News September 1, 2025

బంధాలపై ఫబ్బింగ్ ప్రభావం

image

ప్రస్తుతం మొబైల్ వాడకం బాగా పెరిగిపోయి చాలామంది జీవితాల్లో శత్రువుగా మారింది. ఎదుటివ్యక్తితో నేరుగా మాట్లాడకుండా ఫోన్‌పై దృష్టి పెట్టి, వారిని విస్మరించడాన్ని ఫబ్బింగ్‌ అంటారు. ఇది బంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఫబ్బింగ్ ఎక్కువైతే భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఫోన్‌ని పక్కనపెట్టి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడాలంటున్నారు నిపుణులు.

News September 1, 2025

పురుగు మందుల పిచికారీ.. సూచనలు

image

☛ ఎకరానికి కావలసిన ద్రావణాన్ని ఒకేసారి తయారు చేసుకోవాలి. మోతాదు కొలవడానికి మందు డబ్బాతో వచ్చిన కొలమానాన్ని వాడాలి.
☛ మందును చేత్తో కలపరాదు. ఏదైనా కర్రను ఉపయోగించాలి. ☛ పిచికారీ సమయంలో రక్షక దుస్తులు, చేతి గ్లౌజులు, ముక్కు మాస్క్, కళ్ల రక్షణ అద్దాలు ధరించాలి. పిచికారీ సమయంలో నీరు తాగటం, ఆహారం తినడం, గుట్కా తినడం, పొగ తాగడం చేయరాదు. వాడేసిన మందు డబ్బాలను గుంత తవ్వి పూడ్చి పెట్టాలి.

News September 1, 2025

రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించండి.. గవర్నర్‌కు వినతి

image

TG: స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ల <<17570615>>నిబంధనను<<>> ఎత్తివేస్తూ, BCలకు రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన బిల్లును ఆమోదించాలని అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. PCC చీఫ్ మహేశ్, మంత్రులు పొన్నం, సీతక్క, BRS, CPI నేతలు అందులో ఉన్నారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, మూడ్ ఆఫ్ హౌస్ పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని కోరారు.

News September 1, 2025

చర్మానికి డ్రై బ్రషింగ్ చేస్తున్నారా..?

image

స్నానానికి ముందు శరీరాన్ని డ్రై బ్రషింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు చర్మ నిపుణులు. డ్రై బ్రషింగ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. రక్తప్రసరణను పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే డ్రై బ్రషింగ్ చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా చేస్తే చర్మంపై నొప్పి, దద్దుర్లు, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మైల్డ్‌గా చేయడం ఉత్తమం.

News September 1, 2025

13,217 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ఐబీపీఎస్ RRB XIV-2025 నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టులున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలను బట్టి డిగ్రీ, LLB, డిప్లొమా, CA, MBA/PGDM పూర్తిచేసిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాష్ట్రాలు, బ్యాంకులవారీగా ఖాళీలు, ఇతర పూర్తి వివరాల కోసం <>https://www.ibps.in/<<>> వెబ్‌‌సైట్‌లో చూడవచ్చు.

News September 1, 2025

ఆర్టీసీ డ్రైవర్లు ఫోన్లు వాడటం నిషేధం!

image

TG: బస్సు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లు విధుల్లో ఫోన్ వాడకుండా నిషేధం విధించాలని RTC నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు పైలట్ ప్రాజెక్టుగా 11 డిపోల్లో దీనిని అమలు చేయనుంది. డ్రైవర్లు డ్యూటీ ఎక్కేముందు తమ ఫోన్లను డిపో మేనేజర్‌కు అప్పగిస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కండక్టర్‌కు మేనేజర్ సమాచారమిస్తారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలుపై సంస్థ నిర్ణయం తీసుకోనుంది.

News September 1, 2025

ఒకే కారులో మోదీ-పుతిన్ ప్రయాణం

image

చైనా టియాన్‌జిన్ SCO శిఖరాగ్ర సదస్సు తర్వాత ప్రధాని మోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో ప్రయాణిస్తూ కనిపించారు. ద్వైపాక్షిక సమావేశ ప్రదేశానికి ఇలా ఒకే కారులో వెళ్లారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలకు చెక్ పెట్టేందుకు పరస్పర సహకారంపై చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. SCO సదస్సులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు.

News September 1, 2025

అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 509 మంది మృతి

image

అఫ్గానిస్థాన్‌లో <<17577609>>భూకంపం<<>> బీభత్సం సృష్టించింది. ఆ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటివరకు 509 మంది చనిపోయారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వెయ్యి మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జలాలాబాద్ నగరానికి సమీపంలో భూమికి 8 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంతో వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

News September 1, 2025

చర్మానికి కోకో బటర్‌..

image

కోకో బటర్‌ను చాక్లెట్స్, కేక్‌ల తయారీలోనే కాకుండా చర్మాన్ని మెరిపించడానికీ వాడొచ్చని నిపుణులు చెబుతున్నారు. కోకో బటర్‌లో రోజ్‌వాటర్ కలిపి పడుకునే ముందు చర్మానికి రాయాలి. తర్వాతిరోజు ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఇందులో ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, చర్మం మెరిసేలా చేస్తుంది.

News September 1, 2025

‘ఆరోగ్యశ్రీ’ బిల్లులపై నేడు ప్రభుత్వంతో ఆస్పత్రుల చర్చలు!

image

TG: ‘ఆరోగ్యశ్రీ’ సేవలను <<17569217>>నిలిపివేయాలన్న<<>> నిర్ణయాన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులు వాయిదా వేశాయి. ప్రభుత్వం ఇవాళ చర్చలకు పిలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. చర్చల అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపాయి. పెండింగ్‌లో ఉన్న ₹1400 కోట్ల బిల్లులు చెల్లించాలని, లేదంటే సెప్టెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రులు ఇటీవల సర్కార్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.