India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
Critical Thinking: ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ నిత్యనూతనంగా ఉండాలి. సమస్యలను విశ్లేషించి స్మార్ట్ నిర్ణయాలు తీసుకోవాలి.
Communication Skills: ఉద్యోగ జీవితంలో భావవ్యక్తీకరణ కీలకం. అప్పుడే రాణించగలం.
Creativity: క్రియేటివిటీగా ఆలోచించి, సమస్యలకు పరిష్కారాలు చూపగలగాలి. టెక్నాలజీలపై అప్డేట్గా ఉండాలి.
Collaboration: వ్యక్తిగతంగా కంటే టీమ్తో కలిసి పనిచేసే స్కిల్ ఉంటేనే గుర్తింపు పొందుతారు.
*నీటి ప్రవాహానికి ఎదురీదడం సులభం కాదు. కానీ సాల్మన్ చేపలు ఎదురీదుతాయి. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని ఇవి మనకు తెలియజేస్తాయి.
* వెదురు చెట్టు తుఫానుకు వంగిపోతుంది. కానీ విరగదు. తగ్గగానే నిటారుగా నిల్చుంటుంది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తలవంచినా, తర్వాత సర్దుకొని నిలబడాలి.
* సాలీడు ఓపికగా, శ్రద్ధగా గూడును అల్లుకుంటుంది. గెలుపు కోసం ఇంతకంటే గొప్ప సూత్రమేముంటుంది. SHARE IT
TG: మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో గణపతి హోమం చేయిస్తున్నారు. తన సతీమణి శోభతో కలిసి పూజలో పాల్గొన్నారు. ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రుల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ 5 రోజులుగా ఫామ్హౌస్లోనే ఉన్నారు. అటు హరీశ్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ రానున్నారు. నేరుగా ఫామ్హౌస్కు వెళ్లి కవిత ఆరోపణలపై చర్చించే అవకాశం ఉంది.
*File photo
AP: అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ప్రభుత్వం 5 కి.మీ. పొడవైన ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనుంది. ఇప్పటికే 4 ప్రత్యేక డిజైన్లు ఎంపిక చేసింది. వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. <
RCB విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంపై ఇంకా పోలేదు. కర్ణాటక స్టేట్ క్రికెట్ లీగ్లో ఇది కూడా ఒక వేదిక. సేఫ్టీ దృష్ట్యా ఇక్కడ ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు నిర్వహించనున్నట్లు క్రిక్ఇన్ఫో పేర్కొంది. సెమీ ఫైనల్, ఫైనల్ కూడా అభిమానులు లేకుండానే నిర్వహిస్తారని తెలిపింది. జూన్ 4న RCB విక్టరీ పరేడ్లో తొక్కిసలాట జరిగి 11మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
విద్యార్థులు బీఈడీని దూరవిద్యా విధానంలో చదవడానికి ప్రత్యేక వర్సిటీలు లేవు. బీఈడీ లాంటి ప్రొఫెషనల్ ట్రైనింగ్ కోర్సును డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివితే సమస్యలు ఉంటాయి. టీచర్లుగా రాణించలేరు. కానీ NCTE నిబంధనల ప్రకారం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చదివి, టీచర్లుగా పనిచేస్తున్నవారు మాత్రమే ఓపెన్ వర్సిటీ ద్వారా బీఈడీ చేసేందుకు అవకాశం ఉంది. దీనిద్వారా వారు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందడం వీలవుతుంది.
రైతులు కాలానుగుణంగా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దానికి అనువైన పంటలను సాగు చేస్తారు. దిగుబడి బాగుండి వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే పంటకు ‘విత్తనం’ ప్రధానం. అందుకే మేలైన దిగుబడి కోసం మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించాలి. విత్తన కొనుగోలు తర్వాత కూడా మొలక శాతాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. విత్తన మొలక శాతాన్ని ట్రే, పేపరు టవలు పద్ధతిలో లెక్కిస్తారు.
ఆముదం, వేరుశనగ, పత్తి వంటి లావు గింజల విత్తనాలను ట్రే పద్ధతిలో పరీక్షించవచ్చు. ఒక ప్లాస్టిక్ ట్రేని గానీ, కుండని గానీ ఇసుకతో నింపి వంద విత్తనాలను అంగుళం లోతుగా నిర్ణీత దూరంలో విత్తాలి. మట్టిని నీటితో తడుపుతూ ఉంటే 7 నుంచి 10 రోజుల్లో మెులకలు వస్తాయి. వందకు ఎన్ని మొలకలు వచ్చాయో లెక్కించి మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు. నిర్దేశించిన శాతం కన్నా తక్కువ మొలకలొస్తే నాణ్యత లోపించిన విత్తనాలుగా భావించాలి.
వరి, పత్తి, పొద్దుతిరుగుడు, జొన్న వంటి విత్తనాల మొలక శాతం తెలుసుకోవడానికి ఈ పద్ధతి అనుకూలం. ముందుగా పేపరు టవలు లేదా మందపాటి వస్త్రాన్ని తీసుకొని నీటితో తడపాలి. దీన్ని నేలపై పరిచి వంద విత్తనాలను వరుస క్రమంలో అమర్చాలి. విత్తనాలపై మరో పేపరు టవలు లేదా వస్త్రాన్ని కప్పాలి. ఈ రెండింటిని చాపలా చుట్టి చివర్లను దారంతో కట్టి లోతుగా ఉన్న పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. అప్పుడప్పుడు నీటితో తడిపితే మొలకలొస్తాయి.
☛ 90% – మొక్కజొన్న (సంకర రకాలు) ☛ 85% – శనగ
☛ 80% – వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)
☛ 75% – జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద ☛ 70% – ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు. ☛ 65% – పత్తి, బెండ, కాలిఫ్లవర్
☛ 60%- మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర
పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.