News September 1, 2025

వేడితో వయసు కర్పూరంలా కరుగుతోంది!

image

గ్లోబల్ వార్మింగ్‌తో ఇంటి కరెంటు బిల్లే కాదు ఒంటి వయసూ పెరుగుతోంది. హీట్‌వేవ్స్ వల్ల లివర్, లంగ్స్, కిడ్నీలు ప్రభావితమై దెబ్బతింటాయని నేచర్ క్లైమెట్ ఛేంజ్ జర్నల్ పేర్కొంది. ఉదాహరణకు బాడీపార్ట్స్ పదేళ్లు పనిచేసి దెబ్బతినే స్థాయి హీట్‌తో ముందే ఆ లెవల్‌కు చేరుతాయని తైవాన్‌లో 14 ఏళ్ల పరిశోధనతో వెల్లడైంది. 2025-29 వరకు ఉష్ణోగ్రతలు సగటున 1.5° పెరుగుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే చెప్పడం గమనార్హం.

News September 1, 2025

మిస్టర్ గాంధీ.. మీ CM ఏం చేస్తున్నారో మీకైనా తెలుసా: KTR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఎన్ని కుట్రలు చేసినా చట్టపరంగా పోరాడతామని KTR అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో రాహుల్ గాంధీ కరెన్సీ మేనేజర్ (CM) కాళేశ్వరం కేసును CBIకి అప్పగించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధేమో బీజేపీకి CBI “ప్రతిపక్ష ఎలిమినేషన్ సెల్”లా పనిచేస్తోందని గతంలో ఆరోపించారు. మిస్టర్ గాంధీ.. మీ CM ఏం చేస్తున్నారో మీకైనా తెలుసా’ అని KTR ప్రశ్నించారు.

News September 1, 2025

చంద్రబాబు పాలన తెలుగు రాష్ట్రాలకు స్వర్ణయుగం: గొట్టిపాటి

image

AP: ఉమ్మడి రాష్ట్ర CMగా చంద్రబాబు HYDను ప్రపంచపటంలో నిలబెట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. ‘CBN పాలన తెలుగు రాష్ట్రాలకు స్వర్ణయుగం. విజన్ 2020కలను సాకారం చేసి చూపించారు. విద్యుత్, ఆర్థిక సంస్కరణలతో AP అభివృద్ధికి బాటలేశారు’ అని ప్రశంసించారు. చంద్రబాబు CMగా తొలిసారి బాధ్యతలు తీసుకుని 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా మంగళగిరి TDP ఆఫీస్‌లో నేడు వేడుకలు నిర్వహించనున్నారు.

News September 1, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

✦ వరద బాధితులకు బీజేపీ ఎంపీల సాయం.. ఎంపీ లాడ్స్ నుంచి రూ.80 లక్షలు ఇస్తామని ప్రకటన
✦ అసెంబ్లీకి రాని KCR ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: CPI నారాయణ
✦ నేను మంత్రి పదవి రేసులో ఉన్నా: MLA మల్‌రెడ్డి రంగారెడ్డి
✦ బాసరలో గోదావరి వరద తగ్గుముఖం.. మహారాష్ట్రకు రాకపోకలు పునఃప్రారంభం
✦ అంబేడ్కర్ వర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు ఈ నెల 12 వరకు పొడిగింపు

News September 1, 2025

డిగ్రీ అర్హతతో LICలో 350 ఉద్యోగాలు

image

LICలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AAO) పోస్టులకు ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత, 21-30 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వేతనం నెలకు ₹88,635-₹1,69,025 ఉంటుంది. ఈ ఏడాది OCT 3న ప్రిలిమ్స్, NOV 8న మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: <>https://licindia.in/<<>>

News September 1, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.930 పెరిగి రూ.1,05,880కు చేరింది. కాగా 7 రోజుల్లో రూ.4,370 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.850 ఎగబాకి రూ.97,050 పలుకుతోంది. అటు KG వెండిపై శనివారం రూ.5,100, ఇవాళ రూ.1,000 పెరిగి రూ.1,36,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 1, 2025

సేంద్రియ కర్బనం.. వ్యవసాయంలో కీలకం

image

నేలలో చౌడు, రోగకారక సూక్ష్మజీవుల నిరోధం, క్షార గుణాన్ని తగ్గించటం, నేలను సారవంతం చేయడంలో సేంద్రియ కర్బనం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే నేలకోతను అరికట్టి భూమిలో నీటి నిల్వలను పెంచేందుకు దోహదపడుతుంది. నేలలో 1.5 – 2.0% వరకు సేంద్రియ కర్బనం ఉంటే భూమిలో పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అలాగే భూమిలో నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాల లభ్యత కూడా చాలా వరకు పెరుగుతుంది.

News September 1, 2025

చంద్రబాబును సంప్రదించలేదు: సీఎం రేవంత్

image

TG: 2024 ఎన్నికల తర్వాత ఇండీ కూటమికి మద్దతు ఇవ్వాలంటూ తాను AP CM చంద్రబాబును సంప్రదించినట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని CM రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ అలాంటి రాజకీయాలను ఇష్టపడరని, తానెప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదని ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో స్పష్టం చేశారు. ‘చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్. గతంలోనూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాజకీయ ఎత్తుగడల్లో ఆయన్ను మించినవారు లేరు’ అని పేర్కొన్నారు.

News September 1, 2025

కొత్తగా పెళ్లైందా.. ఇవి పాటించండి!

image

కొత్త దంపతులు ఎక్కువగా మాట్లాడుకుంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ‘ఫోన్లు, టీవీ పక్కనపెట్టి కాసేపు భవిష్యత్ లక్ష్యాల గురించి చర్చించుకోవాలి. నచ్చిన వంట చేసుకుని కలిసి తినాలి. పనుల్లో ఒకరికొకరు సాయంగా నిలవాలి. కోపాన్ని పక్కనపెట్టి సహనంతో సమస్యలను పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. శృంగారంలో పరస్పర ఇష్టాలను గౌరవించుకోవాలి’ అని చెబుతున్నారు.

News September 1, 2025

CBIకి ‘కాళేశ్వరం కేసు’.. బండి సంజయ్ ఏమన్నారంటే?

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి BRS మాత్రమే బాధ్యత వహిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘మేం మొదటి నుంచీ CBIతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాం. కానీ INC ప్రభుత్వం ఆలస్యం చేసింది. నేడు సత్యానికి తలవంచి కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించేందుకు అంగీకరించింది. ORR టోల్ టెండర్లపై SIT ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సీరియల్‌లా సాగుతోంది’ అని ట్వీట్ చేశారు.