India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమ కుటుంబం ఇప్పటివరకు బీఫ్ తినలేదని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తెలిపారు. తాము ముస్లింలైనప్పటికీ తమ ఇంట్లో దానిని నిషేధించామని చెప్పారు. ‘ఆవు పాలు తల్లి పాలతో సమానం. అందుకే మేం బీఫ్కు దూరం. ఫుడ్ విషయంలో ఎవరేం తిన్నా అది వారిష్టం. మా ఫ్యామిలీ అన్ని మతాలను గౌరవిస్తుంది. ఇంట్లో అన్ని పండుగలు జరుపుకుంటాం. ఈ ఏడాది కూడా గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.
TG: పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయినా NDSA ఎందుకు విచారణ జరపడం లేదని హరీశ్ రావు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘2019-25 వరకు పోలవరం డయాఫ్రమ్ వాల్, గైడ్బండ్, కాఫర్ డ్యామ్.. కొట్టుకుపోయాయి. రిపేర్కు రూ.7 వేల కోట్లు అవుతుంది. ఆ సమయంలో పోలవరం చీఫ్ ఇంజినీర్గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ మేడిగడ్డపై రిపోర్ట్ ఇస్తారా. NDSAకు నచ్చితే ఒక నీతి.. నచ్చకుంటే ఒక నీతి ఉంటుందా’ అని నిలదీశారు.
రాత్రి పూట చికెన్ తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘పడుకునే ముందు చికెన్ తింటే సరిగ్గా జీర్ణం కాదు. గుండెలో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. నిద్రకు అంతరాయం కలుగుతుంది. కొవ్వు పేరుకుపోయి బరువు పెరగడానికి దారి తీస్తుంది. రక్తపోటు, డయాబెటిస్కు కూడా దారి తీసే ఛాన్స్ ఉంది. తిన్న 2-3 గంటల తర్వాత నిద్ర పోవడం ఉత్తమం’ అని నిపుణులు అంటున్నారు.
బెంగళూరులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లల ఫీజులు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏడాదికి 1-5 తరగతులకు రూ.7.35 లక్షలు, 6-8కి రూ.7.75 లక్షలు, 9-10 క్లాసులకు రూ.8.50 లక్షల ఫీజు అని ఆ స్కూల్ పేర్కొంది. రెండు టర్మ్ల్లో చెల్లించాలని తెలిపింది. అంతేకాదు అడ్మిషన్ ఫీజు రూ.లక్ష అని వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని, జాయిన్ అవ్వకపోతే తిరిగి రీఫండ్ చేయడం కుదరదని స్పష్టం చేసింది.
అక్టోబర్ లేదా నవంబర్లో తాను వివాహం చేసుకోనున్నట్లు టాలీవుడ్ హీరో నారా రోహిత్ తెలిపారు. ‘ప్రతినిధి 2’ హీరోయిన్ శిరీషను తాను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్లో హైదరాబాద్లోని నోవాటెల్లో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రోహిత్ నటించిన ‘సుందరకాండ’ మూవీ ఇటీవలే విడుదలైంది.
TG: తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదని, క్యాబినెట్లో చర్చించామని హరీశ్ రావు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘నీరు లేని చోటు నుంచి ఉన్న చోటుకు మార్చాం. 2009-14 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా.. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు? ప్రజాధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. ఆంధ్రా పాలనలో అన్యాయం జరిగింది కాబట్టే కాళేశ్వరం నిర్మించాం’ అని తెలిపారు.
TG: తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009, 14లో కేంద్రం చెప్పినా దోపిడీ చేసేందుకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చారని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ‘ఆ విషయం దాచి 2015లో ఉమా భారతి లేఖను పట్టుకుని హరీశ్ తప్పుదోవ పట్టిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదు. ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారు’ అని అసెంబ్లీలో తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. TGలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా రాబోయే 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు <<17502622>>పుజారా<<>> వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన రిటైర్మెంట్పై స్పందిస్తూ PM మోదీ లేఖ రాసినట్లు పుజారా వెల్లడించారు. ఆయన పంపిన లేఖను SMలో పంచుకున్నారు. సౌరాష్ట్రతో అనుబంధం మొదలు AUSలో డేంజరస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించడం వరకు ప్రతి అంశాన్ని ఆ లేఖలో పేర్కొన్నారు. పుజారా కుటుంబం చేసిన త్యాగాలనూ ప్రస్తావించారు. తనకు లేఖ రాయడంపై మోదీకి పుజారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
AP, TGలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని పురుషులు వాపోతున్నారు. ఇటీవల విజయనగరంలో ఓ బస్సులో మహిళ పురుషుడిపై <<17552607>>దాడి<<>> చేయడం చర్చనీయాంశంగా మారింది. డబ్బులు కట్టి నిలబడి వెళ్లాల్సి వస్తోందని, లాస్ట్ సీటు వరకు మహిళలే కూర్చుంటున్నారని చెబుతున్నారు. పురుషులకు సీట్లు కేటాయించాలని లేదంటే తమకు స్పెషల్ బస్సులు వేసి, ఛార్జీలు తగ్గించాలంటున్నారు. మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.