India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 37 ఏళ్ల యువకుడు వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్కు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఏ సంగీతమైనా నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే గుండెపై హానికర ప్రభావం పడుతుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.
Share it
మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో గర్భాశయ ఆరోగ్యం చాలా ముఖ్యం. దీనికోసం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది వ్యర్థాలని బయటకు నెట్టి ఇన్ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉండే ఆహారాలు తీసుకుంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడకుండా చూస్తాయి. కణితులు ఏర్పడకుండా విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తినాలి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే గుమ్మడి, అవిసె గింజలు, నువ్వులు తీసుకోవాలి.
స్త్రీల జీవితంలో గర్భధారణ సమయం కీలకమైనది. అయితే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రావడం తల్లీబిడ్డలకు ప్రమాదం అంటున్నారు వైద్యనిపుణులు. ముందునుంచే ఫిట్స్ ఉంటే గర్భందాల్చిన తర్వాత న్యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్లను సంప్రదించాలి. లేకపోతే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కొందరు ప్రెగ్నెన్సీలో ఫిట్స్ మెడికేషన్ మానేస్తారు. ఇలాచేస్తే తల్లీబిడ్డలకు ప్రమాదం. కాబట్టి డాక్టర్ సూచనలతో మందులను వాడాలి.
TG: కవిత సస్పెన్షన్ నేపథ్యంలో BRS అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సంజయ్లతో భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్ తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నారు. అటు మరికాసేపట్లో కవిత మీడియాతో మాట్లాడనున్నారు.
RCB విన్నింగ్ పరేడ్లో జరిగిన దుర్ఘటనపై విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించారు. ‘జూన్ 4న జరిగిన హృదయ విదారక ఘటన ఎవరూ ఊహించనిది. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణంగా ఉండాల్సిన రోజు విషాదంగా మారిపోయింది. తొక్కిసలాటలో చనిపోయిన, గాయపడిన అభిమానుల కోసం ప్రార్థిస్తున్నా. ఈ నష్టం ఇప్పుడు మనలో ఒక భాగం. కలిసికట్టుగా, బాధ్యతాయుతంగా ముందుకు వెళ్దాం’ అని కోహ్లీ ఎమోషనల్ అయ్యారు.
AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారినట్లు APSDMA తెలిపింది. అది 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
❃ విగ్రహం ఎత్తును బట్టి నిర్దేశించిన రూట్లలో మాత్రమే శోభాయాత్ర నిర్వహించాలి.
❃ నిర్ణీత ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలి.
❃ పోలీస్, మున్సిపల్/పంచాయతీ సిబ్బంది సాయం తీసుకోవాలి.
❃ చెరువులు, నీటి కుంటల్లోకి దిగొద్దు. భారీ విగ్రహాల కోసం క్రేన్ వాడాలి.
❃ వాహనాలను నడిపేందుకు నిపుణులైన డ్రైవర్లను నియమించుకోవాలి.
ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సవరించే శ్లాబులు, రేట్లను కేంద్రం ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చే యోచనలో ఉంది. రేట్లు ఇలా మారే అవకాశం ఉంది.
*టెక్స్టైల్ ఉత్పత్తులు, ట్రాక్టర్లపై 12% నుంచి 5%
*చెప్పులు, డైరీ ఉత్పత్తులు, ఫ్రూట్ జ్యూస్, హ్యాండ్ బ్యాగ్స్, ప్రాసెస్డ్ కాఫీ 12% నుంచి 5%
*ఏసీలు, టీవీలు, సిమెంట్ 28% నుంచి 18%
*1500 cc లగ్జరీ కార్లు, 300 cc బైకులు, పొగాకు ఉత్పత్తులు 28% నుంచి 40%
TG: హరీశ్ రావు, సంతోశ్ రావులపై అవినీతి ఆరోపణలు చేసిన కవితను నిన్న BRS సస్పెండ్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న KCR అన్న కూతురు రమ్యా రావు సైతం గతంలో పార్టీకి దూరమయ్యారు. స్వయాన కేసీఆరే ఆమెకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అయితే కుటుంబ కలహాలతో రమ్య తెలంగాణ ఆవిర్భావానికి ముందే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆమె KCR, సంతోశ్ రావులపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేయడం అప్పట్లో సంచలనమైంది.
UPలో 52 ఏళ్ల మహిళ 26 ఏళ్లుగా నమ్మించడంతో ప్రియుడు చంపేశాడు. ఫరూఖాబాద్కు చెందిన మహిళకు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో మైన్పురికి చెందిన అరుణ్ కుమార్ ఆమెకు పరిచయమయ్యాడు. ఆమె ఫొటో ఫిల్టర్స్ వాడి 26 ఏళ్ల యువతిగా అతడిని నమ్మించింది. కొన్ని రోజులకు వీరిద్దరూ ఏకాంతంగా కలుసుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విసుగెత్తిపోయిన ఆ యువకుడు ఆమెను ఊపిరాడకుండా చేసి హతమార్చాడు.
Sorry, no posts matched your criteria.