India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ‘కొత్త లోక’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. లో బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఫస్ట్ వీక్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. డొమినిక్ అరుణ్ రూపొందించిన ఈ మూవీని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. గత నెల 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. హీరోయిన్కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ.
దేశ సేవ కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఎంతో మంది మహానుభావులు మనకు స్ఫూర్తినిస్తుంటారు. వారిలో బ్రిగేడియర్ గిడుగు హిమశ్రీ ఒకరు. 1988లో ఇండియన్ ఆర్మీలో చేరిన ఆమె 37ఏళ్లపాటు వివిధ ర్యాంకుల్లో సేవలందించారు. అరుణాచల్ అడవుల నుంచి సియాచిన్ మంచు శిఖరాల వరకు అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ మెడికల్ యూనిట్లకు నాయకత్వం వహించారు. సోమాలియా వంటి సంఘర్షణ ప్రాంతాలలోనూ ఆమె అచంచలమైన ధైర్యాన్ని, దేశభక్తిని ప్రదర్శించారు.
TG: కేసీఆర్కు తాను రాసిన లేఖను లీక్ చేసింది సంతోష్ రావేనని కవిత ఆరోపించారు. ‘నా దగ్గర ఉన్న విషయాలన్నీ బయటపెడితే BRS నేతలంతా ఇబ్బందిపడతారు. హరీశ్, సంతోష్ అక్రమాల గురించి గతంలోనే KCRకు చెప్పా. ఇప్పటివరకు రెండు గ్యాంగులతో అంతర్గతంగా పోరాడా. ఇప్పుడు బయట నుంచి ఫైట్ చేస్తా. చెప్పాల్సింది చాలా ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా’ అని మీడియాతో పేర్కొన్నారు.
కేంద్రానికి ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘చైనా నుంచి రావాల్సిన యూరియా రాకపోవడం, దేశీయంగా ఉత్పత్తి పెంచకపోవడం వల్ల కొరత వచ్చింది. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్కి ఆస్కారం లేదు. రామగుండంలో 4 నెలలుగా ఉత్పత్తి నిలిచిపోయింది’ అని వివరించారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సాయం చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు.
వంగ, బెండ మొక్కలపై తొలి దశలో అక్షింతల పురుగు, పెంకు పురుగులను గమనిస్తే ఏరి చంపేయాలి. కొమ్మతొలుచు పురుగు ఆశించిన రెమ్మలను కింది వరకు తుంచి నాశనం చేయాలి. పంట కాపునకు ముందు దశలో పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిపాస్, 2.5ml క్వినాల్ఫాస్, 2ml ప్రొఫెనోఫాస్ మందులలో ఏదో ఒకదానిని 5ml వేపమందుతో కలిపి స్ప్రే చేయాలి. అవసరాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మందు మార్చి మరోసారి స్ప్రే చేయవచ్చు.
కాపు దశలో కాయలను కోసే ముందు అక్షింతల పురుగు, పెంకు పురుగులు ఆశించిన రెమ్మలను, కాయలను, పిందెలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కాయలు కోయాలి. తోటలో మొక్కలు బాగా తడిసేటట్లు కాయలు కోసిన తర్వాత లీటరు నీటికి 0.5 గ్రా ఎమామెక్టిన్ బెంజోయేట్, 0.4ml కోరాజిన్, 2ml ప్రొఫినోపాస్ మందుల్లో ఒక దానిని 5ml వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. కాయలను కోసేముందు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ మందులు స్ప్రే చేయకూడదు.
చాలామంది స్త్రీలలో గర్భాశయం, ఫెలోఫియన్ ట్యూబ్లు, అండాశయాల్లో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వస్తుంది. క్లామీడియా, గోనోరియా బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. రోగనిరోధక శక్తి లేకపోవడం, ప్రసవం, గర్భస్రావం తర్వాత కొన్నిసార్లు ఈ సమస్య వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే వంధ్యత్వ ప్రమాదం ఉంది. పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి.
చాలామంది అమ్మాయిలు వారి భావోద్వేగాలను సోషల్ మీడియాలో పంచుకొని, జనాల మద్దతు కోరుకుంటూ ఉంటారు. దీనివల్ల నష్టాలే ఎక్కువంటున్నారు మానసిక నిపుణులు. ఇలా చేస్తే మీ సమస్యలను కొందరు అవకాశంగా తీసుకోవచ్చు. దీనివల్ల కొత్త ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి సన్నిహితులు, మానసిక ఆరోగ్యనిపుణుల సాయం తీసుకోవడం మంచిది. SMలో ఏవైనా పోస్టు చేసేటప్పుడు జాగ్రత్త, గోప్యత వహించాలి.
ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు కళకళలాడుతుంది. అందుకే ప్రతి మహిళ తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. *వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో కండరాలు బలహీనంగా మారతాయి. కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామం చేయాలి. *వెజ్, నాన్ వెజ్ రూపంలో ప్రోటీన్ తీసుకోవాలి. *కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. *బోన్ హెల్త్ కోసం 35+ వయసున్నవారు వారానికి 2సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి.
AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో 5 నెలల్లోనే 28 మంది మరణించారు. ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేయగా వారికి ‘ఇన్ఫెక్షన్ మెలియాయిడోసిస్’ అనే డేంజర్ వ్యాధి సోకినట్లు గుర్తించారు.. బర్కోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది. బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు త్వరగా సోకుతుంది. దీని వల్ల జ్వరం వచ్చి ప్రాణాలు పోవచ్చు. అక్కడ టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.