India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అఫ్గానిస్థాన్లో నిన్న సంభవించిన <<17581135>>భూకంపం<<>> పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 1100 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో 3,500 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది. కాగా భూకంప బాధితులకు భారత ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. తక్షణ సాయంగా 15 టన్నుల ఫుడ్ మెటీరియల్, 1000 కుటుంబాలకు సరిపడే టెంట్స్ను కాబూల్కు పంపింది. ఇవాళ రిలీఫ్ మెటీరియల్ పంపనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత మరో 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో <
కవిత ప్లాన్ ప్రకారం <<17582811>>BRS<<>>ను టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ అభిమానులు విమర్శిస్తున్నారు. BRS ప్లీనరీలో బీజేపీపై విమర్శలు చేయకపోవడం అసంతృప్తికి గురి చేసిందని కొన్ని నెలల క్రితం కవిత KCRకు లేఖ రాశారు. ఆ లెటర్ను లీక్ చేశారని విమర్శలు గుప్పించారు. KCR నాయకత్వం తప్ప ఎవరి లీడర్షిప్నూ అంగీకరించబోనని పరోక్షంగా KTRను టార్గెట్ చేశారు. మొన్న జగదీశ్ రెడ్డి, నిన్న హరీశ్, సంతోశ్ రావుపై ఫైరయ్యారు.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ న్యూజిలాండ్, భారత్తో జరిగే వైట్ బాల్ సిరీస్లకు దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. వెన్ను గాయంతో ఆయన బాధపడుతున్నట్లు తెలిపింది. యాషెస్ సిరీస్కూ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో వన్డేలు, అక్టోబర్ 29, 31, నవంబర్ 2, 6, 8 తేదీల్లో టీ20లు జరగనున్నాయి.
పవన్కు చిరంజీవి బర్త్డే విషెస్ చెప్పారు. ‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, AP Dy.CMగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ’ అని వారిద్దరి అరుదైన ఫొటోను ట్వీట్ చేశారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్విస్ ఫుడ్ జెయింట్ ‘నెస్లే’ కంపెనీ తమ CEO లారెంట్ ఫ్రెయిక్స్పై వేటు వేసింది. మహిళా ఉద్యోగితో శారీరక సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలతో విచారణకు ఆదేశించింది. అతని స్థానంలో ఫిలిప్ నవ్రాటిల్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ‘ఇది కచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయం. కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారనే లారెన్స్ను ఫైర్ చేశాం’ అని నెస్లే కంపెనీ ప్రకటించింది.
TG: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కోరింది. అంతర్రాష్ట్ర అంశాలు, కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైనా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేసింది. సీబీఐపై నిషేధం విధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఎత్తివేస్తూ నేడో రేపో సర్క్యులర్ జారీ చేసే అవకాశం ఉంది.
TG: సీఎం రేవంత్ రేపటి నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు మహబూబ్నగర్(D) దేవరకద్రలో ఓ ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం భద్రాద్రి జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎల్లుండి కామారెడ్డి జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తారని సమాచారం. లోకల్ బాడీ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు వీలును బట్టి దాదాపు అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తారని తెలుస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB), బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను తగ్గించాయి. దీంతో ఈ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఉపశమనం కలగనుంది. PNB అన్ని టెన్యూర్స్పై MCLRను 15 బేసిస్ పాయింట్స్ మేర తగ్గించింది. అటు BOI ఓవర్నైట్ రేట్ మినహా అన్ని టెన్యూర్స్పై 5-15 పాయింట్స్ కోత విధించింది. పోటీని తట్టుకుని నిలబడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
AP: పవన్ కళ్యాణ్ మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ‘అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. జన సైన్యానికి ధైర్యం.. మాటకి కట్టుబడే తత్వం.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. స్పందించే హృదయం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.