News September 4, 2025

NIRF.. దేశంలో టాప్ విద్యాసంస్థలు ఇవే

image

కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2025 ర్యాంకులను విడుదల చేసింది.
*యూనివర్సిటీలు: IIS బెంగళూరు, JNU ఢిల్లీ
*ఇంజినీరింగ్: IIT మద్రాస్, IIT ఢిల్లీ, IIT బాంబే
*మెడికల్: ఢిల్లీ ఎయిమ్స్
*మేనేజ్‌మెంట్: IIM అహ్మదాబాద్, IIM బెంగళూరు
*ఒవరాల్ కేటగిరీ: IIT మద్రాస్, IIS బెంగళూరు, IIT బాంబే, IIT ఢిల్లీ

News September 4, 2025

యూరియా లభ్యతపై మంత్రి లోకేశ్ ఆరా

image

AP: రైతుల ముసుగులో YCP చేస్తున్న కుతంత్రాలను తిప్పికొట్టాలని మంత్రులకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు. క్యాబినెట్‌‌కి ముందు మంత్రులతో అల్పాహార భేటీలో పాల్గొన్నారు. జిల్లాల్లో యూరియా సమస్య ఉందా అని ఆరా తీశారు. తగినంత యూరియా ఉందని మంత్రులు తెలిపారు. తెలంగాణ రాజకీయాలపైనా మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇన్‌ఛార్జి మంత్రులు సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌లు నిర్వహించాలని లోకేశ్ సూచించారు.

News September 4, 2025

రేపు రేషన్ షాపులు బంద్: డీలర్ల సంక్షేమ సంఘం

image

TG: ఈ నెల 5న రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల బంద్‌కు తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం చెల్లించాలని, అలాగే కమీషన్ పెంచాలని డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 5 నెలల కేంద్ర కమీషన్ వెంటనే విడుదల చేయాలని, అలాగే ఇక నుంచి రాష్ట్ర కమీషన్, కేంద్ర కమీషన్ వేర్వేరుగా కాకుండా ఒకేసారి చెల్లించాలని కోరుతున్నారు.

News September 4, 2025

కిమ్ జోంగ్ ఉన్ వారసురాలు ఈమేనా?

image

ఉ.కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆ దేశాన్ని ఆయన చిన్న కూతురు ‘కిమ్ జూ ఏ’ పాలించే అవకాశముందని ద.కొరియా నిఘా సంస్థ పేర్కొంది. గత మూడేళ్లుగా ఆమె కిమ్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. వయసు 10yrs ఉంటుందని, స్కూల్లో చేరకుండా ఇంట్లోనే చదువుతోందని, గుర్రపు స్వారీ, ఈత, స్కీయింగ్‌లో నైపుణ్యం కలిగి ఉందని సమాచారం. ఆమెకు ఓ సోదరుడు, ఒక సోదరి ఉన్నట్లు టాక్.

News September 4, 2025

పిఠాపురం టీచర్లకు పవన్ కానుక

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని ఉపాధ్యాయులకు చిరు కానుక అందజేశారు. SEP 5న గురుపూజోత్సవం నేపథ్యంలో టీచర్లకు వస్త్రాలు బహుమతిగా పంపారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 2 వేలమంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు, జూ.కాలేజీల లెక్చరర్లకు బహుమతులు పంపారు. మహిళా టీచర్లకు చీరలు, పురుషులకు షర్టు-ప్యాంటు అందజేశారు.

News September 4, 2025

GST తగ్గింపు.. సామాన్యులు ఖుషీ!

image

8 ఏళ్ల తర్వాత GST తగ్గడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు, వ్యవసాయ సామగ్రి, నోట్ బుక్స్, పెన్స్, ఏసీలు, టీవీలు, బైకులు, కార్లు.. ఇలా రోజువారీ జీవితంలో ఉపయోగపడే చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త పన్ను రేట్లు అమల్లోకి వస్తాయి. అప్పటివరకు ఆగి ఆ తర్వాత కొనేందుకు సామాన్యులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. GST తగ్గింపుపై మీ కామెంట్?

News September 4, 2025

ధోనీ అభిమానులకు క్రేజీ న్యూస్!

image

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మరో ఏడాది ఐపీఎల్ ఆడొచ్చని క్రీడావర్గాలు వెల్లడించాయి. N శ్రీనివాసన్ తిరిగి CSK ఫ్రాంచైజీ పగ్గాలు తీసుకున్నారని, ధోనీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపాయి. మరో సీజన్ కూడా ఆడాలని శ్రీనివాసన్ ధోనీని ఒప్పించే అవకాశం ఉందన్నాయి. కాగా 44 ఏళ్ల ధోనీ గత సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడారు. ధోనీ వచ్చే సీజన్ ఆడటం అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంది.

News September 4, 2025

కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. PPP మోడల్‌లో కొత్తగా 10 మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలకు ఆమోదం తెలపనుంది. వివిధ సంస్థలకు భూకేటాయింపులు, యూనివర్సల్ హెల్త్ పాలసీ తయారీ, అమలుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

News September 4, 2025

GST 2.0: పెరగనున్న IPL టికెట్ రేట్లు

image

కేంద్రం తీసుకొస్తున్న GST 2.0తో IPL అభిమానులకు షాక్ తగలనుంది. ఇప్పటివరకు 28% జీఎస్టీ శ్లాబులో ఉన్న ఐపీఎల్ టికెట్లపై ఇకపై 40% పన్ను పడనుంది. అంటే రూ.వెయ్యి టికెట్‌ ఇప్పుడు రూ.1280 ధరుంటే.. ఈ నెల 22 తర్వాత అది రూ.1400కు చేరుతుంది. అయితే, టీమ్ ఇండియా ఆడే అంతర్జాతీయ మ్యాచులకు మాత్రం టికెట్ ధరపై 18% జీఎస్టీనే కంటిన్యూ అవుతుంది. దానిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

News September 4, 2025

ధవన్‌కు ఈడీ నోటీసులు

image

టీమ్ ఇండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై ఆయన్ను ప్రశ్నించనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ఇప్పటికే ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.