News August 31, 2025

ALERT: మూడు రోజులు భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. TGలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా రాబోయే 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News August 31, 2025

పుజారాను మెచ్చుకుంటూ మోదీ లేఖ

image

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు <<17502622>>పుజారా<<>> వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన రిటైర్మెంట్‌పై స్పందిస్తూ PM మోదీ లేఖ రాసినట్లు పుజారా వెల్లడించారు. ఆయన పంపిన లేఖను SMలో పంచుకున్నారు. సౌరాష్ట్రతో అనుబంధం మొదలు AUSలో డేంజరస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించడం వరకు ప్రతి అంశాన్ని ఆ లేఖలో పేర్కొన్నారు. పుజారా కుటుంబం చేసిన త్యాగాలనూ ప్రస్తావించారు. తనకు లేఖ రాయడంపై మోదీకి పుజారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News August 31, 2025

మహిళలకు ఫ్రీ బస్సు.. పురుషుల డిమాండ్స్ ఇవీ!

image

AP, TGలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని పురుషులు వాపోతున్నారు. ఇటీవల విజయనగరంలో ఓ బస్సులో మహిళ పురుషుడిపై <<17552607>>దాడి<<>> చేయడం చర్చనీయాంశంగా మారింది. డబ్బులు కట్టి నిలబడి వెళ్లాల్సి వస్తోందని, లాస్ట్ సీటు వరకు మహిళలే కూర్చుంటున్నారని చెబుతున్నారు. పురుషులకు సీట్లు కేటాయించాలని లేదంటే తమకు స్పెషల్ బస్సులు వేసి, ఛార్జీలు తగ్గించాలంటున్నారు. మీ కామెంట్?

News August 31, 2025

‘ప్రాణహిత-చేవెళ్ల’తో రూ.60 వేల కోట్లు మిగిలేవి: మంత్రి ఉత్తమ్

image

TG: రూ.38,500 కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఉంటే 16.50 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో అన్నారు. ‘ఆ ప్రాజెక్టుతో రూ.60వేల కోట్లు ఆదా అయ్యేవి. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, దేవాదుల, సీతారాంసాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. ఇప్పటివరకు కాళేశ్వరం నీటిని ఎత్తిపోసినందుకు ఇరిగేషన్ శాఖ విద్యుత్ శాఖకు రూ.9,738 కోట్లు చెల్లించాల్సి ఉంది’ అని తెలిపారు.

News August 31, 2025

నాకు ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదు: నివేదా

image

తనకు ఇంకా నిశ్చితార్థం కాలేదని హీరోయిన్ నివేదా పేతురాజ్‌ క్లారిటీ ఇచ్చారు. ‘అక్టోబరులో ఎంగేజ్మెంట్, జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నాం. డేట్స్ ఇంకా ఫైనల్ కాలేదు. రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను ఐదేళ్ల క్రితం దుబాయ్‌లో కలిశాను. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. పెళ్లెందుకు చేసుకోకూడదు అని పరస్పరం ప్రశ్నించుకున్నాం’ అని తెలిపారు. రాజ్‌హిత్‌కు దుబాయ్‌లో వ్యాపారాలు ఉన్నాయి.

News August 31, 2025

రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు వృథా: మంత్రి

image

TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నిల్వ చేయకున్నా పంటలకు నీరిచ్చామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో చెప్పారు. కాళేశ్వరం కూలిన తర్వాత ధాన్యం ఉత్పత్తిలో నం.1 అయ్యామన్నారు. కాళేశ్వరానికి రూ.87,449 కోట్లు ఖర్చు చేస్తే, రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు పూర్తిగా నిరుపయోగంగా మారాయని విమర్శించారు. తాము ఎక్కడా కక్ష సాధింపు ధోరణితో వెళ్లలేదని, పారదర్శకంగా విచారణ చేయించామని చెప్పారు.

News August 31, 2025

పూర్తి నీరు నిల్వ చేసినందుకే మేడిగడ్డ కూలింది: ఉత్తమ్

image

TG: KCR అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో విమర్శించారు. ‘డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేకుండా పనులు చేశారని NDSA నివేదికలో ఉంది. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారు. పూర్ ప్లానింగ్, డిజైన్ వల్లే అది కూలిందని NDSF తేల్చి చెప్పారు. మీరే డిజైన్ చేశారు. మీరే కట్టారు. మీ హయాంలోనే కూలింది. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్’ అని ఫైరయ్యారు.

News August 31, 2025

IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్?

image

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వచ్చే సీజన్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించనున్నట్లు వార్తలొస్తున్నాయి. గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్‌ను కేవలం ఆటగాడిగా కొనసాగించనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వార్నర్, KL రాహుల్ వంటి ప్లేయర్లు కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌లో DC పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

News August 31, 2025

కాళేశ్వరంతో ఐదేళ్లలో వాడుకుంది 101 టీఎంసీలే: ఉత్తమ్

image

TG: రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఐదేళ్లలో 101 టీఎంసీలు మాత్రమే వాడుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ‘సంవత్సరానికి 195 TMCలు లిఫ్ట్ చేస్తామని చెప్పారు. 2019లో ప్రారంభమైనప్పటి నుంచి 2023 OCT వరకు ఐదేళ్లలో 162 TMCలే ఎత్తిపోశారు. ఇందులో 32 TMCలు సముద్రంలోకి వదిలిపెట్టారు. ఆవిరి పోనూ ఐదేళ్లలో 101 TMCలే వాడుకున్నారు. అంటే ఏడాదికి 20.2 TMCలే’ అని విమర్శించారు.

News August 31, 2025

భారతీయులు చేతితోనే ఎందుకు తింటారంటే?

image

ఇప్పటికీ మెజారిటీ భారతీయులు చేతితోనే ఆహారం తింటారు. ఆహారానికి, చేతికి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఆహారం ఉష్ణోగ్రత, స్వభావం తినడానికి ముందే తెలుసుకోవచ్చు. చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు ప్రతీకలు. చేత్తో తినడం వల్ల ఈ శక్తులు ఆహారంతో కలిసి సులభంగా జీర్ణమవుతుంది. చేతి వేళ్లలోని నరాల కొసలు కూడా జీర్ణక్రియలో కీలకం. అలాగే చేతితో తింటే ఎంతకావాలో అంతే తింటాం. ఇది స్పూన్, ఫోర్క్ ద్వారా సాధ్యం కాదు.