India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPLకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ లీగ్ బిగ్బాష్లో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే AUS క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే బిగ్బాష్లో ఆడే తొలి సీనియర్ ఇండియన్ క్రికెటర్గా అశ్విన్ నిలవనున్నారు. డిసెంబర్ 15 నుంచి లీగ్ ప్రారంభం కానుంది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ICET-2025 రెండో విడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం. ఖాళీగా 33 వేల సీట్లు.
* ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన PG ECET తొలి విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల గడువు ఈనెల 8 వరకు పొడిగింపు. వివరాలకు cets.apsche.ap.gov.in సైట్ను సంప్రదించండి.
* గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశమున్న నేపథ్యంలో ఇవాళ, రేపు APలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అటు TGలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
భారత్కు క్రూడ్ ఆయిల్ మరింత చౌకగా లభించనుంది. రష్యా డిస్కౌంట్స్ పెంచడమే ఇందుకు కారణం. బ్యారల్ ధరపై 3-4 డాలర్ల మేర ధర తగ్గనుంది. ప్రస్తుతం IND రోజుకు 5.4 మిలియన్ల బ్యారళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. అందులో 36% రష్యా నుంచే కొంటోంది. ఓవైపు ట్రంప్ 50% టారిఫ్స్తో ఒత్తిడి తెస్తున్నా భారత్ వెనక్కి తగ్గకుండా రష్యా, చైనాకు మరింత దగ్గరవుతోంది. తాజాగా చైనాలో జరిగిన SCO సమ్మిట్తో అది స్పష్టమైంది.
TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. BCలకు 42% రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నందున ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి, గవర్నర్ నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా SEP 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే.
రెండు రోజుల పాటు జరిగే GST కౌన్సిల్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే మీటింగ్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు పాల్గొంటారు. GSTలో ప్రస్తుతం ఉన్న 4 శ్లాబులను 2(5%, 18%)కు తగ్గించాలన్న కేంద్రం ప్రతిపాదనపై చర్చించి ఆమోదించనున్నారు. శ్లాబులు తగ్గించడం ద్వారా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది.
* అసెంబ్లీ, శాసన మండలిలో ఆమోదించిన 5 బిల్లులు రాజ్భవన్కు చేరాయి. సలహా కోసం న్యాయ శాఖకు రాజ్భవన్ బిల్లులను పంపనుంది.
* రాష్ట్రంలో వరద నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించి సాయం కోరేందుకు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న Dy.CM భట్టి, మంత్రులు
* HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ ఓటర్ల వివరాలను EC ప్రకటించింది. మొత్తం 3,92,669 ఓటర్లు ఉన్నారు. మార్పులు, చేర్పులకు ఈనెల 17 వరకు అవకాశముంది.
T20I ట్రై సిరీస్లో భాగంగా దుబాయ్లో పాక్తో జరిగిన మ్యాచ్లో అఫ్గానిస్థాన్ 18 రన్స్ తేడాతో విజయం సాధించింది. అటల్(64), జద్రన్(65) రాణించడంతో తొలుత AFG 20 ఓవర్లలో 169 రన్స్ చేసింది. తర్వాత ఛేజింగ్కు దిగిన పాక్ 20 ఓవర్లలో 151/9కే పరిమితమైంది. PAKపై గత 6 మ్యాచ్ల్లో AFG 4 గెలవడం విశేషం. పాయింట్స్ టేబుల్లో అఫ్గాన్, పాక్ చెరో 4 పాయింట్లతో తొలి 2 స్థానాల్లో, UAE 2 ఓటములతో చివరి ప్లేస్లో ఉన్నాయి.
1893: సంస్కృతాంధ్ర రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ జననం
1905: తెలుగు సినీ పాటల రచయిత, కవి కొసరాజు జననం
1908: నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన జమలాపురం కేశవరావు జననం
1952: బాలీవుడ్ నటుడు శక్తికపూర్ జననం(ఫొటోలో)
1978: సినీ నటుడు అర్జన్ బజ్వా జననం(ఫొటోలో)
1987: తెలుగు సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు మరణం
2011: పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరణం
Sorry, no posts matched your criteria.