India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చాలామంది అమ్మాయిలు వారి భావోద్వేగాలను సోషల్ మీడియాలో పంచుకొని, జనాల మద్దతు కోరుకుంటూ ఉంటారు. దీనివల్ల నష్టాలే ఎక్కువంటున్నారు మానసిక నిపుణులు. ఇలా చేస్తే మీ సమస్యలను కొందరు అవకాశంగా తీసుకోవచ్చు. దీనివల్ల కొత్త ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి సన్నిహితులు, మానసిక ఆరోగ్యనిపుణుల సాయం తీసుకోవడం మంచిది. SMలో ఏవైనా పోస్టు చేసేటప్పుడు జాగ్రత్త, గోప్యత వహించాలి.
ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు కళకళలాడుతుంది. అందుకే ప్రతి మహిళ తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. *వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో కండరాలు బలహీనంగా మారతాయి. కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామం చేయాలి. *వెజ్, నాన్ వెజ్ రూపంలో ప్రోటీన్ తీసుకోవాలి. *కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. *బోన్ హెల్త్ కోసం 35+ వయసున్నవారు వారానికి 2సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి.
AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో 5 నెలల్లోనే 28 మంది మరణించారు. ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేయగా వారికి ‘ఇన్ఫెక్షన్ మెలియాయిడోసిస్’ అనే డేంజర్ వ్యాధి సోకినట్లు గుర్తించారు.. బర్కోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది. బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు త్వరగా సోకుతుంది. దీని వల్ల జ్వరం వచ్చి ప్రాణాలు పోవచ్చు. అక్కడ టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
TG: గతంలో పార్టీకి ఎన్నోసార్లు వెన్నుపోటు పొడవాలని హరీశ్ రావు ప్రయత్నించారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హరీశ్ వల్లే ఈటల, మైనంపల్లి, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు పార్టీని వీడారని మండిపడ్డారు. ‘దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి హరీశే కారణం. హరీశ్, సంతోష్ మేకవన్నె పులులు. నాన్నకు నన్ను దూరం చేసేందుకు కుట్ర చేశారు’ అని ఆమె విరుచుకుపడ్డారు.
TG: ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తల్లికి దూరంగా ఉండటమే తనను ఎక్కువగా బాధిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ‘తల్లితో మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? నా తల్లికి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకుమించిన బాధ ఇంకోటి లేదు. రాజకీయ పదవులు వస్తాయి, పోతాయి. కానీ తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు’ అని ఎమోషనల్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ అవటం తన జీవితంలో ముఖ్యమైన పరిణామం అని పేర్కొన్నారు.
లండన్లో నిర్వహించిన యోయో, బ్రాంకో టెస్టుల్లో <<17597735>>విరాట్ కోహ్లీ<<>> పాస్ అయ్యారు. ఫిట్నెస్ టెస్ట్ వ్యవహారంలో BCCI ఫేవరిటిజం ప్రదర్శించిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆటగాళ్లందరికీ బెంగళూరులో నిర్వహించి, కోహ్లీకి ఒక్కడికే విదేశాల్లో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అతడికే ఎందుకు ఈ స్పెషల్ ప్రివిలేజ్ అని నిలదీస్తున్నారు. కాగా కొంతకాలంగా కోహ్లీ లండన్లోనే ఉంటున్నారు.
TG: కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని కవిత అన్నారు. ‘కేసీఆర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అడిగేంత ధైర్యం, అనుభవమూ నాకు లేవు. ఆయన నిర్ణయాన్ని శిరసావహిస్తాను. నా లేఖ లీకైందని చెప్పి వంద రోజులైంది. అప్పటి నుంచి పార్టీ నన్ను వివరణ అడగలేదు. గతంలో పార్టీపై విమర్శలు చేసిన రవీందర్ రావు ఇప్పుడు నన్ను సస్పెండ్ చేస్తూ లేఖపై సంతకం చేశారు’ అని కవిత వ్యాఖ్యానించారు.
పశువులు మురికినీరు, శుభ్రంగా లేని మేత తీసుకోవడం, వ్యాధి నిరోధకశక్తి తగ్గినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. తల్లికి ఉంటే పుట్టే దూడకు సులభంగా సోకుతుంది. దీంతో వాటి చర్మం మొద్దుబారడం, బక్కచిక్కడం, వెంట్రుకలు ఊడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులకు ఆకలి ఉండదు. మేత తీసుకోకపోవడం వల్ల శరీరం నీరసించి లేవలేని స్థితికి చేరుకుంటాయి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి.
సూర్యభగవానుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి పూజ చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి కూర్చోవడం శ్రేష్ఠమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఒకవేళ అది వీలుకాకపోతే, ఇతర దిక్కుల వైపు తిరిగి పూజ చేయవచ్చు. అయితే, దక్షిణం వైపు మాత్రం పూజ చేయకూడదు. ఎందుకంటే, దక్షిణం దిక్కు యమధర్మరాజు దిశ. మరణానికి ప్రతీక. అందుకే పెద్దలు దక్షిణం వైపు చూసి పూజలు, జపాలు చేయడం హానికరం అని చెబుతారు.
చర్మ సంరక్షణలో సన్స్క్రీన్ది కీలకపాత్ర. సీజన్తో సంబంధం లేకుండా ప్రతిరోజూ సన్స్క్రీన్ రాసుకోవడం ముఖ్యం. ఇది ట్యానింగ్, వృద్ధాప్యఛాయలు రాకుండా చూస్తుంది. ఎక్కువసేపు ఎండలో ఉండేవారు 2 గంటలకొకసారి సన్స్క్రీన్ రాసుకోవాలి. వేసవిలో వాటర్ రెసిస్టెంట్ సన్స్క్రీన్ వాడటం మంచిది. ప్రస్తుతం వాడే వివిధ రకాల లైట్ల వల్ల కూడా చర్మానికి హాని కలుగుతుంది. కాబట్టి ఇండోర్లో ఉన్నా సన్స్క్రీన్ వాడటం మంచిది.
Sorry, no posts matched your criteria.