News September 3, 2025

APPLY: రూ.1,40,000 జీతంతో 248 పోస్టులు

image

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NHPC) 248 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్, JE, సీనియర్ అకౌంటెంట్, సూపర్‌వైజర్(IT), హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. వయసు 30 ఏళ్లకు మించకూడదు. పోస్టులను బట్టి డిగ్రీ/బీ.టెక్/సీఏ చదివి ఉండాలి. జీతం పోస్టులను బట్టి నెలకు రూ.27,000-రూ.1,40,000 వరకు ఉంటుంది. వచ్చే నెల 1లోగా nhpcindia సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 3, 2025

కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి!

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తయినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. మిగతా ప్లేయర్లందరికీ ఇండియాలోనే టెస్టులు జరగగా, ఆయనకు మాత్రమే విదేశాల్లో నిర్వహించారని పేర్కొన్నాయి. ఇటీవల రోహిత్ శర్మ, గిల్, సిరాజ్, బుమ్రా తదితర ఆటగాళ్లకు బెంగళూరులో ఫిట్‌నెస్ టెస్టులు <<17575424>>జరిగిన<<>> సంగతి తెలిసిందే. ఈ నెలలో నిర్వహించే సెకండ్ ఫేజ్‌లో మిగతా ప్లేయర్లనూ పరీక్షించనున్నారు.

News September 3, 2025

అమరావతి.. ఆ 1,800 ఎకరాల సేకరణకు నిర్ణయం

image

AP: అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే 32వేల ఎకరాలను సమీకరించింది. అయితే ఆయా భూముల మధ్యలో ఉన్న 1,800 ఎకరాలను ఇచ్చేందుకు 80 మంది రైతులు ఇష్టపడలేదు. దీంతో నిర్మాణాలకు ఇబ్బంది కలుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా వాటిని సేకరించాలని CRDA నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించాలని కోరినా రైతులు అంగీకరించకపోవడంతో ల్యాండ్ అక్విజిషన్ (భూ సేకరణ) చేయాలని డిసైడ్ అయింది.

News September 3, 2025

‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశానికి చీఫ్ గెస్ట్‌గా సీఎం రేవంత్

image

TG: CM రేవంత్ ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలో ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున, గిరిజన నియోజకవర్గాలు, ఐటీడీఏ ప్రాంతాలకు అదనంగా 1000 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తోంది.

News September 3, 2025

నాకు లాంగ్ హనీమూన్ కావాలి: జాన్వీ కపూర్

image

తన పెళ్లి, హనీమూన్ గురించి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను ఇంతకుముందు చెప్పినట్లే నా పెళ్లి తిరుపతిలోనే జరుగుతుంది. అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లాడతా. వివాహ తంతు త్వరగా ముగిసేలా చూసుకుంటా. కానీ హనీమూన్ మాత్రం చాలా లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం వీర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు టాక్.

News September 3, 2025

నేడు మీడియా ముందుకు కవిత.. ఉత్కంఠ

image

TG: BRS నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల <<17590774>>కవిత<<>> నేడు మీడియాతో మాట్లాడనున్నారు. HYD బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మ.12 గం.కు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అందులో MLC సభ్యత్వం రద్దు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. BRS నేతలపై ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం అవినీతిపై మరిన్ని వివరాలు చెబుతారా, హరీశ్ రావును మరోసారి టార్గెట్ చేస్తారా అనేది చూడాలి.

News September 3, 2025

2 చోట్ల ఓట్లు.. కాంగ్రెస్ లీడర్‌‌కు EC నోటీస్

image

రూల్స్‌కు విరుద్ధంగా 2 నియోజకవర్గాల్లో ఓట్లు కలిగి ఉన్నారని కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాకు ఢిల్లీ ఎన్నికల సంఘం నోటీస్ ఇచ్చింది. ఈనెల 8లోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామంది. దీనిపై ఖేరా ఫైరయ్యారు. ‘ఓట్ చోరీపై మా ఫిర్యాదులను పట్టించుకోని EC విపక్ష నాయకులపై విరుచుకుపడుతోంది. అధికార పార్టీకి మద్దతిస్తున్నట్లు మరోసారి రుజువైంది. మహాదేవపురలో లక్ష ఫేక్ ఓట్లున్నా నోటీస్ ఎందుకివ్వలేదు?’ అని ప్రశ్నించారు.

News September 3, 2025

శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు రానున్న షా

image

వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనేందుకు ఈ నెల 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఉ.11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని తొలుత పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు. అనంతరం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద నిమజ్జన ఊరేగింపులో పాల్గొంటారు. మ.3.30 గంటలకు ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో ప్రసంగిస్తారు.

News September 3, 2025

ఆ 3 బ్యారేజీల కథ ముగిసినట్లేనా?

image

TG: తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతామని సీఎం <<17595200>>రేవంత్<<>> ప్రకటించడంతో కాళేశ్వరంలోని 3 బ్యారేజీల కథ ముగిసినట్లేననే తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ ఇప్పటికే కుంగిపోగా, అన్నారం, సుందిళ్లకు సైతం ముప్పు ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఆ 3 బ్యారేజీలతో పని లేకుండా ప్రాణహితపై తుమ్మిడిహట్టి బ్యారేజీ కట్టి ఎల్లంపల్లికి నీటిని తరలించనుంది. మధ్యలో ఒక లిఫ్ట్ చాలని, గ్రావిటీతో నీళ్లు వస్తాయని సర్కార్ తెలిపింది.

News September 3, 2025

జారిపడిన ప్రయాణికుడి కోసం వెనక్కెళ్లిన రైలు

image

AP: ప్రయాణికుడి కోసం రైలు వెనక్కెళ్లిన అరుదైన ఘటన ప్రకాశం(D) మార్కాపురంలో జరిగింది. గుంటూరు(D) బ్రాహ్మణ కోడూరుకు చెందిన హరిబాబు(35) రాత్రి సమయంలో రైలు కుదుపులకు లోనవ్వడంతో కిందపడిపోయాడు. సహచరులు వెంటనే చైన్ లాగి రైలు ఆపారు. లోకో పైలట్లు అధికారుల అనుమతితో రైలును 1.5KM వెనక్కి తీసుకెళ్లారు. అతడిని బోగీలోకి ఎక్కించి మార్కాపురంలో దింపారు. ఆస్పత్రికి తరలించినా హరిబాబు పరిస్థితి విషమించి మరణించాడు.