News September 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 1, 2025

గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. జగన్ దిగ్భ్రాంతి

image

AP: రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకోవడంపై మాజీ సీఎం, YCP అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప.గో జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్లలో ట్రాక్టర్ కింద పడి నలుగురు యువకులు <<17576615>>మరణించడం<<>> కలచివేసిందన్నారు. అల్లూరి(D) పాడేరు చింతలవీధిలో ఇద్దరు భక్తులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

News September 1, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(సెప్టెంబర్ 1, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.49 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
✒ ఇష: రాత్రి 7.43 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 1, 2025

శుభ సమయం (1-09-2025) సోమవారం

image

✒ తిథి: శుక్ల నవమి రా.11.18 వరకు
✒ నక్షత్రం: జ్యేష్ఠ సా.6.00 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-మ.12.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, తిరిగి మ.2.46-3.34
✒ వర్జ్యం: రా.2.40-తె.4.24 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.8.21-10.05 వరకు

News September 1, 2025

TODAY HEADLINES

image

* దోపిడీ చేసేందుకే ప్రాజెక్టు స్థలాన్ని మార్చారు: రేవంత్
* రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు వృథా: మంత్రి ఉత్తమ్
* మేడిగడ్డ రిపేర్లకు రూ.350 కోట్లే అవుతాయి: KTR
* బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
* రేషన్ షాపుల్లో రాగులు, గోధుమ పిండి, నూనె: మంత్రి నాదెండ్ల
* జగన్‌కు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్
* భారత్-చైనా మధ్య విమాన రాకపోకలు: మోదీ

News September 1, 2025

ఉగ్రవాదంపై జిన్‌పింగ్‌తో మోదీ చర్చ

image

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ ఉగ్రవాదం అంశాన్ని లేవనెత్తినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. టెర్రరిజంపై పోరాడేందుకు ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకోవాలని చర్చించుకున్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలని నేతలు అంగీకరించినట్లు పేర్కొన్నారు. బోర్డర్ వెంట శాంతి, ప్రశాంతత నెలకొనేలా వ్యవహరించాలని చర్చించినట్లు తెలిపారు.

News August 31, 2025

జింబాబ్వే పాలిట సింహస్వప్నంగా నిస్సాంక

image

జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో శ్రీలంక క్రికెటర్ పాతుమ్ నిస్సాంక చెలరేగుతున్నారు. తొలి వన్డేలో 76 పరుగులు బాదిన ఆయన రెండో మ్యాచులో 122 రన్స్‌తో విరుచుకుపడ్డారు. అంతకుముందు ZIMతో జరిగిన వన్డేల్లోనూ ఆయన 75, 16, 55, 101 పరుగులు బాదారు. కాగా నిస్సాంక అరంగేట్రం (2021) నుంచి వన్డేల్లో అత్యధిక పరుగులు బాదిన ఓపెనర్‌గా (2,648) నిలిచారు. తర్వాత గిల్(2,476), ఒడౌడ్(2,008), రోహిత్ శర్మ (1,990) ఉన్నారు.

News August 31, 2025

జగన్‌కు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్

image

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి YS జగన్‌కు ఫోన్ చేసినట్లు వైసీపీ ట్వీట్ చేసింది. కానీ ముందుగానే NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మాట ఇచ్చినట్లు జగన్ తెలిపారని పేర్కొంది. మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దని కోరినట్లు చెప్పింది. సుదర్శన్ రెడ్డి న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు అపార సేవలు అందించారని కొనియాడినట్లు వివరించింది.

News August 31, 2025

రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా: భట్టి

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుతో వాడుకున్న నీళ్ల కంటే ఎత్తిపోసి, వదిలేసినవే ఎక్కువ అని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో అన్నారు. ‘రూ.27 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల నిర్మించి ఉంటే ఎంతో మేలు జరిగేది. బ్యారేజీల విషయంలో మా రిపోర్టుకు వ్యతిరేకంగా వెళ్లారని CWC చెప్పింది. రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా చేయడం చిన్న విషయం కాదు. మేడిగడ్డలో లోపాలు ఉన్నాయని BRS హయాంలోనే NDSA చెప్పింది’ అని తెలిపారు.