India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ అసెంబ్లీలో మూడు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు, మున్సిపల్ చట్టసవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. తొలుత మున్సిపల్, ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించారు.
TG: బిల్లుపై బీసీలకున్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ‘42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్పై కాంగ్రెస్ చర్చించాలి. మీ చేతిలోని అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేంటి ఇబ్బంది? మంత్రివర్గంలో BCల సంఖ్య ఎంత? బీసీల సంక్షేమం కోసం ఏడాదికి రూ.20 వేలకోట్లు చొప్పున ఇస్తామన్నారు. ఇప్పటికీ 4 పైసలు రాలేదు’ అని వ్యాఖ్యానించారు.
APలో సగానికి పైగా బార్లకు మళ్లీ దరఖాస్తులు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 840 బార్లకు మూడేళ్ల పరిమితితో నోటిఫికేషన్ ఇవ్వగా 388 బార్లకు నిన్న లాటరీలు తీసి, టెండర్లు ఖరారు చేశారు. నిబంధనల ప్రకారం ఒక బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు రాకపోవడంతో 452 బార్లకు లాటరీ తీయలేదు. 37 బార్లకు ఒకట్రెండు దరఖాస్తులే రావడంతో రేపటి వరకు గడువు పొడిగించారు. వీటికి నాలుగేసి దరఖాస్తులొస్తే ఎల్లుండి లాటరీ తీస్తారు.
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 665 పేజీలతో ప్రవేశపెట్టిన ఈ రిపోర్టును <
TG: ఆరునూరైనా BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. BC రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేశామని, అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రపతి దగ్గర ఉందని, ఈ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. దీనిపై ఢిల్లీలో తాము ఆందోళన చేస్తే BRS MPలు ఎందుకు రాలేదని అసెంబ్లీలో CM ప్రశ్నించారు.
TG: BCలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది, ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా అమలైతే తామూ సంతోషిస్తామని BRS MLA గంగుల కమలాకర్ తెలిపారు. ‘మేం BC బిల్లుకు గతంలో మద్దతు ఇచ్చాం. శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అవుతుందని, అశాస్త్రీయంగా వెళ్తే కోర్టులో మొట్టికాయలు పడతాయని చెప్పాం. మా సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన వేసిన BC కమిషన్ మాయమైంది’ అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను, పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఎమ్మెల్యేలకు పెన్ డ్రైవ్లో అందించింది. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు బండారు రాజిరెడ్డి, బానోతు మదన్ లాల్ మృతి పట్ల సభలో సంతాపం ప్రకటించారు.
రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా, KGF ఫేమ్ యశ్ రావణుడిగా ‘రామాయణ’ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. జటాయువు శ్రీరాముడికి సీత జాడ గురించి చెప్పే సన్నివేశంతో ఫస్ట్ పార్ట్ పూర్తవుతుందని, దానికి కొనసాగింపుగా రెండో పార్ట్ ఉంటుందని మూవీ టీమ్ తెలిపింది. జటాయువుకు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తారని వెల్లడించింది.
తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో తొలిసారి చర్చ జరగనుంది. ఇవాళ కాళేశ్వరంపై PC ఘోష్ రిపోర్ట్ సభలో బహిర్గతం కానుంది. కాళేశ్వరం అంతా తప్పేనని, డిజైన్ నుంచి పూర్తి నిర్మాణం వరకు KCR చెప్పినట్టే జరిగిందని GOVT విమర్శిస్తుంటే.. ఇంత గొప్ప ప్రాజెక్టే లేదని, దేశానికే రోల్ మోడల్ అని BRS వాదిస్తూ వచ్చింది. ఇవాళ సభకు <<17561158>>నివేదిక<<>> రానుండటంతో అందులో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
AP: అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది పాలన, పథకాల అమలు, బనకచర్ల ప్రాజెక్టు తదితర అంశాలపై సభలో చర్చించే అవకాశముంది.
Sorry, no posts matched your criteria.