India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్రె గుట్ట కూంబింగ్లో ల్యాండ్ మైన్స్ పేలి జవాన్లు మరణించిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ల్యాండ్ మైన్స్ పేలుడు జరగలేదని మావోయిస్టులతో ఎదురుకాల్పుల్లో మరణించారని సమాచారం. సుమారు నాలుగు గంటల పాటు కాల్పులు చోటు చేసుకున్నాయి. మృతులను RSI సుధీర్, సందీప్, పవన్గా గుర్తించారు. మృతదేహాలను వరంగల్ MGM మార్చురీకి తరలించగా డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర ఆసుపత్రికి చేరుకున్నారు.
రఫేల్ సహా భారత రక్షణ సంపదను ధ్వంసం చేశామన్న పాకిస్థాన్ ప్రభుత్వ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వ్యంగ్యంగా స్పందించారు. ‘పాక్ ప్రధాని, ఉప ప్రధాని, రక్షణ మంత్రి ఈ తరహా ప్రకటనలు చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆ దేశం పుట్టడంతోనే అబద్ధాలు మొదలుపెట్టింది. దేశ విభజన అనంతరమే కశ్మీర్లోకి చొరబడి ఆక్రమించిన పాక్, అక్కడ ఉన్నది తమ బలగాలు కావని UN సహా ప్రపంచాన్ని బుకాయించింది’ అని గుర్తు చేశారు.
వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడితో సింధు జలాల ఒప్పందం భారత్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది. 1960లో భారత్, పాక్ మధ్య జరిగిన సింధు ట్రీటీలో ప్రపంచ బ్యాంకు కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా ఆ అగ్రిమెంట్పై సంతకం కూడా చేసింది. ఈ ఒప్పందం ప్రకారం డ్యామ్ ఎత్తు పెంచే సమయంలో తప్ప పాక్కు నీటి తరలింపు నిలిపివేసేందుకు అవకాశం లేదు.
ముఖంపై ముడతలు తగ్గాలని చాలామంది ఫేస్ టేపింగ్ టెక్నిక్ వాడతారు. ముడతలు ఉన్న ప్రాంతాల్లో టేపులను వేసి, రాత్రంతా ఉంచుతారు. దీనివల్ల తాత్కాలిక ప్రయోజనమే ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ ఫేస్ టేపింగ్ ఎక్కువగా వాడితే ముఖంపై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇలా కాకుండా స్కిన్ కేర్పై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటేనే చర్మం అందంగా, యవ్వనంగా మెరిసిపోతుందని సూచిస్తున్నారు.
AP: టెన్త్ పాసైన విద్యార్థుల షార్ట్ మెమోలు(సబ్జెక్టుల వారీగా మార్కుల లిస్టు) విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వాటిని స్కూల్ లాగిన్ నుంచి HMలు డౌన్లోడ్ చేసుకుని, సైన్ చేసి స్టూడెంట్లకు అందజేయాలన్నారు. మెమోలలో ఏవైనా తప్పులుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. స్కూల్ అడ్మిషన్ రికార్డ్తోపాటు HM అటెస్ట్ చేసిన షార్ట్ మెమో కాపీలను ఈ నెల 25లోగా తమకు పంపాలని కోరారు.
‘ఆపరేషన్ సిందూర్’ కారణంగా పలు చోట్ల విమాన రాకపోకలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆల్ లద్దాక్ హోటల్ అండ్ గెస్ట్ హౌస్ అసోసియేషన్(ALHAGHA) తన ఆతిథ్య స్ఫూర్తిని చాటుకుంది. లద్దాక్ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయిన పర్యాటకులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఫ్లైట్లు రద్దై ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు తమ హోటళ్లు, గెస్ట్ హౌస్లలో ఎలాంటి ఖర్చు లేకుండా బస చేయొచ్చని ప్రకటించి మానవత్వం చాటుకుంది.
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ‘RAPO22’ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 15న రానుంది. ఇందులో రామ్ ఓ సినీ అభిమానిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. చేతిలో టికెట్లు పట్టుకొని ఉన్న ఫొటోను మూవీ టీమ్ షేర్ చేసింది. ‘ఒక అభిమాని.. ఒక షో.. మిలియన్ ఎమోషన్స్’ అంటూ పేర్కొంది. ఈ మూవీకి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ P.మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇరు దేశాల మధ్య దాడులపై నిష్పక్ష దర్యాప్తు జరగాలన్న పాక్ ప్రతిపాదనకు భారత్ దీటుగా బదులిచ్చింది. గతంలో ఎన్నో ఉగ్రదాడుల్లో పాక్ జాతీయుల ప్రమేయం ఉందని ఆధారాలతో సహా నిరూపించినా ఆ దేశం దర్యాప్తునకు సహకరించలేదని వెల్లడించింది. ముంబై ఉగ్రదాడి దోషి కసబ్ను అడ్రస్, DNAతో సహా నిరూపించినా పట్టించుకోలేదని MEA సెక్రటరీ విక్రమ్ మిస్రీ గుర్తు చేశారు. ఇప్పుడు వారు దర్యాప్తు కోరడం హాస్యాస్పదంగా పేర్కొన్నారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఢిల్లీకి వచ్చి వెళ్లే 90 విమానాలు రద్దయ్యాయి. వాటిలో 11 ఇంటర్నేషనల్ సర్వీసులు కూడా ఉన్నాయి. కేంద్రం ఆదేశాలతో త్వరలోనే విమానాలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. కాగా PAKలోని ఉగ్రవాద కేంద్రాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోందని కేంద్రం ప్రకటించింది.
అమ్మానాన్న విడిపోవడం లేదా ఇద్దరిలో ఒకరు చనిపోయినప్పుడు ఒంటరిగానే పిల్లలను పెంచాల్సి వస్తుంది. అప్పుడు ఎదురయ్యే సవాళ్లను తట్టుకొని నిలబడాలి. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, స్వీయసానుభూతి దూరం పెట్టాలి. ఉద్యోగం, పిల్లల సంరక్షణపై శ్రద్ధ, జీవితాన్ని సమన్వయం చేసుకోవడంపై సాధన చేయాలి. పిల్లలు కుంగుబాటుకు గురవకుండా వారికి తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. అప్పుడే వారు జీవితంలో ముందడుగు వేస్తారు.
Sorry, no posts matched your criteria.