India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ‘ఘాటీ’ మూవీ థియేటర్లలో విడుదలైంది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఓ అమ్మాయి లెజెండ్గా ఎలా మారిందనేదే కథ. అనుష్క, చైతన్యరావు (విలన్) నటన, సినిమాటోగ్రఫీ మెప్పిస్తాయి. విక్రమ్ ప్రభు పరిధి మేరకు నటించారు. మూవీ గ్రాండ్గా ఉన్నప్పటికీ ఔట్డేటెడ్ స్టోరీ, ఎమోషన్స్ లేకపోవడం, సంగీతం, కథ చెప్పే విధానం సరిగ్గా లేకపోవడం మైనస్.
Way2News రేటింగ్: 2.25/5
* భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 440 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. www.bemlindia.in
* బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) కాంట్రాక్టు ప్రాతిపదికన 5 యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు. బీఈ/బీటెక్ పాసైన వారు అర్హులు. https://www.bis.gov.in/
* IOCL లో 475 అప్రెంటిస్ పోస్టులు. టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ అర్హత. https://iocl.com/
ప్రస్తుతం ఉన్నత పదవుల్లో, ఉద్యోగాల్లో ఉన్న ఎంతోమంది ఎప్పుడో ఓసారి టీచర్ల చేతిలో దెబ్బలు తినే ఉంటారు. క్రమశిక్షణ కోసమే వారలా దండిస్తూ సరైన మార్గంలో నడిపించారు. దండించిన గురువుల దెబ్బలు మనల్ని గాడిలో పెడితే, అభిమాన ఉపాధ్యాయుల ప్రోత్సాహం జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధింపజేసింది. ఇవన్నీ ఇప్పుడు మధుర జ్ఞాపకాల్లా మారిపోయాయి. ఇప్పటి పిల్లలకు ఇవి తెలియవు. మీరు చదివిన స్కూల్, ఫేవరెట్ టీచర్ ఎవరు? COMMENT
భారతీయులకు సమోసా ఓ ఎమోషన్. మధ్యప్రాచ్యానికి చెందిన ఈ స్నాక్ వ్యాపారులు, యాత్రికుల ద్వారా 13వ శతాబ్దంలో ఇండియాలోకి ప్రవేశించింది. మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో ఇది ఒక విలాసవంతమైన వంటకంగా ఉండేది. తొలుత సమోసాలో మాంసం ఉండేదట. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దీనిలో బంగాళాదుంపను పెట్టారు. ఈ మార్పుతో ఇది ప్రజలకు మరింత చేరువైంది. తక్కువ నూనెతో, ఎయిర్-ఫ్రైయర్తో చేసిన సమోసాలు తినడం మేలు. *వరల్డ్ సమోసా డే*
TG: కవిత <<17599702>>ఆరోపణలపై<<>> మాజీ మంత్రి హరీశ్ రావు పరోక్షంగా స్పందించారు. BRSకు సుప్రీం కేసీఆరే అని, ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే KCR తమకు నేర్పించారని తెలిపారు. ‘కాళేశ్వరం’ అవినీతికి హరీశ్ రావు కారణమంటూ ఆరోపణలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
US రక్షణశాఖ (పెంటగాన్)ను ఇక నుంచి యుద్ధశాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ వార్)గా పిలవాలని ట్రంప్ ఆదేశించారు. ‘డిఫెన్స్ సెక్రటరీ’ని ‘వార్ సెక్రటరీ’గా పేర్కొంటూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. నిజానికి ఆ దేశ రక్షణశాఖ 1789-1947 మధ్య డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా ఉండేది. ఆ తర్వాత రక్షణ శాఖగా మార్చారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ పాత పేరు పెట్టారు. ప్రత్యర్థులకు తమ యుద్ధ సన్నద్ధతను తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. 10 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 80,863 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు లాభం పొంది 24,788 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. M&M, రిలయన్స్, టాటా మోటర్స్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్ లాభాల్లో, ITC, HDFC, ICICI, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
తాను చేయబోయే తర్వాతి సినిమా కూతురు రాహా చూసేలా ఉండాలనుకుంటున్నట్లు హీరోయిన్ అలియా భట్ చెప్పారు. కూతురు చూసే సినిమాలను తాను ఇప్పటివరకూ చేయలేదని అన్నారు. చిన్నారి కోసమే జానర్ మార్చి కామెడీ కథలను ఎంచుకోనున్నట్లు ఆమె తెలిపారు. త్వరలోనే కొత్త ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. భర్త రణ్బీర్ కపూర్తో కలిసి ఆమె నటిస్తోన్న ‘లవ్ అండ్ వార్’ 2026 మార్చి 20న రిలీజ్ కానుంది.
బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరిగి రూ.1,07,620కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.700 ఎగబాకి రూ.98,650 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 తగ్గి రూ.1,36,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
AP: విద్య నేర్పే గురువుల పట్ల కూడా YCP నీచంగా వ్యవహరిస్తోందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. <<17608204>>పక్క రాష్ట్రం<<>>లో జరిగిన ఘటనను AP టీచర్లకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో పని చేస్తున్న టీచర్లు తాగి బెంచీల కింద పడుకుంటున్న రీతిలో జుగుప్సాకరంగా వైసీపీ ఫేక్ హ్యాండిల్స్లో ఫేక్ ప్రచారం చేస్తోంది. దీంతో YCP నీతిబాహ్యమైన చర్యల్లో మరో మెట్టు దిగజారింది. ఇది క్షమించరాని నేరం’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.