India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది నన్ను అడిగారు. నేను రాజకీయాల్లోకి రాలేదు. ఏ పార్టీలో సభ్యత్వం లేదు. ఇక ముందూ ఉండదు. పౌరహక్కులు, సామాజిక న్యాయం గురించి పోరాడుతా. నేను ప్రతిపక్షాల అభ్యర్థిని’ అని వ్యాఖ్యానించారు.
జపాన్ కపుల్స్ నాణ్యమైన నిద్ర కోసం ‘సపరేట్ స్లీపింగ్’ పద్ధతిని పాటిస్తారు. వారు ఒకే గదిలో వేర్వేరు బెడ్స్పై పడుకుంటారు. నిద్రలో గురక పెట్టడం, కదలడం వల్ల తమ భాగస్వామి నిద్రకు భంగం కలుగుతుందని ఇలా వేరుగా పడుకుంటారట. అయితే ఇది జంటల మధ్య దూరాన్ని పెంచుతుందని కొందరు భావిస్తే, భాగస్వామికిచ్చే గౌరవంగా మరికొందరు నమ్ముతున్నారు. కాగా జపాన్లో జననాల రేటు పడిపోవడానికి ఇదీ ఓ కారణం కావొచ్చనే చర్చ జరుగుతోంది.
AP: రాజంపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో.. లేదో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది పెన్షనర్ల కోసం రూ.2,746.52 కోట్లు విడుదల చేశారు. కొత్తగా 7,872 మందికి నెలకు రూ.4 వేలు చొప్పున స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేశారు.
భారత్-చైనా-రష్యా ఒక తాటిపైకి రాగానే అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టిందా? ట్రంపరితనం తగ్గుతుందా? భారత్తో మళ్లీ చెట్టాపట్టాలకు సిద్ధమవుతుందా? SMలో US స్పందన చూస్తే అదే నిజమయ్యేలా ఉంది. ‘భారత్-US భాగస్వామ్యం నూతన శిఖరాలను అధిరోహిస్తోంది. ఇరు దేశాల ప్రజల స్నేహమే మన సంబంధాలను బలోపేతం చేస్తోంది. #USIndiaFWDforOurPeople అనే హ్యాష్ ట్యాగ్తో ఈ క్యాంపైన్లో భాగం కావాలి’ అని ట్వీట్ చేసింది.
20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇథనాల్ లేని పెట్రోల్ను ఎంచుకునే సౌకర్యం వినియోగదారులకు కల్పించాలని కోరుతూ అక్షయ్ మల్హోత్రా అనే లాయర్ ఈ పిల్ దాఖలు చేశారు. E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతోందని పలువురు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే మైలేజీలో ఎలాంటి తేడాల్లేవని కేంద్రం చెబుతోంది.
బంగాళాఖాతంలో మరో 12-36 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని IMD HYD తెలిపింది. దీని ప్రభావంతో AP, TGలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఉ.8.30 వరకు <
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో 537 అప్రెంటిస్ పోస్టులకు ఈ నెల 18 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈస్ట్రర్న్, వెస్టర్న్, నార్తర్న్, సౌతర్న్, సౌత్ ఈస్టర్న్ రీజియన్లలో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాసై ఉండాలి. వయసు 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: <
భార్యగా, అమ్మగా బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే మహిళలు వ్యక్తిగత సంరక్షణను పక్కన పెట్టేస్తారు. ఇది భవిష్యత్తులో అనేక అనారోగ్యాలకు మూలం అవుతుందంటున్నారు నిపుణులు. ఒత్తిడిని అదుపులో ఉంచి ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చెయ్యాలని సూచిస్తున్నారు. ఆకుకూరలు, గుడ్లు, నట్స్, సీడ్స్ వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి. స్కిన్, హెయిర్ కేర్పై దృష్టి పెట్టాలి. ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం చేయాలి.
మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. (లేక) ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఈ వారంలో స్కూళ్లకు వరుస సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 5న (శుక్రవారం) మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఏపీ, తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఇచ్చారు. 6న వినాయక నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్లో సెలవు ఉండనుంది. ఏపీలో ఆరోజు సెలవు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇక 7న ఆదివారం వస్తోంది. మరి వరుస సెలవుల నేపథ్యంలో హాలిడే ట్రిప్కు ప్లాన్ చేస్తున్నారా? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.