India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అఫ్గానిస్థాన్లో సంభవించిన <<17587630>>భూకంప ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 1,411 మంది మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 3,124 మంది గాయపడ్డారని, 5,412 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత కునార్ ప్రావిన్సులోని ఆసదాబాద్, నుర్గల్, ఛౌకే, వాటాపూర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
TG: బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ కవిత రేపు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్లోని జాగృతి ఆఫీస్లో ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయడంపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
TG: ఐదు నెలల కమీషన్ డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం ఈనెల 5న బంద్కు పిలుపునిచ్చింది. గత ఐదు నెలలుగా డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనం రూ.5 వేలు, కమీషన్ రూ.300 పెంచాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.
ట్విటర్ వేదికగా ఆగస్టు నెలలో అత్యధికంగా చర్చించుకున్న ప్రముఖుల జాబితాలో ప్రధాని మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక జులైలో మూడో స్థానంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా రెండో ర్యాంకుకు ఎగబాకారు. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకూ X డేటా, ఇండియాలోని యూజర్ల పోస్ట్స్ నంబర్స్ను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు. వీరి తర్వాత విజయ్, పవన్, గిల్, రాహుల్ గాంధీ, కోహ్లీ, మహేశ్బాబు, ధోనీ, రజినీకాంత్ ఉన్నారు.
TG: ‘కాళేశ్వరం’లో అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్రావు అన్నారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిని డైవర్షన్ చేసేందుకు కవితను సస్పెండ్ చేశారని ఎంపీ డీకే అరుణ అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అధికారంకోసం పంచాయితీ జరుగుతోందన్నారు. BRS, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ‘1070’ను అందుబాటులో తీసుకొచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే వెంటనే ఈ నంబర్కు సమాచారాన్ని అందించవచ్చని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, చెట్లు నేలకూలడం, వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగినా హైడ్రా సేవల కోసం సంప్రదించవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు మరో 3 నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు.
AP: విశాఖపట్నంలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మారీటైమ్ రంగంలోని బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్, ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీ లేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. పలు కంపెనీల సీీఈవోలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
TG: BRS నుంచి కవితను సస్పెండ్ చేయడాన్ని ఆమె అభిమానులు, జాగృతి నేతలు తప్పుబట్టారు. కవిత వ్యాఖ్యలపై వివరణ తీసుకోకుండా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. సస్పెన్షన్ వ్యవహారం ఏకపక్షంగా ఉందని మండిపడ్డారు. ఆమెకు మద్దతు తెలియజేసేందుకు HYDలోని జాగృతి కార్యాలయానికి వారు చేరుకుంటున్నారు. హరీశ్ రావు, జగదీశ్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
శనగలను ఉడికించి/వేయించుకుని తింటే మహిళల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. వీటిలోని ఇనుము, ఫోలేట్ రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి ఎనీమియాను తగ్గిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్లు ఎముకల సత్తువను పెంచుతాయి. శనగల్లోని ఫైటోఈస్ట్రోజన్స్ హార్మోన్ లెవెన్స్ను క్రమబద్ధీకరిస్తాయి. గర్భిణులు వీటిని తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ తగినంత ఉత్పత్తయి శిశువు మెదడు, వెన్నెముక అభివృద్ధికి దోహదం చేస్తుంది.
చర్మ సౌందర్యాన్ని పెంచడంలో మందార పువ్వులు ప్రధానపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ముఖాన్ని మెరిపిస్తాయి. తాజా మందార పూలను తీసుకుని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో టేబుల్ స్పూన్ మందార పొడి, తేనె, పాలు వేసి మిశ్రమం కలుపుకోవాలి. దాన్ని చర్మానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే ముఖం వికసిస్తుంది.
Sorry, no posts matched your criteria.