India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: BRS పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? అన్న <<17582811>>కవితపై<<>> ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. లిక్కర్ స్కాం కేసు సమయంలో కార్యకర్తలు మద్దతుగా నిలిచారని, SMలో తప్పుడు ప్రచారాలను ఖండించారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు KCR పెట్టిన పార్టీనే విమర్శించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అటు పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని, కావాలనే ఆమెను సైడ్ చేస్తున్నారని కవిత అభిమానులు అంటున్నారు. మీ కామెంట్?
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో రిలీజ్ చేసి తెలిపారు. ఇందులో చరణ్, బుచ్చిబాబు సాన, ఏఆర్ రెహ్మాన్ ఉన్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానున్నట్లు టాక్.
AP: సూపర్ సిక్స్ సంక్షేమమే కాదు, అభివృద్ధిలోనూ రాష్ట్రం సూపర్గా దూసుకెళ్తోందని టీడీపీ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో జీఎస్టీ వసూళ్లలో 21శాతం పెరుగుదల నమోదైందంటూ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్ట్ను ట్వీట్ చేసింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీదే అత్యధిక వృద్ధి రేటని స్పష్టం చేసింది. అదే సమయంలో జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ఆగస్టులో 12శాతం వృద్ధి సాధించింది.
TG: కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా BRS <<17583241>>పోస్ట్<<>> చేసిన హరీశ్ రావు వీడియోను KTR రీట్వీట్ చేశారు. ‘ఇది మా డైనమిక్ లీడర్ హరీశ్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్’ అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే ‘KCR ప్రియశిష్యుడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇరిగేషన్ గురించి ఎంతో నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నా’ అని కొనియాడారు. హరీశ్పై కవిత కామెంట్స్ నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
AP: మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోందో లేదో తెలియాలంటే YCP నేతలు చీరలు ధరించి బస్సులు ఎక్కితే తెలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను TDP నిలబెట్టుకుందని చెప్పారు. ‘అధికారంలో ఉన్నప్పుడు YCP నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం విమర్శలు చేస్తున్నారు. మా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోంది. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాం’ అని ఆయన తెలిపారు.
భారత్ దశాబ్దాలుగా USతో ఏకపక్షంగా భారీ వాణిజ్యం చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇండియా తన వస్తువులను USకు భారీ స్థాయిలో విక్రయిస్తోంది. అమెరికానే ఆ దేశానికి అతిపెద్ద కొనుగోలుదారు. US మాత్రం ఇండియాలో అధిక టారిఫ్స్తో తక్కువ బిజినెస్కే పరిమితమైంది. ఇప్పుడు సుంకాలు తగ్గిస్తామని భారత్ చెప్పినా సమయం దాటిపోయింది. అటు రష్యా నుంచి ఆయిల్ కొంటూ మమ్మల్ని టారిఫ్స్ తగ్గించమనడంలోనూ ఉపయోగం లేదు’ అని అన్నారు.
AP: ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని APSDMA తెలిపింది. మరో 24 గంటల్లో ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు విజయనగరం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
TG: గత ఏడాది పంట నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై సీఎం రేవంత్ అధికారులను ఆరా తీశారు. ఇటీవల వరదలతో ఏర్పడ్డ పంట నష్టాన్ని కూడా అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. NDRFతో పనిలేకుండా SDRF సిబ్బందిలో నైపుణ్యాలు పెంచాలని సూచించారు. రోడ్ల డ్యామేజ్పైనా సమగ్ర నివేదిక రూపొందించడంతో పాటు HMDA పరిధిలోని చెరువులను వెంటనే నోటిఫై చేయాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న ‘కాళేశ్వరం ప్రాజెక్టు CBI విచారణ’ అంశంపై కేంద్ర నిర్ణయం ఆసక్తికరంగా మారింది. PC ఘోష్ కమిషన్ రిపోర్టులో BJP MP, BRS ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పేరూ ఉంది. దీంతో సొంత నేతపై ఆరోపణలున్న కేసు దర్యాప్తుకు అప్పగిస్తే సెల్ఫ్ గోల్ అవుతుందా? వెయిట్ చేస్తే కాంగ్రెస్ విమర్శలతో ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? తదితర అంశాలు లెక్కలేసుకున్నాకే నిర్ణయం తీసుకోనుంది.
AP: రాష్ట్రంలో యూరియా కొరతపై ఈ నెల 6న ఆందోళనలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టి ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ నిరసనలు చేపట్టనున్నారు. కాగా టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ చేసి పక్కదారి పట్టిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.