News September 5, 2025

RCB ఎఫెక్ట్.. చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే..

image

RCB విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంపై ఇంకా పోలేదు. కర్ణాటక స్టేట్ క్రికెట్ లీగ్‌లో ఇది కూడా ఒక వేదిక. సేఫ్టీ దృష్ట్యా ఇక్కడ ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు నిర్వహించనున్నట్లు క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. సెమీ ఫైనల్, ఫైనల్ కూడా అభిమానులు లేకుండానే నిర్వహిస్తారని తెలిపింది. జూన్ 4న RCB విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట జరిగి 11మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

News September 5, 2025

డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ చేయొచ్చా?

image

విద్యార్థులు బీఈడీని దూరవిద్యా విధానంలో చదవడానికి ప్రత్యేక వర్సిటీలు లేవు. బీఈడీ లాంటి ప్రొఫెషనల్ ట్రైనింగ్ కోర్సును డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చదివితే సమస్యలు ఉంటాయి. టీచర్లుగా రాణించలేరు. కానీ NCTE నిబంధనల ప్రకారం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చదివి, టీచర్లుగా పనిచేస్తున్నవారు మాత్రమే ఓపెన్ వర్సిటీ ద్వారా బీఈడీ చేసేందుకు అవకాశం ఉంది. దీనిద్వారా వారు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందడం వీలవుతుంది.

News September 5, 2025

విత్తన మొలకశాతంపైనే పంట భవిష్యత్తు

image

రైతులు కాలానుగుణంగా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దానికి అనువైన పంటలను సాగు చేస్తారు. దిగుబడి బాగుండి వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే పంటకు ‘విత్తనం’ ప్రధానం. అందుకే మేలైన దిగుబడి కోసం మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించాలి. విత్తన కొనుగోలు తర్వాత కూడా మొలక శాతాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. విత్తన మొలక శాతాన్ని ట్రే, పేపరు టవలు పద్ధతిలో లెక్కిస్తారు.

News September 5, 2025

ట్రే పద్ధతిలో విత్తన మొలకశాతం లెక్కింపు

image

ఆముదం, వేరుశనగ, పత్తి వంటి లావు గింజల విత్తనాలను ట్రే పద్ధతిలో పరీక్షించవచ్చు. ఒక ప్లాస్టిక్ ట్రేని గానీ, కుండని గానీ ఇసుకతో నింపి వంద విత్తనాలను అంగుళం లోతుగా నిర్ణీత దూరంలో విత్తాలి. మట్టిని నీటితో తడుపుతూ ఉంటే 7 నుంచి 10 రోజుల్లో మెులకలు వస్తాయి. వందకు ఎన్ని మొలకలు వచ్చాయో లెక్కించి మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు. నిర్దేశించిన శాతం కన్నా తక్కువ మొలకలొస్తే నాణ్యత లోపించిన విత్తనాలుగా భావించాలి.

News September 5, 2025

పేపరు టవలు పద్ధతిలో మొలకశాతం లెక్కింపు

image

వరి, పత్తి, పొద్దుతిరుగుడు, జొన్న వంటి విత్తనాల మొలక శాతం తెలుసుకోవడానికి ఈ పద్ధతి అనుకూలం. ముందుగా పేపరు టవలు లేదా మందపాటి వస్త్రాన్ని తీసుకొని నీటితో తడపాలి. దీన్ని నేలపై పరిచి వంద విత్తనాలను వరుస క్రమంలో అమర్చాలి. విత్తనాలపై మరో పేపరు టవలు లేదా వస్త్రాన్ని కప్పాలి. ఈ రెండింటిని చాపలా చుట్టి చివర్లను దారంతో కట్టి లోతుగా ఉన్న పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. అప్పుడప్పుడు నీటితో తడిపితే మొలకలొస్తాయి.

News September 5, 2025

మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

image

☛ 90% – మొక్కజొన్న (సంకర రకాలు) ☛ 85% – శనగ
☛ 80% – వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)
☛ 75% – జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద ☛ 70% – ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు. ☛ 65% – పత్తి, బెండ, కాలిఫ్లవర్
☛ 60%- మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర
పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

News September 5, 2025

భాగ్యనగరానికి సమీపాన ‘సరస్వతీ దేవి’ ఆలయం

image

బాసర క్షేత్రానికి వెళ్లలేని భక్తులు వర్గల్‌‌లో కొలువైన సరస్వతీ దేవిని దర్శించుకొని తృప్తి చెందుతుంటారు. ఈ మందిరం HYD నుంచి 45KM దూరంలో సిద్దిపేట జిల్లాలో కొలువై ఉంది. దీన్ని 1992లో నిర్మించారు. ఇక్కడ చిన్నారులకు నిత్యం అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. నిత్యాన్నదానం ఉంటుంది. కంచి శంకర మఠం ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతోంది. ఈ క్షేత్రంలో గణేశుడు, సాంబశివుడు, వేంకటేశ్వర స్వామివార్లు దర్శనమిస్తారు.

News September 5, 2025

శుక్రవారం నాడు డబ్బు ఎందుకు బయటకి ఇవ్వకూడదు?

image

శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఈరోజు డబ్బులు బయటకు ఇస్తే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతుందని, అందువల్ల కష్టాలు వస్తాయని భావిస్తారు. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదని అంటుంటారు. అయితే ఇది అపోహ మాత్రమే అనేవారు కూడా ఉన్నారు. ‘ఒకసారి ఖర్చు చేస్తే అదే అలవాటుగా మారే అవకాశం ఉంటుంది. దాన్ని ఆపాలనే ఉద్దేశంతో, ధనాన్ని పొదుపు చేయాలనే ఆలోచనతో ఈ పద్ధతికి శ్రీకారం చుట్టార’ని మరికొందరు చెబుతారు.

News September 5, 2025

గణేషుడిని ఎందుకు నిమజ్జనం చేస్తాం?

image

వినాయకుడిని 21 రకాల పత్రాలతో పూజిస్తాం. ఆ ఆకులతో సహా మట్టి గణపతిని జలకళ సంతరించుకున్న నది/చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు క్రిమి రహితంగా మారుతుందని పెద్దలు చెబుతున్నారు. మట్టి విగ్రహాలను తీరం వెంబడి నిమజ్జనం చేస్తే వరద పోటు తగ్గుతుందనే భావన కూడా ఉంది. అందుకే నిమజ్జనం ఆచారం ఉండే బతుకమ్మ/దసరా పండగలు కూడా వర్షాకాలంలోనే వస్తాయని అంటారు. నిమజ్జనం అనేది అశాశ్వతకు ప్రతీకని మరికొందరు చెబుతారు.

News September 5, 2025

వినాయకుడి నిమజ్జనం.. ఇలా చేస్తే పుణ్యం

image

గణేశుడి నిమజ్జనం పవిత్రంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. వినాయకుడికి ఉద్వాసన పలికే ముందు పూజ చేసి, గుంజీలు తీయాలి. పత్రి ఆకులతో చేసిన కంకణాలు చేతికి కట్టుకోవాలి. హారతి ఇచ్చి విగ్రహాన్ని జరపాలి. చెరువు దగ్గరకు చేరుకున్నాక అగరబత్తులు వెలిగించి, పువ్వులు పెట్టాలి. కొబ్బరికాయ కొట్టి మరోసారి హారతి ఇవ్వాలి. విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసి ‘వచ్చే ఏడు మళ్లీ రావయ్యా’ అని మొక్కాలి.