపుల్లో GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. 19 చోట్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్ట్స్ వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే శుభ్రత పాటించే దుకాణాల్లోనే టీ తాగాలని సూచించారు. ‘స్వచ్ఛమైన టీ ఆకులు తడి క్లాత్‌పై రుద్దితే అవి రంగుని వదలవు. కల్తీ టీ పొడిని నీటిలో కలపగానే ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది’ అని అవగాహన కల్పించారు.

News September 5, 2025

సారా టెండూల్కర్ ఎంగేజ్‌మెంట్ అయ్యిందా?

image

సచిన్ కూతురు సారా ఎంగేజ్మెంట్ వార్తలు బీటౌన్‌లో వైరల్ అవుతున్నాయి. గోవా రెస్టారెంట్ ఓనర్ సిద్ధార్థ్ కేర్కర్‌తో సారా చనువుగా ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. దీంతో వీరిద్దరి నిశ్చితార్థం అయ్యిందా? అని సందేహిస్తూ పలు న్యూస్ సైట్లు వార్తలు ప్రచురించాయి. గతంలో వీరు గోవాలో దిగిన ఫొటోలనూ షేర్ చేశాయి. దీనిపై సచిన్ ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది. సచిన్ కొడుకు అర్జున్‌కు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే.

News September 5, 2025

హవాయి చెప్పులకు, బెంజ్ కారుకు ఒకే పన్ను వేయలేం: నిర్మలా సీతారామన్

image

మన దేశంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. హవాయి చెప్పులకు, మెర్సిడెస్ బెంజ్ కారుకు ఒకే పన్ను వేయగలమా అని ఆమె ప్రశ్నించారు. ‘ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితంగా ఉంది. అలాంటప్పుడు ఒకే పన్ను వేయడం కుదరదు. భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి అయినప్పుడే ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్’ విధానం సాధ్యమయ్యే అవకాశం ఉంది’ అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

News September 5, 2025

అంతరిక్షంలో ఆక్సిజన్ కోసమని రూ.6 లక్షలు కొట్టేశాడు

image

ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ స్కామర్ జపాన్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిని మోసం చేశాడు. తనని తాను ఓ ఆస్ట్రోనాట్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నిరోజులు మాట్లాడాక ఆ ఒంటరి వృద్ధురాలికి అతనిపై ఇష్టం మొదలైంది. అదే అదునుగా ‘నేను స్పేస్‌‌లో ఇరుక్కుపోయాను. నా స్పేస్ షిప్‌పై దాడి జరిగింది. ఆక్సిజన్ కోసం డబ్బు కావాలి’ అని రూ.6 లక్షలు(5 వేల పౌండ్లు) ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. తర్వాత ఆమెతో మాట్లాడటం మానేశాడు.

News September 5, 2025

అమెరికాకు భారత్ దూరం కావడం బాధాకరం: ట్రంప్

image

తమ దేశానికి భారత్ దూరం కావడం బాధాకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాతోపాటు రష్యాను కూడా కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. SCO సమావేశం అనంతరం మోదీ, జిన్‌పింగ్, పుతిన్ ఉన్న ఫొటోను ఆయన ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ‘ఈ రెండు దేశాలు కుట్ర బుద్ధి ఉన్న చైనాకు దగ్గరయ్యాయి. మూడు దేశాల స్నేహం చాలాకాలం కొనసాగవచ్చు’ అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

News September 5, 2025

18 నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలి సమావేశాలు అదే రోజు ఉదయం 10గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ అసెంబ్లీ సెషన్‌లో కూటమి ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది.

News September 5, 2025

దేశంలోనే చెత్త క్యాబినెట్‌గా CBN మంత్రివర్గం: YCP

image

AP: కూటమి ప్రభుత్వంలోని మంత్రులందరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వైసీపీ ట్వీట్ చేసింది. దేశంలోనే అత్యంత చెత్త క్యాబినెట్‌గా చంద్రబాబు మంత్రివర్గం నిలిచిందని ఎద్దేవా చేసింది. ఇంత వరస్ట్ క్యాబినెట్ దేశంలో ఎక్కడైనా ఉంటుందా చంద్రబాబూ అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా చంద్రబాబుపై 19, డిప్యూటీ సీఎం పవన్‌పై 08, మంత్రి లోకేశ్‌పై 17 కేసులతో పాటు ఇతర మంత్రులపై ఉన్న కేసుల లిస్టును పోస్ట్ చేసింది.

News September 5, 2025

టాప్-100లో ఏపీ& TG నుంచి ఏడు కాలేజీలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ఈ ఏడాది విడుదల చేసిన అత్యున్నత విద్యాసంస్థల ర్యాంకుల్లో తమిళనాడు టాప్‌లో ఉంది. టాప్-100లో తమిళనాడులోనే 17 ఉండటం విశేషం. ఆ తర్వాత మహారాష్ట్రలో 11, UPలో 9, ఢిల్లీలో 8, కర్ణాటకలో & పంజాబ్‌లో 6, TGలో 5 కాలేజీలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రెండు మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. APలో AU & KLU, TGలో IIT-HYD, NIT WGL, OU, IIIT-HYD,JNTUH ఉన్నాయి.

News September 5, 2025

శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు

image

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కోఠారి నుంచి రూ.60కోట్లు తీసుకొని మోసం చేశారన్న అభియోగాలపై వీరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు వీరి ట్రావెల్ లాగ్‌లను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక నేరాల విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో దంపతులు దేశం వదిలి వెళ్లకుండా నోటీసులిచ్చారు.