India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది. శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లన్నీ బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో మరణిస్తాయి.
TG: ‘కాళేశ్వరం’ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావులపై చర్యలు చేపట్టవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కి వాయిదా వేసింది. అయితే సీబీఐ విచారణకు, ఘోష్ కమిషన్కు సంబంధం లేదని AG కోర్టుకు తెలిపారు. NDSA రిపోర్ట్ ఆధారంగా CBI విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీంతో దర్యాప్తు కొనసాగే అవకాశముంది.
ఉన్నత చదువులకు యూకే వెళ్లిన ఇద్దరు హైదరాబాద్ యువకులు అక్కడి రోడ్డు ప్రమాదంలో మరణించారు. లండన్లో వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నాదర్గుల్కు చెందిన చైతన్య (22), ఉప్పల్కు చెందిన రిషితేజ (21) ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
TG: అభిమాన నాయకుడి పచ్చబొట్టు ఓ కార్యకర్త నిండు ప్రాణాలను కాపాడింది. వనపర్తిలో BRS కార్యకర్త తైలం రమేశ్ నిన్న అకస్మాత్తుగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు అతడు చనిపోయాడని భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చి పచ్చబొట్టును చూస్తుండగా శరీరంలో కదలికలు గుర్తించి పిలవగా కదిలాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా రమేశ్ బతికే ఉన్నాడని తేలింది.
కోళ్లలో వైరస్ వల్ల వచ్చే కొక్కెర వ్యాధి ప్రమాదకరమైందని పశు వైద్యులు చెబుతున్నారు. ఇది అన్ని వయసుల కోళ్లకూ సోకుతుంది. దీన్ని రాణిఖేత్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన కోళ్లలో 80-90% చనిపోతాయి. వ్యాధి సోకిన కోడి ముక్కు నుంచి కారే ద్రవాల వల్ల, వ్యాధి క్రిములతో కలుషితమైన మేత, నీరు, గాలి ద్వారా ఇతర కోళ్లకూ వ్యాపిస్తుంది. వేగంగా ప్రబలి ఫారమ్/గ్రామంలోని కోళ్లన్నీ మరణించి తీవ్రనష్టం వాటిల్లుతుంది.
పవిత్రమైన పూజ విధానంలో ప్రతి వస్తువును సరైన స్థానంలో ఉంచడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. పూజ గదిలో దేవునికి ఎడమ వైపున నీటితో నిండిన కలశం, గంట, ధూపం వేసే పాత్రలు, నూనె దీపాలు ఉంచాలి. ఇక దేవునికి కుడి వైపున ఆవు నెయ్యితో వెలిగించిన దీపం, సువర్ణ జలంతో నింపిన శంఖం ఉంచాలి. దేవుని విగ్రహం లేదా చిత్రపటం ఎదురుగా హారతి కర్పూరం, పసుపు, కుంకుమ వంటి పూజ సామగ్రిని ఉంచాలి.
నేవీలో 260 పోస్టులకు 2026 జూన్లో ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువును sep 8వరకు పొడిగించారు. వివిధ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలు వెల్లడిస్తారు.
గణేశుడికి ఓ దంతం విరిగిపోయి ఉంటుంది. దాని గురించి 3 పౌరాణిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వినాయకుడు తన దంతాన్ని విరిచి కలంగా చేసుకొని భారతాన్ని రాశారనేది వాటిలో ప్రధానమైనది. శివుడిని కలవడానికి వెళ్లినప్పుడు అడ్డుకున్నందుకు పరశురాముడు తన గొడ్డలితో విఘ్నేశ్వరుడిని కొట్టగా ఓ దంతం విరిగిందనేది మరో కథనం. మరికొన్ని పురాణాలు గజముఖాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దంతం విరిగిందని చెబుతున్నాయి.
ఒకేసారి పూత, కాయలు రావడం వల్ల పంట తొందరగా చేతికి వస్తుంది. గులాబి రంగు పురుగు తాకిడి తగ్గుతుంది. పంట కాలం త్వరగా పూర్తవ్వడం వల్ల నీటి వసతి ఉంటే రెండో పంటగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చు. దీని వల్ల అదనపు ఆదాయం వస్తుంది. కూలీలు కూడా త్వరగా పత్తి ఏరవచ్చు. ఈ పద్ధతిలో ఎకరాకు సుమారు 30-40% అధిక దిగుబడికి ఛాన్సుంది. దీనికి తక్కువ కాలపరిమితి, భూమికి అనువైన రకాలను, హైబ్రిడ్ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. మంచి పాలనతో APలో NDA ప్రభుత్వాన్ని బలపరిచేందుకు కృషి చేస్తున్నారు. మీరు దీర్ఘాయుష్షుతో జీవించాలి’ అని ఆకాంక్షించారు. ‘మా పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని పవన్తో ఉన్న ఫొటోను అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.