India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీమ్ ఇండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడంపై ఆయన్ను ప్రశ్నించనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ఇప్పటికే ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
NCC సర్టిఫికెట్ ఉన్న పురుష అభ్యర్థులు స్పెషల్ ఎంట్రీ కింద 70 లెఫ్టినెంట్ ఉద్యోగాలకు ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 మార్కులతో డిగ్రీ పాసైన వారు అర్హులు. 19-25ఏళ్లలోపు వయసుండాలి. NCC, డిగ్రీ మార్కులు, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో నెలకు ₹56,100 స్టైఫండ్, విధుల్లో చేరిన తర్వాత ₹లక్షకు పైగా జీతం పొందొచ్చు.
వెబ్సైట్: <
డెలివరీ తర్వాత తల్లికి పాలు పడకపోయినా, పాలు పట్టలేని స్థితిలో ఉన్నా శిశువులకు ఫార్ములా పాలు ఇస్తుంటారు. వీటిని సరైన కొలతలతో, జాగ్రత్తగా పట్టాలి. ఒక స్పూన్ పాలపొడికి ఎన్ని నీళ్లు కలపాలో సరిగ్గా చెక్ చేసుకోవాలి. లేదంటే చిన్నారులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాలు కలిపిన వెంటనే వారికి పట్టించాలి. అలాగే వారు ఒకసారి కాస్త తాగి వదిలేసిన వాటిని మళ్లీ ఇవ్వకూడదు. కాచి చల్లార్చిన నీటితో మాత్రమే పాలు కలపాలి.
అమ్మానాన్న విడిపోవడం లేదా ఎవరో ఒకరు చనిపోయినపుడు ఒంటరిగానే పిల్లలను పెంచాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, స్వీయసానుభూతి దూరం చేసుకోవాలి. ఉద్యోగం, పిల్లల సంరక్షణపై శ్రద్ధ చూపిస్తూ జీవితాన్ని సమన్వయం చేసుకోవాలి. పిల్లలు కుంగుబాటుకు గురవకుండా వారికి తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. అప్పుడే వారు జీవితంలో ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.
ప్రస్తుతకాలంలో అమ్మాయిలూ సోలో ట్రిప్లు చేస్తున్నారు. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందే మీరు వెళ్లే ప్రదేశంలో ఆహార, వసతి, రవాణా సౌకర్యాల గురించి తెలుసుకోండి. చిన్న కీపాడ్ మొబైల్ని తీసుకెళ్తే అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా తక్కువ లగేజ్ ఉండేలా చూసుకోవాలి. కార్డులతో పాటు క్యాష్ తీసుకెళ్లడం మంచిది. ఎప్పటికప్పుడు మీ లొకేషన్ని సన్నిహితులకు తెలియజేయాలి.
బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 100 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాసవ్వాలి. వయసు 29ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 జీతం ఉంటుంది.
వెబ్సైట్: <
2025-26 విద్యాసంవత్సరంలో ఎంఈ/ఎంటెక్/ఎం.డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏఐసీటీఈ శుభవార్త చెప్పింది. వారికి గేట్/సీఈఈడీ స్కోర్ ఆధారంగా నెలకు రూ.12,400 స్కాలర్షిప్ అందించనుంది. విద్యార్థులు సంబంధిత సంస్థ నుంచి ఐడీని తీసుకుని <
ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై 18% GST వసూలు చేస్తున్నారు. నిన్నటి కౌన్సిల్ భేటీలో దీన్ని తగ్గించలేదు. దీంతో ఫోన్ల ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు. పెట్రోల్, ఆల్కహాల్ను ఈసారి కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. వాటిపై రాష్ట్రాలు ఒక్కో రకమైన వ్యాట్ విధిస్తున్నాయి. ఫలితంగా వాటి ధరలు కూడా తగ్గే అవకాశం లేదు. మరోవైపు రూ.2,500 దాటిన దుస్తులు, పాదరక్షల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.
దాదాపు పది రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ శాంతించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,06,860కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.97,950 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
TG: అప్డేట్ చేయని ఆధార్ కార్డులపై రాష్ట్రం పేరు AP అని ఉంటే మహిళలకు జీరో టికెట్ ఇచ్చేందుకు కొందరు బస్ కండక్టర్లు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గ్రేటర్ RTC ED రాజశేఖర్ స్పందించారు. ఆధార్పై తెలంగాణ లోకల్ అడ్రస్ ఉంటే చాలని స్పష్టం చేశారు. ఒకవేళ కండక్టర్లు నిరాకరిస్తే 04069440000 TOLL FREE నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. అయితే ఆధార్ అప్డేట్ చేసుకుంటే మంచిదని అధికారులు సూచించారు.
Sorry, no posts matched your criteria.