India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వచ్చే సీజన్కు కొత్త కెప్టెన్ను నియమించనున్నట్లు వార్తలొస్తున్నాయి. గత సీజన్లో కెప్టెన్గా వ్యవహరించిన అక్షర్ పటేల్ను కేవలం ఆటగాడిగా కొనసాగించనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వార్నర్, KL రాహుల్ వంటి ప్లేయర్లు కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు సమాచారం. గత సీజన్లో DC పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
TG: రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఐదేళ్లలో 101 టీఎంసీలు మాత్రమే వాడుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ‘సంవత్సరానికి 195 TMCలు లిఫ్ట్ చేస్తామని చెప్పారు. 2019లో ప్రారంభమైనప్పటి నుంచి 2023 OCT వరకు ఐదేళ్లలో 162 TMCలే ఎత్తిపోశారు. ఇందులో 32 TMCలు సముద్రంలోకి వదిలిపెట్టారు. ఆవిరి పోనూ ఐదేళ్లలో 101 TMCలే వాడుకున్నారు. అంటే ఏడాదికి 20.2 TMCలే’ అని విమర్శించారు.
ఇప్పటికీ మెజారిటీ భారతీయులు చేతితోనే ఆహారం తింటారు. ఆహారానికి, చేతికి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఆహారం ఉష్ణోగ్రత, స్వభావం తినడానికి ముందే తెలుసుకోవచ్చు. చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు ప్రతీకలు. చేత్తో తినడం వల్ల ఈ శక్తులు ఆహారంతో కలిసి సులభంగా జీర్ణమవుతుంది. చేతి వేళ్లలోని నరాల కొసలు కూడా జీర్ణక్రియలో కీలకం. అలాగే చేతితో తింటే ఎంతకావాలో అంతే తింటాం. ఇది స్పూన్, ఫోర్క్ ద్వారా సాధ్యం కాదు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ న్యూ లుక్తో ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేశారు. షార్ట్ హెయిర్తో ఉండే వార్నర్ ఇలా లాంగ్ హెయిర్తో దర్శనమిచ్చారు. ‘కొత్త హెయిర్ స్టైల్ అద్భుతంగా వస్తోంది’ అంటూ ఓ ఫొటోని ఇన్స్టా స్టోరీగా పెట్టారు. పొడవైన జుట్టుతో కనిపించగానే.. వార్నర్ మళ్లీ ఏదైనా మూవీలో నటిస్తున్నారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన నితిన్ ‘రాబిన్ హుడ్’ మూవీలో నటించిన విషయం తెలిసిందే.
TG: ఈ మధ్యాహ్నం కేరళకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించనున్నారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. నివేదికలోని ప్రధాన అంశాలతో మంత్రి ఇప్పటికే నోట్ రెడీ చేసుకున్నారు. ఆ రిపోర్టుపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
KC వేణుగోపాల్ ప్రారంభించిన MP మెరిట్ అవార్డులకు దేశంలో ఎంతో ప్రత్యేకత ఉందని CM రేవంత్ పేర్కొన్నారు. కేరళలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘కేరళలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. TGలో విద్యాభివృద్ధిపై దృష్టి సారించాం. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.
దులీప్ ట్రోఫీలో భాగంగా క్వార్టర్ ఫైనల్-1లో నార్త్ జోన్ ప్లేయర్ ఆయుష్ బదోనీ(204*) డబుల్ సెంచరీతో రెచ్చిపోయారు. ఈస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో 223 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్సర్లతో ద్విశతకం బాదారు. ఫస్ట్ ఇన్నింగ్సులోనూ బదోనీ 63 పరుగులు సాధించారు. యశ్ ధుల్, అంకిత్ కుమార్ కూడా శతకాలు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నార్త్ జోన్ నేరుగా సెమీఫైనల్కు దూసుకెళ్లింది.
AP: జనసేన జాతీయ పార్టీ, TDP అంతర్జాతీయ పార్టీ అని YCP నేత పేర్ని నాని సెటైర్లు వేశారు. జనసేన సిద్ధాంతాలు అర్థంకాక ఆ పార్టీ నేతలే సతమతం అవుతున్నారని తెలిపారు. సుగాలి ప్రీతి పేరును వాడుకుని పవన్ రాజకీయాల్లో ఎదిగారని విమర్శించారు. ‘ప్రీతి కుటుంబానికి న్యాయం చేసింది YS జగనే. ఆమె కుటుంబానికి పవన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఆ కేసులో ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు.. చంద్రబాబును’ అని ఫైర్ అయ్యారు.
AP: రేషన్ షాపుల్లో రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గుంటూరు(D) తెనాలి(M) నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ‘ప్రజలకు నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తాం. నిన్నటి నుంచి కాకినాడ, ELR, GNT, చిత్తూరు జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీ ప్రారంభించాం. సెప్టెంబర్ 15 నాటికి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.
TG: 18 ఏళ్లు నిండకుండానే బైకులతో రోడ్లపై రయ్ రయ్ అంటూ మైనర్లు దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో తమ పిల్లలు ప్రాణాలు కోల్పోకూడదని జనగామ(D) నాగిరెడ్డిపల్లి గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండని వారు వాహనాలు నడిపితే పెరెంట్స్కు రూ.లక్ష జరిమానా విధించాలని తీర్మానించింది. ప్రమాదాల నివారణకు బాధ్యతతో ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం అన్ని గ్రామాలకు ఆదర్శనీయం.
Sorry, no posts matched your criteria.