India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేసవిలో విరివిగా దొరికే మామిడి పండ్లు ఇష్టపడనివారుండరు. అయితే, మార్కెట్లో దాదాపు 37 రకాల మామిడి పండ్లున్నాయనే విషయం చాలామందికి తెలియదు. అందులో కొన్ని.. బంగినపల్లి, నీలం, చందూరా, రుమానియా, మల్గోవా, చక్కెర కట్టి, గిర్ కేసర్ మామిడి, అంటు మామిడి, బెంగుళూరు మామిడి, రసాలు, చెరకు రసాలు, షోలాపూరి, అల్ఫాన్సా, నూజివీడు రసం, పంచదార కలశ, కోలంగోవా, ఏండ్రాసు, సువర్ణరేఖ, పండూరివారి మామిడి, కొండమామిడి.
ఏపీలో లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ ఫోకస్ చేసింది. ఈ కుంభకోణంపై సీఐడీ అధికారులు నమోదు చేసిన FIR వివరాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఈ కేసుతో సంబంధం ఉందని అధికారులు గుర్తించిన వారి బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలను అందజేయాలని లేఖ రాసింది. అరెస్టయిన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు, వారిపై ఛార్జ్షీట్ నమోదు చేసి ఉంటే ఆ కాపీలనూ అందజేయాలంది.
లాహోర్, రావల్పిండి నగరాల్లో భారత దాడుల తీవ్రత ఊహాతీతం. ఆర్థిక నష్టాన్ని పక్కన పెడితే మన సైన్యం శత్రుదేశం నాభికి గురిపెట్టి నాశనం చేసినట్టు సమాచారం. ఈ దాడుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిస్సైల్ బ్యాటరీలను బూడిద చేయడం తెలిసిందే. అంటే మన క్షిపణులు దాడిచేస్తే ఆపలేరు. వాళ్లు ప్రయోగించాలంటే బ్యాటరీలు ఉండవు. రెంటికీ చెడ్డ రేవడిగా మారిన పాక్ దీన్నుంచి కోలుకోవడం సులువేం కాదని నిపుణుల అంచనా. మీరేమంటారు?
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ బండి ప్రకాశ్ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించారు.
ఇవాళ పాక్ చేసిన మిస్సైల్స్ దాడిని మన <<16347393>>S-400<<>> సుదర్శన్ చక్ర క్షిపణి వ్యవస్థ అడ్డుకున్న విషయం తెలిసిందే. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే.. 360 డిగ్రీల సర్వైలెన్స్తో 600 కి.మీ.దూరంలోని 300 లక్ష్యాలను ట్రాక్ చేసి దాడులను నిర్వీర్యం చేస్తుంది. అలాగే, ఒకేసారి 36 లక్ష్యాలపై మిస్సైల్స్ను సంధించగలిగే శక్తి ఉంది. S-400 స్క్వాడ్రన్లలో ఒకటి J&K- పంజాబ్ను, మరొకటి గుజరాత్-రాజస్థాన్ను కవర్ చేస్తున్నాయి.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో ‘డ్రాగన్’ మూవీ భామ కయాదు లోహర్ నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇటీవల విడుదలైన డ్రాగన్ మూవీలో కయాదు పేరు మార్మోగింది. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచింది.
AP: రాష్ట్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాలకు క్యాచీగా ఉండే పేర్లు పెట్టాలని క్యాబినెట్ సమావేశంలో సూచించారు. మరోవైపు ఉగ్రమూకలపై దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరు బాగుందని మంత్రి వర్గం అభిప్రాయపడినట్లు సమాచారం.
భారత విదేశాంగ శాఖ ఈ సాయంత్రం గం.5:30కి ప్రెస్మీట్ నిర్వహించనుంది. ఆపరేషన్ సిందూర్, పాక్ దాడులతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో MEA సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.
– ఈ ప్రెస్మీట్ లైవ్ వే2న్యూస్లో చూడవచ్చు.
APలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని CM చంద్రబాబు చెప్పారు. తిరుపతి(D) శ్రీసిటీలో ₹5,800 కోట్ల పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. దీనిద్వారా 2,500కు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ(SIPC) కింద ఈ ప్రాజెక్ట్ 100% ప్రోత్సాహకాలు పొందనుందని ట్వీట్ చేశారు. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి ఇదొక కొత్త అధ్యాయమని పేర్కొన్నారు.
చాలామంది అమ్మాయిలకు పీరియడ్స్, ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ వస్తాయి. అయితే ఇవి పోషకలోపానికి సంకేతాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, డీహైడ్రేషన్, హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల తీపి పదార్థాలవైపు మనసు మళ్లుతుంది. ఇలాంటప్పుడు మూల కారణాలు గుర్తించి సరిదిద్దాలి. ఒకవేళ క్రేవింగ్స్ వస్తే డార్క్ చాక్లెట్, స్వీట్ కార్న్, డ్రై ఫ్రూట్స్ వంటివి తింటే ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
Sorry, no posts matched your criteria.