India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్తగా తీసుకొచ్చిన GST సంస్కరణలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. అయితే SIN(హానికర) ట్యాక్స్ పరిధిలో ఉన్న సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, టొబాకో, జర్దా, బీడీలపై విధించిన 40% ట్యాక్స్ అమల్లోకి రావడానికి మరింత సమయం పట్టనుంది. తదుపరి తేదీ ప్రకటించే వరకు ఇవి 28% శ్లాబ్లోనే కొనసాగనున్నాయి. ప్రస్తుతం సిగరెట్లపై సైజ్లను బట్టి GST, సెస్ కలిపి గరిష్ఠంగా 64% ట్యాక్స్ అమల్లో ఉంది.
కొత్త జీఎస్టీ విధానంలో లగ్జరీ <<17606719>>కార్లను<<>> 40% శ్లాబులోకి (గతంలో 28%) తెచ్చారు. అయితే ఇంజిన్ కెపాసిటీతో సంబంధం లేకుండా అన్ని కార్ల ధరలు తగ్గుతాయని మీకు తెలుసా? ఎలా అంటే..
*ప్రస్తుతం 1200 cc (పెట్రోల్ ఇంజిన్) కంటే ఎక్కువ ఉన్న కార్లపై 28% జీఎస్టీతో పాటు 22% సెస్ వేస్తున్నారు. దీంతో పన్ను 50% పడుతోంది. కొత్త విధానంలో 40% జీఎస్టీలోకి తెచ్చారు. కానీ సెస్ పూర్తిగా తొలగించారు. దీంతో 10% పన్ను మిగిలినట్లే..
GST సంస్కరణలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, MP చిదంబరం స్పందించారు. ‘జీఎస్టీ హేతుబద్ధీకరణ, గూడ్స్&సర్వీసెస్పై ట్యాక్స్ తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ చాలా ఆలస్యమైంది. 8 ఏళ్ల క్రితం GST ప్రవేశపెట్టినప్పుడే ఈ పని చేయాల్సింది. ఇంతకాలం రేట్లను తగ్గించాలని మేం ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? ట్రంప్ సుంకాలా? బిహార్ ఎన్నికలా?’ అని ప్రశ్నించారు.
AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విషయమై చర్చించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు.
SEP 5న వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో అన్లిమిటెడ్ డేటాను ఫ్రీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూ.349 ప్లాన్ (రోజుకు 2GB)ను 12 నెలల పాటు కంటిన్యూగా రీఛార్జ్ చేసుకున్న వారికి మరో నెల (SEP 5 నుంచి OCT 5 వరకు) ఉచితంగా ఆ ప్లాన్ను అందిస్తామని తెలిపింది. అలాగే సెప్టెంబర్ 5-7 వరకు 5G యూజర్లందరూ ఎలాంటి రీఛార్జ్ లేకుండా అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. 4G యూజర్లు రూ.39తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
GST శ్లాబుల కోతతో ప్రభుత్వానికి రూ.93వేల కోట్ల ఆదాయం తగ్గనుంది. అదే సమయంలో లగ్జరీ వస్తువులను 40% జీఎస్టీ శ్లాబులోకి తీసుకురావడం వల్ల రూ.45వేల కోట్ల ఆదాయం రానుంది. ఫలితంగా రూ.48వేల కోట్ల లోటు ఏర్పడనుంది. అయితే పన్ను తగ్గింపుతో ప్రజల వద్ద డబ్బు మిగులుతుంది. దాన్ని ఖర్చు చేసేందుకు ఇష్టపడతారు. దీంతో ఆ డబ్బు తిరిగి ఎకానమీలోకి వస్తుంది. పన్ను తగ్గించినా ప్రభుత్వానికి పెద్దగా నష్టం ఉండదు.
APలో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు. ‘OCT 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలి. NOV 30లోగా పోలింగ్ కేంద్రాలు, DEC 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. 2026 JANలో ఎన్నికల నోటిఫికేషన్, ఫలితాలు ప్రకటించాలి’ అని ప్రీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించారు. కాగా 2026 APRలో సర్పంచుల పదవీకాలం ముగియనుంది.
AP: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు కదిలేందుకు అవకాశముందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కృష్ణా, గోదావరి నదుల ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
AP: CM చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ భేటీ కానుంది. అమరావతికి సంబంధించి ఇటీవల జరిగిన SIPB, CRDA సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించనుంది. రాజధానిలో భూసేకరణ జరిపేందుకు CRDAకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేయనుంది. రూ.53వేల కోట్ల పెట్టుబడులు, 83వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది. అలాగే ఈనెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్పై చర్చించనుంది.
బెట్టింగ్, క్యాసినో, గ్యాంబ్లింగ్, హార్స్ రైడింగ్, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్పై కేంద్రం 40% GST విధించింది. అలాగే IPL వంటి స్పోర్టింగ్ ఈవెంట్స్నూ 40% శ్లాబ్లో చేర్చింది. అయితే గుర్తింపు పొందిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఈ శ్లాబ్ పరిధిలోకి రావని చెప్పింది. వీటితో పాటు ఇతర క్రీడా కార్యక్రమాల టికెట్ ధర రూ.500 మించకుంటే జీఎస్టీ వర్తించదని తెలిపింది. అంతకు మించితే 18% ట్యాక్స్ కొనసాగుతుందని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.