India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ నియమితులయ్యారు. నంబాల కేశవరావు మరణం తర్వాత సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. దేవుజీని నియమిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది మేలో ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల మరణించారు.
AP: రెండేళ్ల క్రితం ఇదేరోజున తమ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయాన్ని గుర్తుచేస్తూ TDP ట్వీట్ చేసింది. ‘SEP 9, 2023 ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు. ఓ నియంత వ్యవస్థలను చెరబట్టి, అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేసి రాక్షసానందం పొందిన రోజు. నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందో వారికి ఆరోజు తెలియలేదు. ఆయనకు మద్దతుగా ప్రజలు ఉద్యమించి CBNను విజేతగా నిలిపారు’ అని పేర్కొంది.
నేపాల్లో సోషల్ మీడియాను పునరుద్ధరించినా నిరసనకారుల్లో ఆగ్రహజ్వాలలు చల్లారడం లేదు. ప్రజాప్రతినిధుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. దీంతో PM కేపీ ఓలీ దుబాయ్ పారిపోవాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. అటు నిరసనకారులు మాజీ డిప్యూటీ ప్రధాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అధికార పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబా ఇంటిని తగులబెట్టారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 22 నుంచి దసరా ఉత్సవాలు మొదలుకానున్నాయి. 11 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో ఆర్జిత సేవా టికెట్ల రుసుమును ఆలయ అధికారులు ఖరారు చేశారు. ఖడ్గమాలార్చనకు ₹5,116, ప్రత్యేక కుంకుమార్చనకు ₹3వేలు, మూలా నక్షత్రం రోజున ₹5 వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక శ్రీచక్రనవావరణార్చనకు ₹3 వేలు, ప్రత్యేక చండీహోమంకు ₹4 వేలు, పరోక్ష సేవకు ₹1,500 ఖరారు చేశారు.
బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి 2KM దూరంలో, అలకనంద నదీ తీరాన ‘బ్రహ్మకపాలం’ దర్శనమిస్తుంది. సరస్వతీ దేవిని మోహించినప్పుడు బ్రహ్మ 5 శిరస్సులలో ఒకదానిని శివుడు తన త్రిశూలంతో ఖండించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే బ్రహ్మకు 4 తలలు మాత్రమే కనిపిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ శిరస్సు పడిన ప్రాంతమే ‘బ్రహ్మకపాలం’గా మారిందని అంటారు. ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
సీల్ తీసి ఉన్న, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లో విత్తనాలను కొనరాదు. విత్తన తయారీ కంపెనీ, ప్రదేశం వివరాలను షాప్ యజమానిని అడిగి తెలుసుకోవాలి. విత్తనాలు కొనే సమయంలోనే తూకం వేసి తీసుకోవాలి. విత్తనం వల్ల పంట నష్టం జరిగితే రైతుకు కొనుగోలు రశీదులే కీలక ఆధారాలు. అందుకే పంటకాలం పూర్తయ్యేవరకు వాటిని రైతులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పూత రానిపక్షంలో నష్టపరిహారం కోసం రసీదు అవసరం.
మాంగనీస్ లోపం చీనీ, నిమ్మ తోటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల ఆకుల మీద పసుపు రంగు లేక పాలిపోయిన మచ్చలు ఏర్పడి క్రమంగా అవి తెల్లగా మారతాయి. ఆకులు కిందకు ముడుచుకొని బోర్లించిన గిన్నెలా అవుతాయి. ఆకులు మీద ఈ లోప చిహ్నాలను సులభంగా గుర్తించవచ్చు. నివారణ కోసం మాంగనీస్ సల్ఫేట్ 0.1 శాతం ద్రావణాన్ని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసి లోపాన్ని నివారించవచ్చు.
ఈ ఏడాది రిలీజైన లోబడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (₹50 కోట్లు) రూ.303 కోట్లు రాబట్టింది. ‘మహావతార్ నరసింహ’(₹15Cr) చిత్రం రూ.315కోట్లు, అహాన్ పాండే ‘సైయారా’ మూవీ (₹40Cr) రూ.569+ కోట్లు కలెక్ట్ చేశాయి. అలాగే మోహన్ లాల్ ‘తుడరుమ్’(₹35కోట్లు)కు రూ.235కోట్లు, దుల్కర్ నిర్మించిన ‘కొత్త లోక’ (₹30Cr) మూవీకి రూ.185+కోట్లు వచ్చాయి. ఇందులో మీకేది నచ్చింది?
TG: రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, HYD, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, NZB, పెద్దపల్లి, సిరిసిల్ల, RR, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, WGL, భువనగిరి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వానలు పడతాయని అంచనా వేసింది.
లక్షలాది ప్రయాణికుల భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే లోకో పైలట్ నియామకంలో రిజర్వేషన్లు ఉండొద్దని ఓ ప్రొఫెసర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. సిగ్నల్స్, రూట్స్, ఇంజిన్ నియంత్రణకు బాధ్యత వహించే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ను తక్కువ మార్కులొచ్చిన వారికి ఎలా ఇస్తారని మండిపడ్డారు. నోటిఫికేషన్లో URకు 66.66 మార్కులు కట్ఆఫ్గా ఉంటే BC & EWSలకు 40, SCలకు 34, STలకు 25 మార్కులు ఉన్నాయి. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.