India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐబీపీఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-CSA(xv) 10,277 క్లర్క్ పోస్టుల దరఖాస్తుల సవరణకు ఇవాళే చివరి తేదీ. అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు ఏవైనా వివరాలు తప్పుగా ఎంటర్ చేస్తే ఇవాళ రా.11.59లోపు మార్పులు చేసుకోవచ్చు. అభ్యర్థులకు అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో ప్రిలిమ్స్, నవంబర్ 29న మెయిన్స్ నిర్వహిస్తారు. కాగా ఈ ఉద్యోగాలకు గత నెల 28తో దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే.
వెబ్సైట్: <
ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఏకాదశి నాడు ఈ మొక్కను పూజిస్తే విష్ణువు సంతోషించి తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని ప్రతీతి. వివాహిత స్త్రీలు తులసి పూజ చేస్తే వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు, దాంపత్య ఆనందం కలుగుతాయని నమ్ముతారు. ఏకాదశి నాడు తులసి దానం చేయడం వలన అష్టైశ్వర్యాలు పెరుగుతాయని విశ్వాసం.
స్కోర్ లైన్ లేని టాబ్లెట్లను విరిచి వేసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘వైద్యుల సూచన లేకుండా ఏ టాబ్లెట్ను విరిచి వేసుకోవద్దు. టాబ్లెట్ను విరిస్తే దాని పనితీరు దెబ్బతినడంతో పాటు హానికరంగా మారే అవకాశముంది. డ్రగ్ రక్తంలో ఒకేసారి రిలీజై డోస్ ఎక్కువ అవ్వొచ్చు లేదా ఇన్ఎఫెక్టీవ్గా మారొచ్చు. కడుపులో ఇరిటేషన్ వచ్చే ఛాన్సుంటుంది. ఒకవేళ వైద్యులు సూచిస్తే పిల్ కట్టర్ వాడాలి’ అని సూచిస్తున్నారు.
TG: గ్రామ పంచాయతీలను గ్రేడింగ్ చేసి క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షుడు (TPSA) పి.మధుసూదన్ వెల్లడించారు. పంచాయతీ సెక్రటరీల పదోన్నతులకు అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,06,970కు చేరింది. కాగా 9 రోజుల్లో రూ.5,460 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.98,050 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.900 పెరిగి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
☛ ఈ నెల 5న మాదాపూర్ హైటెక్స్లో 5వేల మంది గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
☛ 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్
☛ గిరిజన గ్రామాల్లో బీటీ రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.700 కోట్లు మంజూరు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
☛ చెరువులు, పార్కుల ఆక్రమణ/కబ్జాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులోకి హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ 1070
భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే తన బిగ్గెస్ట్ డ్రీమ్ అని రింకూ సింగ్ వెల్లడించారు. ‘అవకాశం వస్తే అన్ని ఫార్మాట్లలో రాణించగలననే నమ్మకం ఉంది. టీ20 స్పెషలిస్ట్ ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ఒక్క ఫార్మాట్కే పరిమితం కావాలనుకోవట్లేదు. నేను సిక్సులు కొడితే ఫ్యాన్స్ ఇష్టపడతారని తెలుసు. కానీ రంజీల్లో కూడా నా సగటు (55) బాగుంది. రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
TG: ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించాలని కంపెనీ యాజమాన్యాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కంపెనీలన్నీ ఒకే ధరకు సరఫరా చేయాలని సూచించారు. దీనిపై సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో త్వరలో సమావేశమై ధరలను ఫైనల్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన ఈ పథకానికి సహకారం అందించడం తమ అదృష్టమని మంత్రులతో అన్నారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ వింటున్నానని, అవన్నీ అవాస్తవాలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. గత వారం రోజులుగా తాను గోల్ఫ్ ఆడుతూ చాలా యాక్టివ్గా ఉన్నట్లు వెల్లడించారు. వైట్ హౌస్లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాగా కొద్ది రోజులుగా ట్రంప్ బహిరంగంగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ‘<<17563031>>ట్రంప్ ఈజ్ డెడ్<<>>’ అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
AP: చంద్రబాబుకు ధైర్యముంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడాలన్న <<17591420>>సజ్జల<<>> కామెంట్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. ‘పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని కొంతమంది మాట్లాడుతున్నారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నా విజ్ఞప్తి. సభకు రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి. స్పీకర్గా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తా’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.