India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో మెడిసిన్ చదివే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వరుసగా 9 ,10, 11, 12 తరగతులు చదివితేనే స్థానికత వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్కు ముందు వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న ప్రభుత్వ జీవో నంబర్ 33ని సమర్థించింది. గత ఏడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని సూచించింది.
దుబాయ్లోని భారతీయులకు అక్కడి ఇండియన్ కాన్సులేట్ కొత్త పాస్పోర్ట్ ఫొటో రూల్స్ జారీ చేసింది. ఫొటో 2*2″ సైజ్, వైట్ బ్యాగ్రౌండ్ ఫ్రేమ్లో ముఖం, భుజాలు క్లోజప్గా ఉండాలి. కళ్లు తెరిచి, నోరు మూసి, నవ్వకుండా ఫేస్ కెమెరాను చూడాలి. బ్లర్, బ్రైట్ లాంటి ఏ ఎడిట్ చేయొద్దు. స్కిన్టోన్ స్పష్టంగా కనబడాలి. Intl’ సివిల్ ఏవియేషన్ సంస్థ గైడ్లైన్స్ ప్రకారం పాస్పోర్టులు లేకపోతే ఫ్యూచర్లో సమస్యలు రావచ్చు.
‘కాళేశ్వరం’ను <<17577217>>CBI<<>>కి అప్పగించడం వెనుక CM రేవంత్ వ్యూహం ఉందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 2022లో TGలోకి CBI రాకుండా BRS ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని BJP ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. మోదీ సర్కారు చర్యలు తీసుకోకుంటే BRS, BJP ఒక్కటేనని జనాల్లోకి తీసుకెళ్లొచ్చు. చర్యలు తీసుకుంటే తాము కక్షపూరితంగా వ్యవహరించలేదని, కేంద్రం నిర్ణయమే అని చెప్పొచ్చు.
TG: ‘కాళేశ్వరం’ కమిషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అత్యవసరంగా దీనిపై విచారణ జరపాలని, ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకుండా, కేసును CBIకి అప్పగించకుండా ఆదేశించాలని కేసీఆర్, హరీశ్ తరఫు న్యాయవాదులు కోరారు. కానీ దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
పంజాబ్&సింధ్ బ్యాంక్లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APలో 80, TGలో 50 ఉద్యోగాలున్నాయి. 20-30ఏళ్లు గలవారు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఏదైనా పబ్లిక్ సెక్టార్/రూరల్ బ్యాంకులో 18 నెలల పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.48,480-రూ.85,920 ఉంటుంది.
వెబ్సైట్: <
ఒక చెంచాతో 1 గ్రాము మట్టిని, 2ml పొటాషియం డైక్రోమేట్తో పాటు 2ml సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఒక సీసాలో పోసి బాగా కలపాలి. 20 నిమిషాల తర్వాత ఆ సీసాలో నీటిని పోయాలి. ఆ ద్రావణం మారిన రంగును బట్టి భూమిలో కర్బన శాతం తెలుసుకోవచ్చు.
☛ నారింజ/పసుపు రంగు – కర్బన స్థాయి తక్కువ
☛ ముదురు గోధుమ/ నలుపు రంగు – కర్బన స్థాయి మధ్యస్థం
☛ ఆకు పచ్చ/ నీలి రంగు – కర్బన స్థాయి ఎక్కువ.
చంద్రబాబు తొలిసారి 1995 SEP 1న ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో గెలిచి, 2004 మే 29 వరకు CMగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక 2014లో ఏపీకి మొదటి సీఎం అయ్యారు. మళ్లీ 2024లో గెలిచి, పదవిలో కొనసాగుతున్నారు. హైటెక్ సిటీ, రైతు బజార్లు, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, ఈ-గవర్నెన్స్తో గుర్తింపు తెచ్చుకున్నారు. మరి CBN పేరు చెబితే మీకు గుర్తొచ్చేది ఏంటో కామెంట్ చేయండి.
గ్లోబల్ వార్మింగ్తో ఇంటి కరెంటు బిల్లే కాదు ఒంటి వయసూ పెరుగుతోంది. హీట్వేవ్స్ వల్ల లివర్, లంగ్స్, కిడ్నీలు ప్రభావితమై దెబ్బతింటాయని నేచర్ క్లైమెట్ ఛేంజ్ జర్నల్ పేర్కొంది. ఉదాహరణకు బాడీపార్ట్స్ పదేళ్లు పనిచేసి దెబ్బతినే స్థాయి హీట్తో ముందే ఆ లెవల్కు చేరుతాయని తైవాన్లో 14 ఏళ్ల పరిశోధనతో వెల్లడైంది. 2025-29 వరకు ఉష్ణోగ్రతలు సగటున 1.5° పెరుగుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే చెప్పడం గమనార్హం.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఎన్ని కుట్రలు చేసినా చట్టపరంగా పోరాడతామని KTR అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో రాహుల్ గాంధీ కరెన్సీ మేనేజర్ (CM) కాళేశ్వరం కేసును CBIకి అప్పగించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధేమో బీజేపీకి CBI “ప్రతిపక్ష ఎలిమినేషన్ సెల్”లా పనిచేస్తోందని గతంలో ఆరోపించారు. మిస్టర్ గాంధీ.. మీ CM ఏం చేస్తున్నారో మీకైనా తెలుసా’ అని KTR ప్రశ్నించారు.
AP: ఉమ్మడి రాష్ట్ర CMగా చంద్రబాబు HYDను ప్రపంచపటంలో నిలబెట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. ‘CBN పాలన తెలుగు రాష్ట్రాలకు స్వర్ణయుగం. విజన్ 2020కలను సాకారం చేసి చూపించారు. విద్యుత్, ఆర్థిక సంస్కరణలతో AP అభివృద్ధికి బాటలేశారు’ అని ప్రశంసించారు. చంద్రబాబు CMగా తొలిసారి బాధ్యతలు తీసుకుని 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా మంగళగిరి TDP ఆఫీస్లో నేడు వేడుకలు నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.