India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ మరణించారు. సరదా కంటెంట్, వ్యంగ్యమైన రీల్స్తో అభిమానులను సంపాదించుకున్న ఆమె ఈనెల 25న పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. అయితే అంతకు 2 రోజులు ముందే మిషా చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఇవాళ ప్రకటన విడుదల చేశారు. మృతికి గల కారణాలు వెల్లడించలేదు. మిషాకు ఇన్స్టాలో 3.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘ది మిషా అగర్వాల్ షో’ ద్వారా యూట్యూబ్లోనూ ఆమె పాపులర్.
పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సొంత దేశస్థులే పాక్ సర్కారును SMలో ట్రోల్ చేస్తున్నారు. పాక్తో యుద్ధం 9లోపే చేయాలని, 9.15తర్వాత గ్యాస్ సరఫరా ఆగిపోతుందని ఒకరు, భారత ఫైటర్ జెట్లకు దీటుగా ఓ పాక్ వ్యక్తి ఫైటర్ జెట్ బైక్ నడుపుతున్న ఫొటోను మరొకరు పోస్ట్ చేశారు. లాహోర్ను భారత్ తీసుకుంటే, అక్కడేం లేదని అరగంటలో తిరిగిస్తుందని సొంత దేశ పాలనపై విసిగిపోయి మీమ్స్లో ఎండగడుతున్నారు.
ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక గుడ్డులో 6-7 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా కణజాల మరమ్మతులో సాయం చేస్తుంది. ఇందులోని కోలిన్ మెదడుకు మేలు చేస్తుంది. పచ్చసొన కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇది తినడం వల్ల ఊబకాయ ప్రమాదం తగ్గుతుంది. గుడ్లలోని విటమిన్ డి, కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తాయని నిపుణులు అంటున్నారు.
భారత్లో 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో 17.1కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి, 37.8కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ‘గత దశాబ్దకాలంలో ఇండియాలో చాలావరకు పేదరికం తగ్గింది. అత్యంత పేదరికం 16.2% నుంచి 2.3 శాతానికి పడిపోయింది. రూరల్లో 18.4% నుంచి 2.8%, అర్బన్లో 10.7% నుంచి 1.1%కి చేరింది’ అని పేర్కొంది. భారత్ లోయర్-మిడిల్-ఇన్కమ్ క్యాటగిరీలోకి వచ్చిందని తెలిపింది.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో కాల్పుల మోత మోగుతోంది. వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు భారీ కూంబింగ్ చేపట్టాయి. ఈక్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 37 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐదు రోజులుగా భద్రతా దళాలు ఇక్కడ అడవిని జల్లెడ పడుతున్నాయి.
TG: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రేపు వరంగల్లో జరగనున్న BRS రజతోత్సవ సభ రద్దు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని BRS పార్టీ ఖండించింది. SMలో వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని, సభ యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రజల నుంచి వస్తున్న అపూర్వమైన ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీలు ఫేక్ ప్రచారాలకు ఒడిగట్టాయని మండిపడింది. ఈ సభతో ఆ రెండు జాతీయ పార్టీలు భూస్థాపితం కావడం ఖాయమని తేల్చి చెప్పింది.
AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూములకు సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ‘రాయలసీమలో ఆయన కుటుంబం ముఠామేస్త్రిలా వ్యవహరిస్తోంది. మదనపల్లి ఫైల్స్ పేరుతో సినిమా తీయొచ్చు. మాధవరెడ్డి అరెస్టుతో ఆ కేసు కొలిక్కి వచ్చింది. ఆలస్యమైనా తప్పులు చేసిన వారిని జైలుకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జగన్కు రాజ్ కసిరెడ్డి అత్యంత సన్నిహితుడు’ అని మంత్రి అన్నారు.
IPL: ఈ సీజన్లో CSK ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు స్పందించారు. ‘చెన్నై దారుణంగా ఆడుతోంది. అయితే దీని నుంచి చాలా నేర్చుకునే అవకాశం ఉంది. భవిష్యత్పై దృష్టి పెట్టకపోతే ఇదే జరుగుతుంది. ఇక నుంచి మేనేజ్మెంట్ చాలా అప్రమత్తంగా ఉంటుంది. గేమ్ ఎంతలా మారిపోయిందో ధోనీ కూడా అర్థం చేసుకున్నారు. వచ్చే సీజన్కు టీమ్ను బలోపేతం చేయడంపై ధోనీ ఇప్పటికే ఆలోచన మొదలుపెట్టుంటారు’ అని వ్యాఖ్యానించారు.
TG: రేపు నిర్వహించనున్న బీఆర్ఎస్ వరంగల్ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చారిత్రక సభలో కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
పహల్గామ్ ఉగ్రదాడి నుంచి బయటపడ్డ మహారాష్ట్ర వాసి శ్రీజిత్ NIAకి కీలక సమాచారం ఇచ్చారు. తన కుమార్తె డాన్స్ వీడియోలో ఇద్దరు అనుమానితులను ఆయన గుర్తించారు. దీంతో ఆ దిశగా NIA విచారణ చేపట్టింది. దాడికి ముందు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు తేల్చింది. బైసరన్ లోయలో ఇద్దరు అనుమానితులను గుర్తించగా, దాడికి పాల్పడిన వారిలో వారు ఉన్నట్లు అనుమానిస్తోంది.
Sorry, no posts matched your criteria.