News November 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 62

image

ఈరోజు ప్రశ్న: భీష్ముడు చనిపోవడానికి కారణమైన శిఖండి ఎవరు? ఆమె ఎందుకు అతని పతనాన్ని కోరుకుంది?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 10, 2025

అంచనాలు పెంచేసిన ‘ఉస్తాద్’ టీమ్

image

పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మీసాల పిల్ల(మన శంకర వరప్రసాద్ గారు), చికిరి(పెద్ది) పాటలు హిట్టవడంతో ఇక ‘ఉస్తాద్’ అప్డేటే మిగిలిందని అభిమానులు SMలో పోస్టులు చేస్తున్నారు. దీంతో మూవీ టీమ్ స్పందించింది. ‘అదే పనిలో ఉన్నాం. మీ అంచనాలను ఎక్కువగానే పెట్టుకోండి’ అని రాసుకొచ్చింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News November 10, 2025

నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: నేటి నుంచి ఈ నెల 26 వరకు HYDలోని సురవరం ప్రతాప్ రెడ్డి(పొట్టి శ్రీరాములు) యూనివర్సిటీలో గ్రూప్-3 మెరిట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. రోజూ 10:30am నుంచి 5.30pm వరకు కొనసాగనుంది. మొత్తం 1,365 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మెరిట్ జాబితా విడుదలైంది. TGPSC <>వెబ్‌సైట్‌లో<<>> అధికారులు పూర్తి వివరాలను అందుబాటులో ఉంచారు.

News November 10, 2025

గజగజ వణికిస్తున్న చలి.. జాగ్రత్త!

image

తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. రాత్రి నుంచి ఉదయం వరకు గజగజ వణికిస్తోంది. APలోని ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. నిన్న అల్లూరి(D) జి.మాడుగులలో అత్యల్పంగా 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు TGలో HYD శివారు పటాన్‌చెరులో కనిష్ఠంగా 13.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరుగుతుందని, చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 10, 2025

స్లీపింగ్ మాస్క్‌లు వాడుతున్నారా?

image

స్కిన్‌కేర్‌లో భాగంగా చాలామంది స్లీపింగ్ మాస్క్‌లు వాడటం ఎక్కువైంది. అయితే వీటిని ఎక్కువగా వాడటం నష్టమే అంటున్నారు నిపుణులు. ఈ మాస్కులు లైట్ క్రీమ్, జెల్‌తో ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. కానీ వీటిని రోజూ వాడటం వల్ల చర్మం ఎక్కువ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుందంటున్నారు నిపుణులు. సహజ తేమను కోల్పోయి, మొటిమలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. వారానికి 2సార్లు వాడటం మంచిదని సూచిస్తున్నారు.

News November 10, 2025

శ్రీశైలంలో ఈనెల 14న కోటి దీపోత్సవం

image

AP: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తొలిసారిగా ఈ నెల 14న కోటి దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉచితంగా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దీపోత్సవానికి అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే అందజేస్తుందని పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేందుకు పరిపాలన భవనంలోని శ్రీశైల ప్రభ కార్యాలయంలో 12వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

News November 10, 2025

AAIలో అప్రెంటిస్ పోస్టులు

image

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) 20గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ (B.COM, BA, BSc, BBA), డిప్లొమా అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24 వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.12వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు NATS పోర్టల్‌ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.aai.aero

News November 10, 2025

కరివేపాకు మొక్కలు గుబురుగా పెరగాలంటే?

image

కరివేపాకు మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగాక మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. మూడేళ్లు వచ్చిన కరివేపాకు చిన్న కొమ్మలను మొక్క మొదలు వరకు తుంచి, 4 లేదా 5 శాఖలు ఉండేలా ఉంచితే ఎక్కువ దిగుబడి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అలాగే పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులను మొక్కలకు వేస్తూ ఉండాలి.

News November 10, 2025

సోమవారం శివారాధన ఎందుకు చేయాలి?

image

శివారాధనకు సోమవారం అత్యంత విశిష్టమైన రోజు. మిగిలిన రోజులకంటే ఈరోజు శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుందని నమ్మకం. స్కంద పురాణం ప్రకారం.. శివుడు తన శిరస్సుపై సోముడిని ధరిస్తాడు కాబట్టే ఈ వారానికంత ప్రాధాన్యం. జాతకంలో శని దోషాలున్నవారు నేడు రాగి పాత్రలో గంగాజలం తీసుకొని, రుద్ర మంత్రంతో శివునికి అభిషేకం చేయాలట. ఇలా 11 సోమవారాలు చేస్తే బాధలు తగ్గి, సత్వర ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

News November 10, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* ఏలూరు(D) జంగారెడ్డిగూడెంలో దివంగత సింగర్ ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆయన కుమారుడు చరణ్ ఆవిష్కరించారు.
* PPP విధానంలో ప్రజలపై భారం పడకుండా పలు కీలక రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.2,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
* పట్టణాల్లోని వ్యాపార భవనాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ECBC) అమలులో దేశంలోనే AP అగ్రస్థానంలో నిలిచింది.