India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వనశ్రీ, రాజశ్రీ కోళ్లు 6 నెలల్లో 2.5- 3 KGల బరువు పెరుగుతాయి. నాటుకోళ్లు ఇదే సమయంలో 1.5 KGల బరువే పెరుగుతాయి. పెరటి కోళ్లు 150 నుంచి 160 రోజుల్లో తొలిసారి గుడ్లు పెడతాయి. నాటుకోళ్లు 200 రోజుల తర్వాతే గుడ్లు పెడతాయి. పెరటి కోళ్లు ఏడాదికి 150-180 గుడ్లు పెడతాయి. నాటుకోళ్లు ఏడాదికి 50- 60 గుడ్లే పెడతాయి. అందుకే పెరటికోళ్ల ఆరోగ్యం, మేతలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు నిపుణులు.

అమెరికాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్ గవర్నర్గా ఎన్నికయ్యారు. అబిగైల్కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం.

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారానికి నిన్నటితో తెరపడింది. 18 జిల్లాల పరిధిలోని 121 సెగ్మెంట్లలో రేపు పోలింగుకు ఈసీ ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. ఈ దశలో 8 మంది మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు, JJL పార్టీ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా ఈ నెల 11న మరో 122 స్థానాల్లో పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.

ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల చర్మం దెబ్బతింటోంది. అందుకే దాని పీహెచ్ సరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. చర్మాన్ని రక్షిస్తూ ఎసిడిక్ ఫిల్మ్ ఉంటుంది. దాని pH 4.5- 5.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. లేదంటే మొటిమలు, దద్దుర్లు, పొడిబారడం, అతిగా నూనెలు విడుదలవ్వడం, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. pH బ్యాలెన్స్డ్ ప్రొడక్ట్స్, సన్స్క్రీన్ వాడాలి. స్క్రబ్బింగ్ ఎక్కువగా చేయకూడదని సూచిస్తున్నారు.

విశాఖలోని నేవీ చిల్డ్రన్ స్కూల్లో 18 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్, బాల్వాటిక టీచర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఈ నెల 25లోగా అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://ncsvizagnsb.nesnavy.in/

కూలీల కొరత, ఎక్కువ ఖర్చు, వేగంగా పంటకోత చేపట్టాలనే ఉద్దేశంతో నేడు చాలా మంది రైతులు యంత్రాల సాయంతో వరి కోతలు చేపడుతున్నారు. దీని వల్ల మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. యంత్రాలతో కోత, నూర్పిడి చేస్తే చెత్త, దుమ్ము, మట్టిబెడ్డలు వంటివి ధాన్యంలో తగ్గుతాయి. రైతులకు శ్రమ కూడా తగ్గుతుంది. అయితే కంబైన్ హర్వెస్టర్ వంటి కోత యంత్రాలతో కోసేటప్పుడు రెండు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా రైతులు జాగ్రత్త పడాలి.

పోస్టల్ సేవలను వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు డాక్ సేవ(Dak Sewa) యాప్ను తపాలా శాఖ తీసుకొచ్చింది. పార్సిల్ ట్రాకింగ్, పోస్టేజ్ కాలిక్యులేషన్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్, కంప్లైంట్ రిజిస్ట్రేషన్ స్పీడ్/రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్, ట్రాకింగ్ సేవలనూ పొందవచ్చు. అలాగే దగ్గర్లోని పోస్టాఫీసుల వివరాలనూ తెలుసుకోవచ్చు. యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక మొబైల్ నంబర్/ఈమెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవచ్చు.

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి CRDA విజన్-2047 రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అర్బన్ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ గైడ్లెన్స్ కోసం సలహాలు, అభ్యంతరాలను తెలపాలని ప్రజలు, సంస్థలను కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు <
Sorry, no posts matched your criteria.