India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విద్య నేర్పే గురువుల పట్ల కూడా YCP నీచంగా వ్యవహరిస్తోందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. <<17608204>>పక్క రాష్ట్రం<<>>లో జరిగిన ఘటనను AP టీచర్లకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో పని చేస్తున్న టీచర్లు తాగి బెంచీల కింద పడుకుంటున్న రీతిలో జుగుప్సాకరంగా వైసీపీ ఫేక్ హ్యాండిల్స్లో ఫేక్ ప్రచారం చేస్తోంది. దీంతో YCP నీతిబాహ్యమైన చర్యల్లో మరో మెట్టు దిగజారింది. ఇది క్షమించరాని నేరం’ అని ట్వీట్ చేశారు.
మధ్యప్రదేశ్ జబల్పూర్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో 34 ఏళ్ల మహిళ 5.2 కేజీల మగపిల్లాడికి జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ సాధ్యపడకపోవడంతో సిజేరియన్ చేశామని వైద్యులు తెలిపారు. ఇంత బరువున్న శిశువును చూడటం ఇదే తొలిసారి అని సంబరపడుతూ అతడితో ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫొటోల్లో ఆ పిల్లాడు ఏడాది వయసు ఉన్నవాడిగా కనిపించాడు. సాధారణంగా పిల్లలు 2.5 కేజీల నుంచి 3.2 కేజీల బరువుతో జన్మిస్తారు.
మహిళల వన్డే WC టికెట్ల ధరను ICC రూ.100గా నిర్ణయించింది. ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించేందుకు లీగ్ మ్యాచులకు ఈ ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సెప్టెంబర్ 30న మొదలయ్యే ఈ టోర్నీని ఘనంగా ప్రారంభించేందుకు గువహటిలో సింగర్ శ్రేయా ఘోషల్తో గ్రాండ్గా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. శ్రీలంకతో పాటు భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. విశాఖలో OCT 9, 12, 13, 16, 26 తేదీల్లో మ్యాచులున్నాయి.
గాజాలో మరణాల సంఖ్య 64వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఇజ్రాయెల్ దాడుల్లో 28 మంది మరణించగా వారిలో చిన్నారులు, మహిళలే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తే 48 మంది బందీలను విడుదల చేస్తామన్న హమాస్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. యుద్ధంలో ఓడించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. 2023 నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఎదురన్నదే లేకుండా దూసుకెళుతోంది. టెంబా బవుమా సారథ్యంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. హేమాహేమీలుగా పేరున్న టీమ్స్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆస్ట్రేలియాపై WTC ఫైనల్స్లో విజయం, ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్తో ODI సిరీస్ నెగ్గడం, 27ఏళ్ల తర్వాత తాజాగా ఇంగ్లండ్లో వన్డే సిరీస్ కైవసం చేసుకోవడం.. ఇవన్నీ బవుమా కెప్టెన్సీలో SA ఎదురులేని జట్టుగా ఎదుగుతోందని చెప్పేందుకు ఉదాహరణలు.
AP: సీఎం చంద్రబాబు కొత్త హెలికాప్టర్ వినియోగిస్తున్నారు. ఇదివరకు ‘బెల్’ తయారు చేసిన ఛాపర్ వాడేవారు. అది ఎక్కువ దూరం ప్రయాణించేందుకు పనికిరాకపోవడంతో అత్యాధునిక ఫీచర్లతో కూడిన AIR Bus H160 మోడల్ హెలికాప్టర్ వాడుతున్నారు. సన్ లైట్ తగ్గినా, ఆకాశం మేఘావృతమైనా కొన్ని హెలికాప్టర్లకు అనుమతి ఇవ్వరు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఛాపర్లో లైటింగ్ తక్కువగా ఉన్నా ప్రయాణించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హైడ్రాతో ఎన్నారైలను రేవంత్ భయపెట్టారని, దీంతో వారు పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు కూలితే రాద్ధాంతం చేస్తున్నారని లండన్ పర్యటనలో మండిపడ్డారు. ఇప్పటికీ బాగు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. రేవంత్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా BRSదే విజయమన్నారు.
పెట్టుబడుల ఒప్పందాల కోసం యూకే పర్యటనకు వెళ్లిన తమిళనాడు సీఎం స్టాలిన్ స్టైలిష్ లుక్లో కనిపించారు. బ్లేజర్, సన్ గ్లాసెస్, ఇన్షర్ట్తో మెరిశారు. అక్కడి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పెరియార్ స్కెచ్ను ఆయన ఆవిష్కరించారు. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రోల్స్ రాయిస్ కంపెనీ తమిళనాడులోని హోసూర్లో డిఫెన్స్ ఇంజిన్స్ తయారు చేసేందుకు స్టాలిన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది.
త్రిమూర్తుల కన్నా సృష్టికర్త బ్రహ్మకన్నా గురువే గొప్పవాడంటారు. ఎందుకంటే ఒక విద్యార్థిని అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపే మార్గదర్శి ఆ గురువే కాబట్టి. బుద్ధులు నేర్పుతాడు.. బుద్ధిమంతుడిని చేస్తాడు. విద్యార్థి విజయాలనే తన గురు దక్షిణగా భావిస్తాడు. అలాంటి గురువులను మన జీవితంలో కలిగి ఉండటం అదృష్టంగా భావించాలి. ఏమిచ్చినా, ఎన్ని సేవలు చేసినా వారి రుణం తీర్చుకోలేం. అందరికీ గురుపూజోత్సవం శుభాకాంక్షలు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ నుంచి క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,834 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,628 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.